Switch to English

జగన్ పాలనలో ‘కమ్మ’దనం కష్టమే

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,460FansLike
57,764FollowersFollow

చంద్రబాబు ఓటమి వల్ల ఎక్కువ నష్టం ఎవరికి జరిగిందని విశ్లేషిస్తే.. ఆయన సొంత సామాజిక వర్గానికేనని స్పష్టం అవుతుంది. చంద్రబాబు సీఎంగా ఉన్న ఐదేళ్ల కాలంలో ఆయన క్యాబినెట్‌లో ఆయనతోపాటు.. దేవినేని ఉమ, కామినేని శ్రీనివాస్‌, పుల్లారావు, పరిటాల సునీత.. తదుపరి లోకేష్‌.. ఇలా మొత్తం 6 గురు కమ్మవారు ప్రాతినిధ్యం వహించారు. ఇదికాక.. విప్‌గా చింతమనేని, స్పీకర్‌గా కోడెల ఉండేవారు. కార్పోరేషన్‌ చైర్మన్‌ పదవుల్లో, డైరెక్టర్లుగా.. దేవాలయ, గ్రంధాలయ సంస్థల్లో.. కీలకమైన ప్రభుత్వ పదవుల్లో, యూనివర్సిటీల్లో, ఏపీపీఎసీ చైర్మన్‌ పదవులు.. ఇలా కొన్ని వేల ప్రభుత్వ పదవుల్లో చంద్రబాబు తన సొంత సామాజిక వర్గానికి భారీవాటా ఇచ్చారు. కాంట్రాక్టులు, నామినేషన్‌ పనుల్లోనూ సింహభాగం వారిదే. కొన్ని పత్రికలు, చానెళ్లు బాగా లాభపడ్డాయి. ఐదేళ్లూ కమ్మ సామాజిక వర్గానికి చంద్రబాబు పాలన స్వర్ణయుగంలా సాగిపోయింది.

టీడీపీ ఓటమి చెంది.. వై.ఎస్‌.జగన్మోహన్‌ రెడ్డి ముఖ్యమంత్రి కావడంతో.. మరో ఐదేళ్లపాటు రాజ్యమేలాలనుకొన్న ఆ వర్గానికి కష్టకాలం దాపురించింది. జగన్‌ క్యాబినెట్‌లో ఒకే ఒక మంత్రి పదవి దక్కింది. విప్‌ పదవుల్లో ఒక్కటీ లభించలేదు. గత నామినేటెడ్‌ పోస్ట్‌లన్నీ ఇవాళో, రోపో రద్దు కానున్నాయి. చంద్రబాబు అస్మదీయులు నామినేషన్‌ మీద అడ్డగోలుగా కాంట్రాక్టులు దక్కించుకొనే అవకాశం లేకుండా పోయింది.

మిగతా సామాజిక వర్గాల పరిస్థితిని విశ్లేషిస్తే గతం కంటే మెరుగ్గానే ఉన్నట్లు కనపడుతుంది. రెడ్డి సామాజిక వర్గానికి గత ఐదేళ్లూ గడ్డుకాలం ఎదురైంది కనుక జగన్‌ పాలనలో ఈసారి వారు లాభపడతారు. కాపులకు లోగడ మాదిరిగానే 5 మంత్రి పదవులు దక్కాయి కనుక వారికి నష్టం జరిగే అవకాశంలేదు. లాభపడిన మిగతా సామాజిక వర్గాలను చూస్తే.. మైనార్టీ, ఎస్టీ, బ్రాహ్మణ వర్గాలు ఉన్నాయి. మొత్తం మీద బీసీలకు గత ఐదేళ్ల కంటే మేలే జరుగుతుంది. కీలకమైన స్పీకర్‌ పదవి బీసీ వర్గానికి చెందిన తమ్మినేని సీతారాంకు దక్కింది.

చంద్రబాబు వల్ల గత ఐదేళ్లుగా లాభపడిన కమ్మ కులస్థులు.. రాబోయే ఐదేళ్లూ గతంలో మాదిరిగా అన్నింటా తామే ఉండే అవకాశం లేదు. అధికారంలో ఉన్నప్పుడు ఏదోఒక కులానికి.. అదికూడా సంఖ్యాపరంగా తక్కువగా ఉన్న వర్గానికి లాభం చేకూరిస్తే అసలుకే మోసం వస్తుంది. మిగతా కులాలు తిరగబడతాయి. ఇపుడు ఏపీలో జరిగింది అదే.

