రామ్ చరణ్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ‘రంగస్థలం’ సినిమాలో ఎంత హిట్టయిందో తెలిసిందే. అదేస్థాయిలో రంగమ్మత్త పాత్రలో నటించిన యాంకర్ అనసూయకు కూడా అంతే పేరు వచ్చింది. రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో ‘రంగస్థలం’ షూటింగ్ సమయంలో జరిగిన విశేషాలను చెప్తూ.. రామ్చరణ్ తన కోసం ప్రత్యేకంగా చెఫ్ని పిలిపించి వంట చేయించేవాడని చెప్పుకొచ్చింది.
‘సెట్లో భోజన సమయంలో చేపల కూర ఉండేది. నాకు చేపలు తినే అలవాటు లేదు. ఈ విషయం తెలుసుకుని రామ్చరణ్ నా కోసం ప్రత్యేకంగా చెఫ్ని పిలిపించి పన్నీర్ను పెద్ద ముక్కలుగా కట్ చేసి కూర వండించేవాడు. అది అచ్చం ఫిష్ కర్రీలా చాలా టేస్టీగా ఉండేది. స్టార్ హీరో స్థాయిలో ఉన్న రామ్ చరణ్ నాకోసం ప్రత్యేకంగా అలా చేయాల్సిన అవసరం లేదు. కానీ ఆయన నా కోసం తీసుకున్న శ్రద్ధ చాలా సంతోషాన్నిచ్చింది’ అని ఆనాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుని మురిసిపోయింది. ప్రస్తుతం ఈ వార్త వైరల్ అయింది.
114452 84943Is gonna be again frequently in order to check up on new posts 138451