కరోనా కారణంగా ప్రపంచ వ్యాప్తంగా ఐటీ సంస్థలు తమ ఉద్యోగులను వర్క్ ఫ్రమ్ హోం చేయించుకుంటున్నాయి. ప్రతి నెల కూడా పెద్ద ఎత్తున ఆదాయం సేవ్ అవ్వడంతో పాటు పలు ఉపయోగాలు ఉన్న కారణంగా ఇకపై కూడా తమ ఉద్యోగులను వర్క్ ఫ్రమ్ హోం చేయించుకోవాలని పలు సంస్థలు భావిస్తున్నాయి.
అందులో భాగంగా గూగుల్ సంస్థ తమ ఉద్యోగుల్లో దాదాపుగా 70 శాతం మందిని ఇంటి నుండి వర్క్ చేయాల్సిందిగా సూచించింది. వర్క్ ఫ్రమ్ చేస్తున్న వారికి వెయ్యి డాలర్లను ఇచ్చేందుకు గూగుల్ సిద్దం అయ్యింది.
వర్క్ ఫ్రమ్ హోం చేయాలంటే అందుకోసం ఫర్నీచర్ కావాలని దాంతో పాటు ప్రత్యేక వసతులు ఏర్పాటు చేసుకోవాలనే ఉద్దేశ్యంతో గూగుల్ తమ ఉద్యోగులకు ఈ మొత్తం ఇవ్వబోతుంది. ఇండియాలో పని చేస్తున్న గూగుల్ ఉద్యోగులు రూ.75 వేలు అందుకోబోతున్నారు. ఈ విషయంను స్వయంగా సంస్థ ప్రకటించింది.
ప్రతి నెల కూడా కొంత మొత్తంను అదనంగా జీతంను ఉద్యోగులకు ఇవ్వాలని కూడా గూగుల్ నిర్ణయించింది. ఇప్పటికే ట్విట్టర్ తమ ఉద్యోగులను పర్మినెంట్గా వర్క్ ఫ్రమ్ హోం చేయాల్సిందిగా ఆదేశించింది. ఇప్పుడు గూగుల్ కూడా అదే దారిలో నడుస్తోంది.
192927 305127I truly enjoy examining on this web site , it has great content . 12122