Switch to English

ఢిల్లీకి జగన్‌.. ఈసారీ ‘ఖర్చు దండగ’ వ్యవహారమేనా.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,466FansLike
57,764FollowersFollow

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి ఢిల్లీకి వెళ్ళడమంటే ఖర్చు దండగ వ్యవహారమని చంద్రబాబు హయాంలోనే చాలా విమర్శలు వెల్లువెత్తాయి. ఆ విమర్శలు చేసింది స్వయానా ఇప్పుడు అధికారంలో వున్న వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీనే. ‘ప్రత్యేక విమానాల్లో చక్కర్లు కొడ్తున్నారు..’ అంటూ వైసీపీ, అప్పటి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై చేసిన విమర్శలు అన్నీ ఇన్నీ కావు. మరి, ఇప్పుడు వైఎస్‌ జగన్‌ చేస్తున్నదేమిటి.? ముఖ్యమంత్రి, ఢిల్లీకి వెళ్ళడం.. కేంద్ర ప్రభుత్వ పెద్దల్ని కలవడం తప్పేమీ కాదు.

కేంద్ర – రాష్ట్ర సంబంధాలు బలోపేతమవడానికి ఇలాంటి పర్యటనలు ఉపకరిస్తాయి. కానీ, అక్కడ కేంద్రం.. రాష్ట్రానికి సాయం చేయాలన్న ఆలోచనతో వుంటేనే.. అది సాధ్యమవుతుంది. దురదృష్టవశాత్తూ కేంద్రానికి ఆ ఆలోచనే లేదు. చంద్రబాబు హయాంలోనూ అదే జరిగింది.. ఇప్పుడు వైఎస్‌ జగన్‌ హయాంలోనూ అదే జరుగుతోంది.

అప్పట్లో పరిస్థితులు, ఇప్పటితో పోల్చితే కాస్త బెటర్‌ అనుకోవాల్సి వస్తోంది. ఉమ్మడి తెలుగు రాష్ట్రం విభజన తర్వాత.. రాష్ట్రానికి కొన్ని ప్రాజెక్టులు కేంద్రం మంజూరు చేయాలి గనుక.. అప్పట్లో టీడీపీ – బీజేపీ మిత్రపక్షాలు గనుక.. రాష్ట్రానికి కొన్ని ‘పనులు’ నెరవేరిన మాట వాస్తవం. అయితే, అవి పూర్తిస్థాయిలో నెరవేరలేదన్నదీ నిర్వివాదాంశం.

ఇప్పుడు పరిస్థితి మరీ ఘోరం. ప్రధాని నరేంద్ర మోడీ అపాయింట్‌మెంట్‌ రాష్ట్ర ముఖ్యమంత్రికి దొరకడం గగనమే అయిపోయింది. చంద్రబాబు కూడా, ఈ పరిస్థితిని ఎదుర్కోవాల్సి వచ్చిందనుకోండి.. అది వేరే విషయం. రెండ్రోజుల క్రితమే ఢిల్లీకి వెళ్ళి, మోడీని కలిసొచ్చిన వైఎస్‌ జగన్‌, కేంద్రం నుంచి రాష్ట్రానికి ఏం భరోసా ఈ సమావేశం ద్వారా వచ్చిందో మాత్రం చెప్పలేదు. ఇప్పుడు మళ్ళీ ఢిల్లీకి వెళ్ళారు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌.

ఇప్పుడు కూడా రాష్ట్రానికి ఏదన్నా మేలు జరుగుతుందని ఎవరైనా ఆశిస్తే, అంతకన్నా హాస్యాస్పదం ఇంకోటుండదు. ‘ఆంధ్రప్రదేశ్‌ నుంచి ఢిల్లీకి ప్రత్యేక విమానంలో వెళ్ళడం దండగ.. ఇది ఖచ్చితంగా ఖర్చు దండగ వ్యవహారమే..’ అని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. రాష్ట్ర బీజేపీ నేతలు, రాష్ట్ర ప్రయోజనాల గురించి అస్సలేమాత్రం ఆలోచించరు.. రాష్ట్రంలో మాత్రం, వీర లెవెల్లో హడావిడి చేసేస్తుంటారు. ఒక్కరంటే ఒక్క నాయకుడైనా, తాము అధిష్టానాన్ని ఒప్పించి.. ఒక్క ప్రాజెక్టుని రాష్ట్రానికి తెప్పించామని గుండె మీద చెయ్యేసుకుని చెప్పగలరా.?

