ప్రస్తుతం భారత్ లో కరోనా మహమ్మారి స్వైర విహారం చేస్తోంది. రోజుకి మినిమమ్ 100 కేసులు పైనే నమోదవుతున్నాయి. చాలా తక్కువగా చేస్తున్న టెస్టుల్లోనే ఇన్ని నమోదవుతుంటే ఒకేసారి రాపిడ్ టెస్ట్ కిట్స్ తో ఇంటింటి సర్వ్ చేస్తే ఏ రేంజ్ లో కేసులు భయటపడతాయో అని భయాందోళనలో ఉన్నారు ప్రజలు.
అసలు విషయంలోకి వెళితే… దేశవ్యాప్తంగా రోజుకి 10వేళకి పైగా కేసులు నమోదవుతున్నాయి. రానున్న రోజుల్లో అవి మరింత పెరిగే అవకాశం పుష్కలంగా కనిపిస్తోంది. దాంతో భయాందోళనకు గురైన కేంద్ర ప్రభుత్వం ఈ మహమ్మారి విస్తరణకు వేగంగా విస్తరిస్తున్న కంటైన్మెంట్ జిల్లాలను లిస్ట్ అవుట్ చేసింది. కేంద్ర ప్రభుత్వం సర్వే ప్రకారం.. దేశవ్యాప్తంగా 10 రాష్ట్రాల్లో 38 జిల్లాలను హాట్ స్పాట్లుగా గుర్తించారు.
అలా గుర్తించిన వెంటనే కేంద్ర ప్రభుత్వం ఓ సంచలన నిర్ణయం తీసుకుంది. అదే ఆ 10 రాష్ట్రాల్లో కరోనా తీవ్రత అత్యధికంగా ఉన్న ఈ 38 జిల్లాల్లో ఇంటింటి సర్వే నిర్వహించాలని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ అధికార యంత్రాంగాన్ని ఆదేశించింది. ఆ పది రాష్ట్రాలు – మహారాష్ట్ర, తెలంగాణ, తమిళనాడు, రాజస్థాన్, హర్యానా, గుజరాత్, జమ్మూకాశ్మీర్, కర్ణాటక, ఉత్తరాఖండ్, మధ్యప్రదేశ్.. ఈ రాష్ట్రాల్లోని 38 జిల్లాల్లోని 45 మున్సిపాలిటీల్లో ఇంటింటి సర్వే చేసి, ప్రతి ఒక్కరికీ ర్యాపిడ్ టెస్టుల ద్వారా వెంటనే కోవిడ్ టెస్టులని నిర్వహించాలని కేంద్రం చేయనుంది.
936092 768319I think this internet site has got some extremely superb info for every person : D. 566246
601700 218869Good web site, nice and straightforward on the eyes and excellent content too. Do you require numerous drafts to make a post? 559660
508543 822960Very good day! Do you know if they make any plugins to protect against hackers? Im kinda paranoid about losing everything Ive worked hard on. Any tips? 290517