గత రెండు సంవత్సరాలుగా ప్రేమించుకుని సహజీవనం సాగిస్తున్న పవన్ కుమార్, నాగలక్ష్మి మద్య పెళ్లి వివాదంను రాజేసింది. కొన్ని రోజులుగా పెళ్లి చేసుకోమంటూ ఒత్తిడి చేస్తుండటంతో పవన్ కుమార్ ఆమెకు దూరంగా ఉంటున్నాడు. నాగలక్ష్మి ఈ విషయంతో మనస్థాపంకు గురైంది. పవన్ తనను రెండేళ్లుగా వాడుకుని ఇప్పుడు పెళ్లి అనేప్పటికి దూరంగా ఉంటున్నాడు అంటూ ఆవేదన వ్యక్తం చేసింది. ఆమె చివరి సారిగా ఒకసారి కలిసి మాట్లాడుకుందాం అంటూ పవన్ కుమార్ను పిలిచింది.
సహజీవనం సాగిస్తున్న రూంలోకి ఉదయం వెళ్లిన వారిద్దరు చాలా సమయం గొడవ పడ్డారు. ఆ తర్వాత కలిసి బతకకుంటే కలిసి చనిపోదాం అంటూ పవన్ కుమార్ను నాగలక్ష్మి కత్తితో పొడిచి చంపేందుకు ప్రయత్నించింది. అదే సమయంలో ఆమె మత్తు మందు తీసుకుని ఆపస్మారక స్థితిలోకి వెళ్లి పోయింది. పవన్ కుమార్ మాత్రం లేవలేని పరిస్థితిలో పడి ఉన్నాడు. విషయాన్ని గుర్తించిన స్థానికులు వెంటనే వారిని హాస్పిటల్కు తరలించారు.
పవన్ కుమార్ పోలీసులకు ఈ విషయంలో వాంగ్మూలం ఇవ్వగా కేసు నమోదు చేశారు. ప్రస్తుతం నాగలక్ష్మి పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు చెబుతున్నారు. వారి కుటుంబ సభ్యులకు సమాచారం అందించిన పోలీసులు ఇందులో ఏమైనా కుట్ర కోణం ఉందా అనే విషయంలో విచారణ చేపట్టారు.
42333 999097This web site is normally a walk-through you discover the details it suited you about this and didnt know who require to. Glimpse here, and you will undoubtedly discover it. 472013