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Nani: ‘జెర్సీ’ @5..! ధియేటర్లో సినిమా చూసిన నాని.. ఎమోషనల్ పోస్ట్

Nani: నాని (Nani) హీరోగా గౌతమ్ తిన్ననూరి (Gowtham Thinnanuri) దర్శకత్వంలో వచ్చిన ‘జెర్సీ’ (Jersey) విడుదలై నిన్నటికి 5ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా సినిమాను...

Upasana: ఆవకాయ పట్టిన అత్తమ్మ.. ఆటపట్టించిన ఉపాసన.. వీడియో వైరల్  

Upasana: టాలీవుడ్ (Tollywood) లో మెగా ఫ్యామిలీ (Mega Family) అంటే ఒక సందడి. ఒక బ్రాండ్. ముఖ్యంగా చిరంజీవి (Chiranjeevi). ఆయనొక ఇన్ స్పిరేషన్...

Puri Jagannadh: ఎవరు కొడితే బొమ్మ బ్లాక్ బస్టరవుద్దో.. అతనే ‘పూరి...

Puri Jagannadh: సినిమాకి హీరోకి ఉండే క్రేజే వేరు. సరైన సినిమాపడి స్టార్ స్టేటస్ వస్తే ఫ్యాన్స్ పెరుగుతారు.. డెమీ గాడ్ కూడా అయిపోతాడు. హీరో...

Harish Shankar: చోటా కె.నాయుడుపై హరీశ్ శంకర్ ఆగ్రహం.. బహిరంగ లేఖ

Harish Shankar: టాలీవుడ్ (Tollywood) సీనియర్ స్టార్ సినిమాటోగ్రాఫర్ చోటా కె.నాయుడు (Chota K Naidu) పై బ్లాక్ బస్టర్ దర్శకుడు హరీశ్ శంకర్ (Harish...

Mad Square: మ్యాడ్ సీక్వెల్ ‘మ్యాడ్ స్క్వేర్’ ప్రారంభం.. ఫన్ డబుల్...

Mad Square: గతేడాది విడుదలై యూత్ ని ఆకట్టుకున్న సక్సెస్ ఫుల్ మూవీ 'మ్యాడ్' (Mad). ఈ సినిమాకి సీక్వెల్‌ గా 'మ్యాడ్ స్క్వేర్' (Mad...

రాజకీయం

వ్యూహకర్తల మాటే శాసనం.. వారిదే పెత్తనం

దేశ రాజకీయాల్లో వ్యూహకర్తల పాత్ర రోజురోజుకి పెరిగిపోతోంది. గతంలో మాదిరిగా స్థానిక నాయకత్వంతో వ్యూహాలను రచించి ఎత్తుకు పై ఎత్తులు వేసే రోజులు పోయాయి. మరి ముఖ్యంగా ప్రచార పర్వాన్ని వ్యూహకర్తలే శాసిస్తున్నారు....

కులాంతరంలో కూడా రాజకీయ క్రీడ.!

ప్రజల నుంచి ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోవాలి అంటే.. ప్రజలందరికి మంచి చెయ్యటం వ్యక్తులకి సాధ్యం కాదు. అందుకని మనుషులని ఎదో ఒకరకంగా కూడగట్టాలి. ఉద్యోగులు, నిరుద్యోగులు, మహిళలు, రైతులు, కార్మికులు, విద్యార్థులు,...

