సంఘం డైరీలో అక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణలపై ధూళిపాళ్ల నరేంద్ర అరెస్టయి రిమాండ్ లో ఉన్న సంగతి తెలిసిందే. నాలుగు రోజులపాటు ప్రశ్నించేందుకు ఏసీబీ అధికారులు ధూళిపాళ్లను అదుపులోకి తీసుకున్నారు. ఈక్రమంలో ధూళిపాళ్లను రాజమహేంద్రవరం సెంట్రల్ జైలు నుంచి గొల్లపూడిలోని ఏసీబీ కార్యాలయానికి తరలించారు. ఆయనతోపాటు డైరీ ఎండీ, సహకార శాఖ మాజీ అధికారి గురునాధంను కూడా తీసుకెళ్లారు.
ఈనేపథ్యంలో విజయవాడ ఏసీబీ కార్యాలయానికి ధూళిపాళ్ల నరేంద్ర కుటుంబ సభ్యులు చేరుకున్నారు. ఫేక్ డాక్యుమెంట్లు సృష్టించి తన భర్తను కేసులో అన్యాయంగా ఇరికించారని నరేంద్ర భార్య కంటతడి పెట్టారు. అంతిమంగా న్యాయమే గెలుస్తుందని ఆయన భార్య జోతిర్మయి అన్నారు. ఈనేపథ్యంలో ఏసీబీ కార్యాలయం వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేసారు. ధూళిపాళ్లను చూసేందుకు అవకాశం ఇవ్వాలని ఆయన కుమార్తె అధికారులను కోరారు.
కానీ.. పోలీసులు అందుకు అనుమతి ఇవ్వలేదు. దీంతో ఆమె కన్నీటీపర్యంతమయ్యారు. ఈనెల 5వ తేదీ వరకూ ధూళిపాళ్లను విచారించేందుకు ప్రత్యేక న్యాయస్థానం అనుమతిచ్చిన విషయం తెలిసిందే.
991918 758800Glad to be one of several visitants on this awing internet internet site : D. 558177
849308 117276An intriguing discussion is worth comment. I do think that you ought to write read more about this subject, it will not be considered a taboo topic but typically everyone is too few to communicate in on such topics. To another. Cheers 387631
99992 898035Sweet internet site , super layout, genuinely clean and utilize genial . 247271