జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చిత్తూరు జిల్లాలో పర్యటిస్తోన్న విషయం విదితమే. శ్రీకాళహస్తి నియోజకవర్గ పరిధిలోని పోయ అనే గ్రామంలో పవన్ కళ్యాణ్ పర్యటించాల్సి వుండగా, ముందస్తుగా అక్కడ వైసీపీ వర్గాలు మోహరించాయి. జనసేనకు వ్యతిరేకంగా ఆందోళనలు చేపట్టాయి. స్థానిక ఎన్నికల సమయంలో జనసేన పార్టీని ఎక్కడికక్కడ అడ్డుకునేందుకు వైసీపీ ప్రయత్నించిన విషయం విదితమే. మరీ ముఖ్యంగా చిత్తూరు జిల్లాలో వైసీపీ శ్రేణులు పూర్తిస్థాయిలో రౌడీయిజం చేయడం అప్పట్లో పెను సంచలనంగా మారింది. ఆనాటి ఆ పరిస్థితులు మళ్ళీ పునరావృతమవుతున్నాయా.? అన్న స్థాయిలో గందరగోళం నెలకొంది.
ఓ దశలో పోలీసులు కూడా, వైసీపీ శ్రేణులకు మద్దతుగా నిలిచినా, జనసేన నేతలు, కార్యకర్తలు.. పోలీసుల్ని ఈ విషయమై నిలదీశారు. వైసీపీ శ్రేణులతో బాహాబాహీకి దిగారు. దాంతో, వైసీపీ శ్రేణులు తోకముడిచేయాల్సి వచ్చింది. ఇదిలా వుంటే, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, అధికార పార్టీకి స్పష్టమైన హెచ్చరికలు జారీ చేశారు. ‘మేం ప్రజాస్వామ్యయుతంగా వ్యవహరిస్తున్నాం.. మా పర్యటనల్ని అడ్డుకునేందుకు కుట్రలు చేస్తే.. వాటిని తిప్పికొట్టడమెలాగో మాకూ తెలుసు. ప్రజాస్వామ్యయుతంగానే రాజకీయం చేయాలనుకుంటున్నాం.. మమ్మల్ని రెచ్చగొడితే, మీ భాషలోనే మిమ్మల్ని ఎదుర్కోవాల్సి వస్తుంది..’ అంటూ జనసేన అధినేత హెచ్చరించారు. మరోపక్క, భారీ వర్షంలోనూ జనసేనాని చిత్తూరు జిల్లా టూర్ సాగింది. అంత వర్షంలోనూ, జనసైనికులు పెద్దయెత్తున జనసేనాని వెంట కదిలారు.
తిరుపతి లోక్సభ నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరగాల్సి వుండడంతో, జిల్లాలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. మరోపక్క, ఇటీవల చిత్తూరు జిల్లాపై విరుచుకుపడిన నివర్ తుపాను కారణంగా నష్టపోయిన రైతాంగాన్ని ఓదార్చేందుకు జనసేనాని చిత్తూరు జిల్లాకి వెళ్ళిన విషయం విదితమే. ఈ క్రమంలో అధికార పార్టీకి చెందిన స్థానిక నేతలు, ప్రజల్ని రెచ్చగొట్టి పవన్ కళ్యాణ్పైకి ఉసిగొల్పుతుండడం గమనార్హం.
432237 754120I gotta favorite this internet internet site it seems extremely beneficial . 118988