ఎన్డిఏ కూటమి అభ్యర్థులను గెలిపించండి.. అభిమానులకు మెగాస్టార్ పిలుపు

ఆంధ్రప్రదేశ్ లో త్వరలో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అభ్యర్థులు సీఎం రమేష్, పంచకర్ల రమేష్ బాబును గెలిపించాలంటూ మెగాస్టార్ చిరంజీవి( Chiranjeevi) తన అభిమానులకు పిలుపునిచ్చారు. ఏపీలో చంద్రబాబు నాయుడు,...

నర్సాపురం అసెంబ్లీ గ్రౌండ్ రిపోర్ట్: ఎడ్జ్ జనసేన పార్టీకే.!

2024 ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి నర్సాపురం కూడా ఒకింత హాట్ టాపిక్ అవుతున్న నియోజకవర్గమే. నర్సాపురం లోక్ సభ నియోజకవర్గం అలాగే, ఆ పరిధిలోని నర్సాపురం అసెంబ్లీ నియోజకవర్గం.. ఈ...

మెగాస్టార్ చిరంజీవి మీద పడి ఏడుస్తున్న వైసీపీ బ్యాచ్.!

2024 ఎన్నికల్లో దారుణ పరాజయాన్ని ముందే ఊహించుకున్న వైసీపీ, ప్రతి చిన్న విషయానికీ కలత చెందుతోంది. టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు పుట్టినరోజు సందర్భంగా పలువురు ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా ఆయనకు...

ఎక్కువ చదివినవి

రఘురామకృష్ణరాజు పంతం పట్టి మరీ సాధించుకున్నారుగానీ.!

నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు, వైసీపీని వీడి టీడీపీలో చేరి, టీడీపీ నుంచి ఉండి అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థిగా పోటీకి దిగుతున్న సంగతి తెలిసిందే. నర్సాపురం లోక్ సభ సీటుని బీజేపీ నుంచి ఆశించి...

Nara Rohit: నారా రోహిత్ @20 ‘సుందరకాండ’.. ఫస్ట్ లుక్, రిలీజ్ డేట్ రివీల్

Nara Rohit: నారా రోహిత్ (Nara Rohit) హీరోగా నటిస్తున్న 20వ సినిమా ‘సుందరకాండ’. శ్రీరామనవమి పండగ సందర్భంగా చిత్ర బృందం టైటిల్ రివీల్ చేస్తూ పోస్టర్ రిలీజ్ చేసింది. నూతన దర్శకుడు...

Upasana: ఆవకాయ పట్టిన అత్తమ్మ.. ఆటపట్టించిన ఉపాసన.. వీడియో వైరల్  

Upasana: టాలీవుడ్ (Tollywood) లో మెగా ఫ్యామిలీ (Mega Family) అంటే ఒక సందడి. ఒక బ్రాండ్. ముఖ్యంగా చిరంజీవి (Chiranjeevi). ఆయనొక ఇన్ స్పిరేషన్ పర్సనాలిటీ. నిత్యం సినిమాలతో బిజీ. పరిశ్రమ...

Pushpa 2: ‘పుష్ప-2’పై బాలీవుడ్ దర్శకుడి కామెంట్స్..! నెట్టింట వైరల్

Pushpa 2: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా తెరకెక్కుతున్న సినిమా పుష్ప ది రూల్ (పుష్ప-2). (Pushpa 2) సుకుమార్ (Sukumar) దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాపై దేశవ్యాప్తంగా భారీ...

గ్రౌండ్ రిపోర్ట్: నిడదవోలులో జనసేన పరిస్థితేంటి.?

ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలోని నిడదవోలు నియోజకవర్గంలో రాజకీయ సమీకరణాలు ఎలా వున్నాయ్.? 2024 ఎన్నికల్లో ఏ పార్టీ ఈ నియోజకవర్గం నుంచి గెలవబోతోంది.? నాటకీయ పరిణామాల మధ్య జనసేన పార్టీకి ‘కూటమి’ కోటాలో...