బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మృతి కేసులో నటి రియా చక్రవర్తి ప్రధానంగా ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఆమెకు బాంబే హైకోర్టు గతంలో బెయిల్ మంజూరు చేసింది. సుశాంత్ ఆత్మహత్య అనంతరం విచారణ చేపట్టింది సీబీఐ. ఈ కేసులో డ్రగ్స్ కోణం ఉండటంతో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) రంగంలోకి దిగింది. ఈనేపథ్యంలో విచారణ అనంతరం రియా అరెస్టు అయింది. అయితే.. ఆమెకు బాంబే హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది.
దీంతో బెయిల్ మంజూరును సవాల్ చేస్తూ ఎన్సీబీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. సుశాంత్ కి డ్రగ్స్ అలవాటు చేసిందన్న ఆరోపణపై ఎన్సీబీ రియాను విచారించింది. కేసులో అరెస్టయిన రియా గత ఏడాది నెల రోజులు జైలు శిక్ష అనుభవించింది. ఈ నెల ప్రారంభంలో రియా సోదరుడు షోవిక్ చక్రవర్తితో సహా 33 మందిపై ఎన్సీబీ స్పెషల్ కోర్టులో ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. రియా డ్రగ్స్ సిండికేట్ లో చురుకైన పాత్ర పోషించిందని పేర్కొన్నారు
562201 526328Outstanding post, I think weblog owners should larn a whole lot from this blog its genuinely user genial . 910315