విరాట్ కోహ్లీ-అనుష్క శర్మ మరోసారి జంటగా నటించిన ఓ యాడ్ ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. గతంలో వీరిద్దరూ కలిసి షాంపూ, ఓ వస్త్ర దుకాణానికి చెందిన ప్రకటనల్లో నటించిన సంగతి తెలిసిందే. తాజాగా వచ్చిన యాడ్లో కూడా వీరి జోడీ ఆకట్టుకుంది. అయితే, ఈ సారి వీరు ఓ రొమాంటిక్ యాడ్తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు.
కొత్త యాడ్ను కోహ్లీ తన ట్విటర్ ద్వారా అభిమానులతో పంచుకున్నాడు. వీరిద్దరి మధ్య సంభాషణ ఎంతో ఆకట్టుకుంది. ఇంతకీ ఈ యాడ్లో ఏముందంటే… బిజీగా పనిచేసుకుంటున్న అనుష్క శర్మకి విరాట్ కోహ్లీ కాఫీ తీసుకొచ్చి ఇస్తాడు. వెంటనే ఆ కాఫీ తాగేందుకు అనుష్క శర్మ ప్రయత్నించగా.. కాస్త ఆగు కాఫీ వేడిగా ఉందంటూ కోహ్లీ ప్రేమతో కాఫీని చల్లారుస్తాడు. ఆ ప్రేమకి ముగ్ధురాలైన అనుష్క శర్మ.. కోహ్లీ ముక్కు పట్టుకుని ముద్దాడుతుంది. అప్పుడు కోహ్లీ… అందరూ అడుగుతుంటారు.. ‘మీ ప్రేమలో స్పెషల్ ఏంటి అని?’ అని అంటుండగానే మధ్యలో అనుష్క శర్మ కలగజేసుకుని.. ‘ఏమీ లేదు’ అని మొదట బదులిచ్చి ఆ తర్వాత.. ‘జస్ట్ ప్యూర్ లవ్’ అంటూ నవ్వేస్తుంది. ఇంకెందుకు ఆలస్యం ఈ యాడ్పై మీరు కూడా ఓ లేక్కేయండి మరి.
Was a joy shooting for this, #PureFun!
Check out the new Shyam Steel ad for their TMT bars made from #PureSteel.@AnushkaSharma @shyamsteel#PureLove #ShyamSteel #TMT pic.twitter.com/f9K9X7jhy3— Virat Kohli (@imVkohli) March 20, 2019