కర్నూలు జిల్లా మంత్రాలయం మండలం వగరూరు గ్రామానికి చెందిన నాగరాజు మరియు పార్వతిలకు ఆరు సంవత్సరాల క్రితం వివాహం అయ్యింది. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. కూతురు నాలుగు సంవత్సరాలు కాగా ఏడాది కొడుకు ఉన్నాడు. వీరు వ్యవసాయ కూలీలుగా పని చేస్తూ కుంటుంబంను సాగిస్తున్నారు. జీవితం హాయిగా సాగిపోతున్న సమయంలో వీరి మద్యకు ఒక ఫోన్ వచ్చి మొత్తం జీవితాలను నాశనం చేసింది. పార్వతి ఆత్మహత్యకు ఫోన్ కారణం అయ్యింది.
పూర్తి వివరాల్లోకి వెళ్తే… కొన్ని రోజుల క్రితం నాగరాజు రూ.1500 పెట్టి ఒక ఫోన్ కొనుగోలు చేశాడు. అది కొన్ని రోజులకే రిపేర్ వచ్చింది. భార్య వద్ద 500 రూపాయలు తీసుకుని దాన్ని రిపేర్ చేయించాలనుకున్నాడు నాగరాజు. ఈ కరువు సమయంలో ఫోన్ కొనడమే ఎక్కువ అంటే మళ్లీ దానికి రిపేర్ అవసరమ అంటూ డబ్బులు లేవంది. పిల్లలకు కనీసం తినడానికి కూడా సరిగా తిండి లేదు. ఇప్పుడు ఫోన్ లేకున్నా పర్వాలేదు అన్నట్లుగా మాట్లాడినది. దాంతో నాగరాజు పార్వతిల మద్య మాటా మాట పెరిగి గొడవ పెద్దగానే జరిగింది.
నాగరాజు బయటకు వెళ్లడంతో కొడుకు కోసం కట్టిన ఊయలకు పార్వతి ఉరి వేసుకుంది. నాగరాజు బయట నుండి వచ్చి చూసి గట్టిగా మొత్తుకోవడంతో చుట్టు పక్కల వారు వచ్చి కిందకు దించారు. అప్పటికే పార్వతి మృతి చెందినట్లుగా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేశారు. ఇద్దరు పిల్లలు తల్లిలేని వారు అవ్వడంతో స్థానికులు కన్నీరు మున్నీరు అవుతున్నారు.
906717 208965Hey there, Can I copy this post image and implement it on my personal internet log? 901982
41786 356003The vacation particular deals offered are believed as a selection of possibly the most preferred and therefore within your budget all more than the globe. Quite quite a few hostels can be proudly located inside property which is accented who has striking seashores encouraging crystal-clear rivers, contingency of an Ocean. hotels compare rates 980201