ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న కోవిడ్ మహమ్మారిని అరికట్టే టీకా త్వరలోనే భారత్ లో అందుబాటులోకి రానున్నట్టు ప్రధాని నరేంద్ర మోదీ వెల్లడించారు. కొద్ది వారాల్లోనే మనకు వ్యాక్సిన్ అందుబాటులోకి రానుందని పేర్కొన్నారు. అయితే, తొలి ప్రాధాన్యం కింద ఆరోగ్య సిబ్బంది, వృద్ధులకు వ్యాక్సిన్ ఇస్తామని వివరించారు. ఇక టీకా ధర ఎంత ఉండాలనే విషయంపై రాష్ట్ర ప్రభుత్వాలతో చర్చించిన తర్వాతే నిర్ణయం తీసుకుంటామన్నారు.
దేశంలో కోవిడ్ నియంత్రణపై చర్చించేందుకు శుక్రవారం ఆయన అఖిలపక్ష నేతలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా టీకా పంపిణీ తదితరాల విషయాలపై అఖిలపక్ష నేతలతో మాట్లాడారు. కొద్ది వారాల్లోనే టీకా అందుబాటులోకి వస్తుందని, భద్రతా ప్రమాణాలను క్షుణ్నంగా పరిశీలించి ఆమోదించిన తర్వాతే దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభమవుతుందని మోదీ వెల్లడించారు. టీకా పంపిణీలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలసి పనిచేయాలని మోదీ సూచించారు. వ్యాక్సినేషన్ ఎలా వేయాలి అనే అంశంపై సలహాలు సూచనలను పంపిస్తే, వాటిని పరిగణనలోకి తీసుకుంటామని పేర్కొన్నారు. మరోవైపు టీకా డోసులను కొనుగోలు చేసే విషయంలో భారత దేశమే ముందుంది.
ఇప్పటివరకు దాదాపు 1600 మిలియన్ డోసులకు పైగా కొనుగోలు చేయడానికి ఒప్పందాలు చేసుకున్నట్టు అమెరికాకు చెందిన డ్యూక్ విశ్వవిద్యలయం తెలిపింది. ఇక రెండో స్థానంలో యూరోపియన్ యూనియన్ నిలవగా.. 1000 మిలియన్ డోసులతో అమెరికా మూడో స్థానంలో ఉంది. అయితే ప్రపంచవ్యాప్తంగా ప్రజలందరికీ టీకా లభించడం ఇప్పుడే పూర్తికాదని.. అందుకు మరో మూడు నాలుగేళ్లు పట్టే అవకాశం ఉందని ఆ వర్సిటీ అంచనా వేసింది.
769724 791808I like this post, enjoyed this 1 regards for posting . 989072
664001 350469great post. Neer knew this, thanks for letting me know. 548227