యువ హీరో శర్వానంద్ కెరీర్ ఇప్పుడు ఏమంత సాఫీగా సాగట్లేదు. శతమానం భవతి సినిమా తర్వాత శర్వానంద్ కు సరైన హిట్ అన్నదే లేదు. ఈ ఏడాది విడుదలైన జాను ఘోర పరాజయం చవిచూసింది. అయినా కూడా శర్వానంద్ ఎక్కడా తగ్గట్లేదు. వరస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు శర్వా. ప్రస్తుతం రైతుల జీవితాల ఆధారంగా శ్రీకారం అనే చిత్రాన్ని చేస్తున్న విషయం తెల్సిందే. మరి కొద్ది రోజులు షూటింగ్ చేస్తే ఈ సినిమా పూర్తవుతుంది.
ఈ చిత్రం కాకుండా ఒక తెలుగు – తమిళ ద్విభాషా చిత్రంలో కూడా శర్వానంద్ నటిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ ఈ ఏడాది చివరికి మొదలవుతుంది. మరోవైపు కిషోర్ తిరుమల చెప్పిన కథకు శర్వానంద్ ఎస్ చెప్పినట్లు వార్తలు గతంలోనే వచ్చాయి. ఇక ఇప్పుడు లేటెస్ట్ గా శర్వానంద్ మరో కొత్త సినిమాను ఒప్పుకున్నాడు.
శర్వానంద్ హీరోగా శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ప్రాజెక్ట్ ను అనౌన్స్ చేసింది. నాగ చైతన్య హీరోగా తెరకెక్కుతున్న లవ్ స్టోరీ చిత్రంతో ఈ బ్యానర్ నిర్మాణ రంగంలోకి అడుగుపెడుతోంది. ఏషియన్ సినిమాస్ వారిదే ఈ సంస్థ. రెండో చిత్రంగా అక్కినేని నాగార్జునతో ఒక యాక్షన్ థ్రిల్లర్ ను కన్ఫర్మ్ చేసారు. అలాగే నిఖిల్ 20వ చిత్రాన్ని కూడా నిర్మిస్తున్న ఈ సంస్థ ఇప్పుడు శర్వానంద్ ప్రాజెక్ట్ ను కూడా ప్రకటించింది. అయితే దర్శకుడు, ఇతర వివరాలు మాత్రం ఇంకా ప్రకటించలేదు.
398514 864401Hello! I just would like to give a huge thumbs up for the great information youve here on this post. I might be coming back to your weblog for far more soon. 166648