కరువు పరిస్థితుల్లో రాజు తన ప్రజలకు ఇబ్బందులు రాకుండా ఆదుకుంటాడని మనం పౌరాణిక సినిమాల్లో చూశాం. కానీ.. ఆఫ్రికా ఖండంలోని స్వాజిలాండ్ పరిపాలిస్తున్న రాజు ఇందుకు విరుద్ధంగా చేస్తున్నాడు. ప్రజల కష్టాలు తీర్చడం మానేసి తన 15మంది భార్యలతో కలిసి విలాసాలతో గడిపేస్తున్నాడు.
ఆఫ్రికా ఖండంలో రాజరికం అమల్లో ఉన్న దేశాల్లో స్వాజిలాండ్ ఒకటి. ఆ దేశాన్ని పాలిస్తున్న రాజు పేరు మస్వతిIII. అక్కడ అధికారం మొత్తం రాజుదే. ప్రభుత్వాలు ఈయన ఆజ్ఞలు అనుసరించి నడుచుకోవాల్సిందే. దీంతో ప్రభుత్వ ఆదాయంలో సగం రాజుకే చెందుతోంది. దీంతో ఆయన విలాసాలకు అడ్డు ఉండటం లేదు. ఎంతగా అంటే.. తన 15మంది భార్యలకు ఏకంగా 175కోట్లు పెట్టి 19 రోల్స్ రాయిస్ కార్లు కొనుగోలు చేసేంత. ఈ విషయం అందరినీ విస్మయానికి గురి చేస్తోంది.
కారణం.. ప్రస్తుతం కరోనా ప్రపంచాన్ని వణికించేస్తోంది. ఆఫ్రికా దేశాల్లో కూడా ఈ మహమ్మారి తన ప్రతాపం చూపిస్తోంది. కోరానా అక్కడ కూడా కోరలు చాచింది. దీంతో ప్రజలు మరింతగా ఇబ్బందులు పడుతున్నారు. ఈ పరిస్థితుల్లో అంత మొత్తంతో ప్రజల అవసరాలు తీర్చొచ్చు. అయితే.. ఇవేమీ రాజుకు పట్టడం లేదట.
నిరుద్యోగం, కరువు, ఆకలి కేకలు ఆయనకేమీ పట్టటం లేదని అక్కడి ప్రజలు, నాయకులు అనుకుంటున్నారట. కానీ.. రాజును ధిక్కరించి వారేమీ చేయలేక నిస్సహాయులై ఉండిపోతున్నారట. పేదల కడుపు నింపడం మానేసి కార్లతో ఇల్లు నింపుకుంటున్నాడంటూ ఆయనపై విమర్శలు వస్తున్నాయి.
664885 595192Some truly good stuff on this internet web site , I like it. 11156
256937 871657Whoa! This weblog looks just like my old one! Its on a completely different subject but it has pretty much exactly the same layout and design. Outstanding choice of colors! 263468
71536 898615wohh precisely what I was looking for, thankyou for putting up. 654619