ఏపీ రాజధాని అమరావతి ప్రాంతంలో భూమి కంపించడంతో స్థానికులు భయాందోళనతో పరుగులు తీశారు. రోడ్ల మీదకు వచ్చిన జనాలు ఏం జరుగుతుందో అర్థం కాక ఆగం ఆగం అయ్యారు. తెల్ల వారు జామున 5.30 నుండి 6 గంటల మద్యలో ఈ భూ కంపం వచ్చినట్లుగా స్థానికులు చెబుతున్నారు. కొన్ని సెకన్ల పాటు భూమి కంపించడంతో అంతా అయోమయంగా మారిందని ఏం చేయాలో పాలుపోక బయటకు పరుగులు తీశాం అంటూ స్థానికులు అంటున్నారు. ఇంకా స్థానికులు షాక్ నుండి బయటకు వచ్చినట్లుగా లేరు.
తూళ్లురు, నెక్కల్లు, అనంతారం, కర్లపూడి ప్రాంతాల్లో ఈ భూకంపం ఏర్పడింది. భూమి కంపించడంతో డోర్లు కిటికీలు కొట్టుకోవడం ఇంట్లో సామాన్లు కింద పడటం వంటి జరిగింది. నెక్కల్లు ప్రాంతంలో పెద్ద శబ్దం కూడా వచ్చిందని స్థానికులు చెబుతున్నారు. ఈ విషయమై అధికారులు ఎలాంటి ప్రకటన చేయలేదు. అమరావతి ప్రాంతంలో భూ కంపాలు సంభవించే అవకాశం ఉందని గతంలోనే అధికారులు చెప్పారు. అన్నట్లుగానే అక్కడ అప్పుడప్పుడు భూమి కంపించడం కామన్ గా మారింది.
135961 557917It is essential to have having access towards the knowledge posted here 43025