చంద్రబాబుకు వ్యతిరేకంగా అనేక సామాజిక వర్గాలు జగన్‌కు చేరువయ్యాయి. అధికారంలో అందరికీ సముచిత వాటా ఇవ్వాలి. కానీ, వండింది అంతా మనమే తినాలి.. అనే ధోరణి ప్రదర్శిస్తే.. చంద్రబాబుకు పట్టిన గతే పడుతుంది. అందుకేనేమో.. జగన్‌ తన సొంత సామాజిక వర్గానికి అధికారంలో ఎక్కువ వాటా ఇవ్వకుండా జాగ్రత్త పడుతున్నారు. చివరివరకూ జగన్‌ పదవుల పంపకంలో ఇదే సమతుల్యత పాటించాలి. లేకుంటే చంద్రబాబుకు ఎదురైన చేదు అనుభవమే ఎదురవుతుంది. ఒకసారి అధికారం కోల్పోతే.. దానిని నిలబెట్టుకోవడం ఎంతో కష్టం!

Related Posts

జగన్‌ హయాంలో సర్కారీ స్కూళ్ళు హుళక్కే

బాలయ్య తనయుడు మోక్షజ్ఞకి ‘ఆ’ ఉద్దేశ్యం లేదా.?

జగన్‌కి స్వామీజీ ఆశీస్సులు.. సింగర్‌ చీవాట్లు

చంద్రబాబు.. హిమాలయాల నుంచి కిందకు దిగారు

4 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Movie: శ్రీ కమలహాసిని మూవీ మేకర్స్ ప్రొడక్షన్ నెం.1 మూవీ ప్రారంభం

Movie: ప్రస్తుతం ట్రెండ్ కంటెంట్, కాన్సెప్ట్ ఉన్న సినిమాలదే. అలా వచ్చిన సినిమాలను ప్రేక్షకులు ఆదరిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శ్రీ కమలహాసిని మూవీ...

Samantha: ఈసారి సరికొత్త లుక్.. పుట్టినరోజున ‘సమంత’ కొత్త సినిమా అప్డేట్

Samantha: సౌత్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha) కొన్నాళ్లుగా సినిమాలు చేయడం లేదు. సమంత నుంచి కొత్త సినిమా కబురు కోసం ఆమె అభిమానులు ఎప్పటినుంచో...

Chiranjeevi: లేటెస్ట్ అప్డేట్..! చిరంజీవి ‘విశ్వంభర’ కోసం భారీ సెట్స్..

Chiranjeevi: మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi) నటిస్తున్న సినిమా ‘విశ్వంభర’. (Vishwambhara) వశిష్ఠ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా యూవీ క్రియేషన్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. చిరంజీవి...

Varun Tej: ‘ప్రజలే పవన్ కల్యాణ్ కుటుంబం..’ జనసేన ప్రచారంలో వరుణ్...

Varun Tej: ఏపీలో ఎన్నికల హీట్ రోజురోజుకీ పెరుగుతోంది. నేతలంతా ప్రచారాలతో హోరెత్తిస్తున్నారు. ఈక్రమంలో బాబాయి పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కు మద్దతుగా.. జనసేన...

Faria Abdullah: ఈరోజుల్లో ‘ఆ ఒక్కటీ అడక్కు’ కంటెంట్ అవసరం: ఫరియా...

Faria Abdullah: అల్లరి నరేశ్ (Allari Naresh)-ఫరియా అబ్దుల్లా (Faria Abdullah) హీరోహీరోయిన్లుగా నటించిన సినిమా ‘ఆ ఒక్కటీ అడక్కు' (Aa Okkati Adakku). త్వరలో...

రాజకీయం

Janasena: ‘జనసేన’కు ఈసీ గుడ్ న్యూస్.. కామన్ సింబల్ గా ‘గ్లాసు’ గుర్తు..

Janasena: జనసేన (Janasena) పార్టీకి కేంద్ర ఎన్నికల కమిషన్ శుభవార్త చెప్పింది. పార్టీకి కామన్ సింబల్ గా ‘గాజు గ్లాస్’ గుర్తు కేటాయించాలని ఆదేశాలు జారీ చేసింది. ఈమేరకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్...

వైఎస్ షర్మిల ఎఫెక్ట్: క్రిస్టియన్ ఓట్లు వైసీపీకి దూరమయినట్టేనా.?

