చత్తీస్ గడ్ రాష్ట్రంలో భారీ ఎన్ కౌంటర్ జరిగింది. బీజాపూర్ జిల్లా అటవీప్రాంతంలో నక్సల్స్, జవాన్లకు మద్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఐదుగురు భద్రతా సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. ఇద్దరు మావోయిస్టులు కూడా మృతి చెందినట్టు తెలుస్తోంది. శనివారం సైనికులు చేపట్టిన నక్సల్స్ వ్యతిరేక ఆపరేషన్ ఈ ఘటన జరిగింది. భద్రతా సిబ్బందిని చూసి నక్సల్స్ కాల్పులు జరిపారు. దీంతో భద్రతా సిబ్బంది ఎదురు కాల్పులు జరిపారు. ఈ ఎన్ కౌంటర్లో కొందరు జవాన్లకు గాయాలైనట్టు రాష్ట్ర డీజీ డీఎం అవస్తి తెలిపారు.
అటవీప్రాంతంలో ఇంకా ఎన్ కౌంటర్ జరుగుతోందని అన్నారు. ఘటనకు సంబంధించిన పూర్తి విషయాలు తెలియాల్సి ఉందని కూడా అన్నారు. మార్చి 23న నారాయణపూర్ జిల్లాలో భద్రతా సిబ్బంది ప్రయాణిస్తున్న వాహనాన్ని నక్సల్స్ పేల్చివేసారు. ఈ ఘటనలో 5గురు జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఈ అటవీ ప్రాంతంలో కూంబింగ్ చేపట్టారు. అయితే.. జవాన్ల వైపే ప్రాణ నష్టం ఎక్కువగా ఉంది.
764474 57967Keep in touch whilst functioning from your personal home workplace with out all with the hassle of purchasing or procurment costly office equipment. Debtors are allowed to apply with their a bad credit score background whenever. 684278
199675 24012Woh I like your content , saved to favorites ! . 63549