చంద్రబాబు హిమాలయాలకు ఎప్పుడు వెళ్లారా అనుకుంటున్నారా? ఇది మంచు పర్వతాలైన హిమాలయాల గురించి కాదు.. ఏపీ ప్రజల సొమ్ముతో అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు తాగిన హిమాలయన్ మంచి నీళ్ల గురించి. అధికారంలో ఉన్నప్పుడు బాబు చేసిన దుబారా అంతా ఇంతా కాదని వైఎస్సార్ సీపీ నేతలు ఆరోపిస్తుంటారు. ఎక్కడికి వెళ్లినా ప్రత్యేక విమానాలు వినియోగించడం.. ఏ చిన్న పని చేసినా దానికి బోలెడంత డబ్బు ఖర్చుపెట్టి ప్రచారం చేసుకోవడం వంటి అంశాలను వారు ప్రస్తావిస్తుంటారు. ఇక చంద్రబాబు సమీక్షలకు అరలీటరు రూ.60 ఉండే హిమాలయన్ వాటర్ బాటిళ్లను మాత్రమే వినియోగించేవారు.
రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దారుణంగా ఉన్నప్పటికీ, ఇలాంటి విషయాల్లో ఎంత మాత్రం ఆర్థిక క్రమశిక్షణ పాటించలేదనే విమర్శలు వ్యక్తమయ్యాయి. మొత్తమ్మీద అధికారంలో ఉన్న ఐదేళ్లలో ఇలా పలు అంశాల్లో విపరీతంగా చేసిన ఖర్చుతో రాష్ట్ర ఖజానా దివాలా తీసింది. ఈ పరిస్థితుల్లో ఎన్నికల్లో ఓటమి చవిచూసిన చంద్రబాబు.. రెండు వారాలపాటు బయట ఎక్కడా కనిపించలేదు. అనంతరం విజయవాడ నుంచి హైదరాబాద్ వచ్చారు. ఎలాగో తెలుసా? ఎయిరిండియా విమానంలో. గరిష్టంగా రూ.15 వేల టికెట్ ఉండే సాధారణ ఫ్లైట్ లో హైదరాబాద్ వచ్చి గవర్నర్ ని కలిశారు. అదే అధికారంలో ఉన్నప్పుడు మాత్రం హైదరాబాద్ వెళ్లాలన్నా.. చెన్నై చేరుకోవాలన్నా.. ప్రత్యేక విమానాల్లోనే తిరిగేవారు. ఇక ఎన్నికల సమయంలో అయితే, కారులో తిరిగినట్టుగానే ప్రత్యేక హెలికాప్టర్లో తిరిగారు.
ప్రస్తుతం అధికారానికి దూరం కావడంతో ప్రయాణాలు మామూలు విమానాలకు మారాయి. హిమాలయన్ వాటర్ బాటిళ్ల నుంచి బిస్లరీకి దిగారు. ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత అంతగా బయటకు రాని చంద్రబాబు.. తాజాగా సోమవారం పార్టీ నేతలతో సమావేశమయ్యారు. అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహం గురించి చర్చించారు. ఈ సందర్భంగా చంద్రబాబు బాటిల్ స్థానంలో హిమాలయన్ కు బదులు సాధారణ గ్లాసు దర్శనమివ్వడం గమనార్హం. పార్టీ నేతలకు సాధారణ బిస్లరీ వాటర్ ఇచ్చారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు వైఖరి చూసినవారు ప్రజల డబ్బు అయితే ఒకలా.. సొంత సొమ్ము అయితే మరోలా ఖర్చు చేస్తారా అనే సెటైర్లు వేస్తున్నారు. ఇక ఈ ఎన్నికల్లో గెలుపొంది పాలనా పగ్గాలు చేపట్టిన జగన్.. చాలా సింపుల్ గా ఉండటం అధికారులను సైతం ఆకట్టుకుంటోంది. ఆయన సమీక్షా సమావేశాల్లో కిన్లే వాటర్ బాటిళ్లే కనపడుతున్నాయి. ఇకపై తమ సమీక్షల్లో హిమాలయన్ వాటిర్ బాటిళ్లు కనపడవంటూ వైఎస్సార్ సీపీ పార్లమెంటరీ నేత విజయసాయిరెడ్డి చెప్పినట్టుగానే అధికారులు కూడా వ్యవహరిస్తున్నారు.
అయితే, జగన్ ప్రమాణ స్వీకారానికి చాలా తక్కువ ఖర్చుపెట్టామని వైఎస్సార్ సీనీ నేతలు చెబుతున్నప్పటికీ, ఆ కార్యక్రమానికి భారీగానే ఖర్చయిందని సమాచారం. చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి పెట్టిన ఖర్చుతో పోలిస్తే తమది చాలా తక్కువ మొత్తమని వైఎస్సార్ సీపీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. ఇక జగన్ సైతం ఎన్నికల్లో గెలుపొందిన తర్వాత ప్రత్యేక విమానంలోనే తిరిగారు. గతంలో చంద్రబాబును విమర్శించిన జగన్.. తాను కూడా అలాగే వ్యవహరించారు. హైదరాబాద్, తిరుపతి ప్రత్యేక విమానాల్లోనే వెళ్లారు. చాలా విషయాల్లో పొదుపు పాటిస్తున్న జగన్.. ఈ విషయంలో కూడా ఖజానాపై భారం పడేలా వ్యవహరించకపోతే బాగుంటుందనే వ్యాఖ్యలు వినపడుతున్నాయి. మరి జగన్ ఎలా స్పందిస్తారో చూడాలి.
Related Posts
టీడీపీలో పెద్దోడితో చిన్నోడి ‘కమ్మ’ని ఫైట్
చంద్రబాబుని తిడితే లాభమేంటి మోడీజీ!
881654 411731The electronic cigarette uses a battery and a small heating component the vaporize the e-liquid. This vapor can then be inhaled and exhaled 939612
743852 277413An fascinating discussion is price comment. I believe that you need to write extra on this topic, it may not be a taboo topic but generally individuals are not enough to speak on such topics. Towards the next. Cheers 303117
470034 642538Thanks for your time so much for your impressive and remarkable guide. I will not be reluctant to endorse your internet websites to any individual who need to receive direction on this problem. 521459
I do not know if it’s just me or if perhaps everyone else experiencing problems
with your blog. It looks like some of the text on your
content are running off the screen. Can somebody else
please comment and let me know if this is happening to them as well?
This might be a issue with my internet browser because I’ve had this happen previously.
Appreciate it
929765 244431Some truly nice stuff on this site , I like it. 819512