వైఎస్ షర్మిల, పదే పదే ‘క్రిస్టియన్’ ప్రస్తావన తీసుకొస్తున్నారు ఎన్నికల ప్రచారంలో. ‘మన మతం..’ అంటూ అన్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ‘క్రిస్టియానిటీ’ని గుర్తు చేస్తున్నారామె.! ఇంకోపక్క, వైఎస్ జగన్ మేనత్త...

ఇన్‌సైడ్ స్టోరీ: తునిలో కూటమికి అలా సెట్టయ్యింది.!

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని తుని నియోజకవర్గం విషయమై నిన్న మొన్నటిదాకా కూటమిలో కొంత గందరగోళం వుండేది. సీట్ల పంపకాల్లో తుని నియోజకవర్గం టీడీపీకి దక్కింది. మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు కుమార్తె యనమల...

పిఠాపురంలో వరుణ్ తేజ్ ప్రచారంపై వైసీపీ ఏడుపు.!

వైసీపీ కంటే, వైసీపీ పెంచి పోషిస్తోన్న నీలి కూలి మీడియా ఎక్కువ బాధపడిపోతోంది కొన్ని విషయాల్లో. సినీ నటుడు వరుణ్ తేజ్, పిఠాపురం నియోజకవర్గంలో జనసేన పార్టీ తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహిస్తే,...

నవరత్నాలు ప్లస్సు కాదు.. ఇప్పుడు మైనస్.!

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, ఎన్నికల మేనిఫెస్టో ప్రకటించింది. దీనికి ‘నవరత్నాలు ప్లస్’ అని పేరు పెట్టుకుంది ఆ పార్టీ. రైతులకు రుణ మాఫీ సహా, పలు కీలక అంశాలు కొత్త మేనిఫెస్టోలో వైసీపీ...

ఎక్కువ చదివినవి

నవరత్నాలు ప్లస్సు కాదు.. ఇప్పుడు మైనస్.!

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, ఎన్నికల మేనిఫెస్టో ప్రకటించింది. దీనికి ‘నవరత్నాలు ప్లస్’ అని పేరు పెట్టుకుంది ఆ పార్టీ. రైతులకు రుణ మాఫీ సహా, పలు కీలక అంశాలు కొత్త మేనిఫెస్టోలో వైసీపీ...

Allari Naresh: అల్లరి నరేశ్ ‘ఆ ఒక్కటీ అడక్కు’.. ఫన్ గ్యారంటీ: నిర్మాత రాజీవ్

Allari Naresh: చాన్నాళ్ల తర్వాత తన మార్కు కామెడీతో అల్లరి నరేష్ (Allari Naresh) నటించిన లేటెస్ట్ మూవీ 'ఆ ఒక్కటీ అడక్కు' (A. మల్లి అంకం దర్శకుడిగా పరిచయమవుతున్న సినిమాను రాజీవ్...

ఉప్మాకి అమ్ముడుపోవద్దు: పవన్ కళ్యాణ్ స్ట్రాంగ్ వార్నింగ్.!

ఇది మామూలు వార్నింగ్ కాదు.! చాలా చాలా స్ట్రాంగ్ వార్నింగ్.! అయితే, ఆ హెచ్చరిక ఎవర్ని ఉద్దేశించి.? ఉప్మాకి అమ్ముడుపోయేటోళ్ళు రాజకీయాల్లో ఎవరుంటారు.? ఉప్మాకి అమ్ముడుపోవద్దని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎవర్ని...

చిరంజీవిపై ‘మూక దాడి’.! వైసీపీకే పెను నష్టం.!

వైఎస్ వివేకానంద రెడ్డికే అక్రమ సంబంధాలు అంటగట్టిన ఘన చరిత్ర వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీది.! వైఎస్ షర్మిలా రెడ్డిని కాస్తా మెరుసుపల్లి షర్మిల శాస్త్రి.. అంటూ ఎగతాళి చేసిన ఘనత వైసీపీకి కాక...

ఇన్‌సైడ్ స్టోరీ: తునిలో కూటమికి అలా సెట్టయ్యింది.!

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని తుని నియోజకవర్గం విషయమై నిన్న మొన్నటిదాకా కూటమిలో కొంత గందరగోళం వుండేది. సీట్ల పంపకాల్లో తుని నియోజకవర్గం టీడీపీకి దక్కింది. మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు కుమార్తె యనమల...