జబర్దస్త్ కామెడీ స్కిట్స్ ఏ స్థాయిలో వర్కవుట్ అయ్యాయో, ఆ ప్రోగ్రామ్ ఎంత పెద్ద హిట్ అయ్యిందో.. ఇప్పుడు ఆ జబర్దస్త్ పురాణం అంతకు మించిన హిట్టవుతోంది సోషల్ మీడియాలో, వెబ్ మీడియాలో.. అదే సమయంలో మెయిన్స్ట్రీమ్ మీడియాలో కూడా.!
ప్రముఖ సినీ నిర్మాత శ్యామ్ ప్రసాద్ రెడ్డికి చెందిన మల్లెమాల సంస్థ, ఈటీవీలో జబర్దస్త్ ప్రోగ్రామ్ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. తెలుగు బుల్లితెరపై జబర్దస్త్ ఓ సంచలనం. జడ్జిలు రోజా, నాగబాబు ఈ ప్రోగ్రామ్కి ఎంత గ్లామర్ తెచ్చారో, అంతకు మించి కంటెస్టెంట్ల కామెడీ స్కిట్లు ఈ షోకి పాపులారిటీ తెచ్చాయి.
షో మేనేజర్ ఏడుకొండలు మీద తరచూ కామెడీ స్కిట్లు సెటైరికల్ మార్గంలో కంటెస్టెంట్లు వేయడం చూశాం. యాంకర్ల మీద కామెంట్లు, జడ్జిల మీద సెటైర్లు.. అబ్బో, ఆ రచ్చ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఇదొక బూతు ప్రోగ్రామ్.. అనే విమర్శలు జబర్దస్త్, ఎక్స్ట్రా జబర్దస్త్ మీద వినిపించడం కొత్తేమీ కాదు.
అయితే, అదంతా ఓ యెత్తు. కిర్రాక్ ఆర్పీ.. ఓ యూ ట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో జబర్దస్త్ మీదా, మల్లెమాల మీదా, శ్యామ్ ప్రసాద్ రెడ్డి మీదా చేసిన విమర్శలతో కథ కొత్త మలుపు తిరిగింది. ముఖ్యమైన కంటెస్టెంట్లంతా జబర్దస్త్ని వీడారు. యాంకర్ అనసూయ కూడా ఔట్ అయిపోయింది. జడ్జిల సంగతి సరే సరి.
దీనంతటికీ కారణం శ్యామ్ ప్రసాద్ రెడ్డి పీనాసితనం.. అంటూ కిర్రాక్ ఆర్పీ ఆరోపించిన సంగతి తెలిసిందే. ఆర్పీ ఆరోపణల్ని, జబర్ద్తస్త్లో కంటెస్టెంట్లుగా పనిచేసిన రామ్ ప్రసాద్, శ్రీను, అప్పారావు తదితరులు ఖండించారు. తాజాగా ఏడుకొండలు మీడియా ముందుకొచ్చాడు. ఆర్పీ పెద్ద మోసగాడని ఆరోపించాడు.
ఆర్పీకి అసలు సినీ పరిశ్రమలో, టీవీ పరిశ్రమలో గుర్తింపు కార్డు కూడా లేదన్నాడు ఏడుకొండలు. ఏ ఛానల్కి వెళ్ళినా, కమెడియన్లకు అక్కడి ప్రోగ్రామ్స్ ఎక్కువ కాలం వుండవనీ, తిరిగి జబర్దస్త్కి రావాల్సిందేనని ఏడుకొండలు స్పష్టం చేశాడు. శ్యామ్ ప్రసాద్ రెడ్డి దేవుడి లాంటోడనీ, తాను జబర్దస్త్కి దూరమైనాగానీ, ఆయన మంచితనం వల్లనే, ఆ సంస్థ గురించి ఎవరు చెడుగా మాట్లాడినా ఖండించడానికి వచ్చానని ఏడుకొండలు చెప్పాడు.
881197 42496Hi there, I located your blog by way of Google although looking for very first aid for a heart attack and your post looks really intriguing for me. 635284