మాండౌస్ తుపాను భీభత్సం సృష్టిస్తోంది. ఏపీలోని చిత్తూరు, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. తిరుపతిలో రోడ్లపై వరద నీరు ప్రవహిస్తోంది. తుపాను తీవ్ర వాయుగుండంగా బలహీనపడిందని.. నేటి సాయంత్రం వాయుగుండంగా మారొచ్చని ఐఎండీ తెలిపింది. రేపు కూడా రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరుగా వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తోంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ వెల్లడించింది.
స్వర్ణముఖి నదిలోకి భారీగా వచ్చి చేరుతోంది. తిరుపతిలోని ఎస్వీ యూనివర్శిటీలో చెట్లు విరిగిపడ్డాయి. కైవల్య నది ఉదృతంగా ప్రవహిస్తూండటంతో కాలంగి రిజర్వాయర్ లోకి భారీగా వరద నీరు చేరుతోంది. ప్రాజెక్టులో 9గేట్లు ఎత్తి 15వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేయడంతో రాజులకండ్రిగ వద్ద కాజ్ వే కొట్టుకుపోయింది.
మరోవైపు.. తుపాను ప్రభావంపై అధికారులతో సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. తిరుపతి, చిత్తూరు, నెల్లూరు, అన్నమయ్య జిల్లాల కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.
As a Newbie, I am always browsing online for articles that can aid me. Thank you
This web site is really a stroll-via for the entire information you wished about this and didn’t know who to ask. Glimpse here, and also you’ll undoubtedly discover it.
Wow, wonderful weblog structure! How lengthy have you ever been running a blog for? you make running a blog glance easy. The overall look of your site is magnificent, as neatly as the content!