సర్పంచి ఎన్నికల్లో వైసీపీ నాయకులు తనతో లక్షలు ఖర్చు పెట్టించి.. పోటీకి దింపి ఎన్నికల్లో ప్రత్యర్ధికి మద్దతిచ్చారని కర్నూలు జిల్లా దేవనకొండ సర్పంచి అభ్యర్ధి గీత వాపోయారు. ఈమేరకు తనకు జరిగిన అన్యాయాన్ని వివరిస్తూ సీఎం వైఎస్ జగన్ కు మంత్రి జయరాంకు విడివిడిగా లేఖలు రాశారు. వ్యవసాయం చేసుకుని జీవిస్తున్న తనను వైసీపీ నాయకులు బలవంతంగా ఎన్నికల్లో దించారని అన్నారు.
ఎన్నికల్లో నన్ను సర్పంచి అభ్యర్ధిగి నిలబెట్టి 40 లక్షలు ఖర్చు పెట్టించారని గీత అన్నారు. ఎన్నికల్లో మాత్రం ప్రత్యర్ధికి మద్దతిచ్చి తనను మోసం చేసినట్టు తెలిపారు. ఎన్నికల్లో తాన ఓడిపోయాని.. పొలం, డబ్బు కూడా పొగొట్టుకున్నానని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం ఆదుకోకపోతే తనకు ఆత్మహత్యే శరణ్యమని గీత ఆ లేఖలో పేర్కొన్నారు. తనకున్న మూడు ఎకరాల పొలాన్ని స్థానిక వైసీపీ నాయకుడికి అమ్మారు గీత. వైసీపీ నాయకుల వల్ల అష్టకష్టాలు పడుతున్నట్టు ఆమె అన్నారు.
338768 925112Soon after study some with the blog articles for your website now, and that i really like your method of blogging. I bookmarked it to my bookmark web site list and are checking back soon. Pls consider my internet website too and inform me what you consider. 895096