విజయవాడ: ఏపీలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే పేదోడికి కనీస ఆదాయ భరోసా కల్పిస్తామని, ఏడాదికి ఉచితంగా నాలుగు గ్యాస్ సిలిండర్లు ఇస్తామని పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి స్పష్టం చేశారు. అలాగే రైతులు, డ్వాక్రా మహిళలకు వడ్డీలేని రుణాలు ఇస్తామని, రాజీవ్ ఆరోగ్యశ్రీ తీసుకొచ్చి రూ.5 లక్షల వరకు ఉచిత వైద్యం అందిస్తామని అన్నారు. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోను పార్టీ నేతలతో కలిసి శుక్రవారం విడుదల చేశారు. ఈ సందర్భంగా రఘువీరారెడ్డి మాట్లాడుతూ… ఫీజు రీయింబర్స్మెంట్ను సమర్థంగా అమలు చేస్తామని, చేనేత కార్మికుల అప్పులు పూర్తిగా మాఫీ చేస్తామని హామీ ఇచ్చారు. వారికి జీఎస్టీ నుంచి మినహయింపు ఇస్తామని తెలిపారు. ఉద్యోగులకు మేలు చేసేందుకు కాంట్రిబ్యూటరీ పింఛన్ విధానాన్ని (సీపీఎస్) రద్దు చేస్తామని హామీ ఇచ్చారు. పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టు చేసే బాధ్యత కాంగ్రెస్దేనని పేర్కొన్నారు. వంద శాతం కేంద్రం నిధులతో పోలవరం పూర్తి చేస్తామని వెల్లడించారు.
హామీలు ఇవే..
* 70 ఏళ్లు దాటిన వారికి రూ. 3వేలు పెన్షన్.
* పేదోడికి సంవత్సరానికి ఉచితంగా 4 గ్యాస్ సిలిండర్లు.
* దళిత క్రైస్తవులను ఎస్సీలుగా గుర్తించేందుకు కృషి.
* రజకులు, వడ్డెరులను ఎస్సీ జాబితాలో చేరుస్తాం.
* వాల్మీకి, మత్స్యకారులను ఎస్టీ జాబితాలో చేరుస్తాం.
131981 189483View the following suggestions less than and locate to know how to observe this situation whilst you project your home business today. Earn cash from home 174961
411522 596895Some genuinely prime posts on this web site , bookmarked . 20852