అమిత్ షా జాతీయపార్టీ అధ్యక్షుడు.. కేంద్ర మంత్రి. మమతా బెనర్జీ ప్రాంతీయ పార్టీ అధినేత.. రాష్ట్ర ముఖ్యమంత్రి. పార్టీ, నేతల పరంగా ఇద్దరూ ఇద్దరే. వచ్చే ఎన్నికల్లో బెంగాల్లో బీజేపీ ప్రభుత్వం ఉండాలని అమిత్ షా.. అదే ఎన్నికల్లో గెలిచి అధికారం నిలుపుకోవాలని దీదీ. ఇద్దరి ఆలోచనా ఒకటే. ఇందుకు ఇప్పటినుంచే ప్రయత్నాలు మొదలుపెట్టారు.
బెంగాల్ లో ఈరోజు వర్చువల్ మీటింగ్ ద్వారా ప్రజలనుద్దేశించి ప్రసంగించనున్నారు అమిత్ షా. రీసెంట్ గా బీహార్ లో వర్చువల్ మీటింగ్ సక్సెస్ కావడంతో ఇప్పుడు బెంగాల్లో కూడా ప్రసంగించి ఎన్నికల శంఖారావం పూరించబోతున్నారు. బెంగాల్ లోని బీజేపీ నేతలంతా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ప్రయత్నాలు చేస్తున్నారు.
‘రాష్ట్ర రాజకీయాల్లో అమిత్ షా మీటింగ్ తో కీలక మార్పు రానుంద’ని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు దిలీప్ ఘోష్ అంటున్నారు. బీహార్ లో 70వేల ఎల్ఈడీ స్క్రీన్లు ఏర్పాటు చేస్తే.. దాదాపు 44లక్షల మంది ప్రజలు అమిత్ షా ప్రసంగాన్ని వీక్షించారని.. బెంగాల్లో ఈ రికార్డు తుడిచిపెట్టుకుపోతుందన్నారు. అయితే.. బెంగాల్లో ఏర్పాట్ల గురించి వివరించలేదు.
మరోవైపు.. అమిత్ షా మీటింగ్ పై మమతా బెనర్జీ విమర్శలు చేస్తున్నారు. ‘ఈ మీటింగ్ ద్వారా వారు సాధించేదేం లేదు’ అంటున్నారు. అమిత్ షా మీటింగ్ తో బెంగాల్ లో రాజకీయంగా హీటెక్కిపోయింది. కరోనాపై జరిగిన మీటింగ్ లో అమిత్ ను నిలదీశానని దీదీ వాఖ్యానించడం సంచలనమైంది. ప్రస్తుత మీటింగ్ నేపథ్యంలో వారిద్దరి మధ్య మరెంత మాటల యుద్ధం జరుగుతుందో చూడాల్సిందే.
889486 448057I surely enjoyed the method that you explore your experience and perception with the region of interest 872978
388673 660154Outstanding post, I conceive web site owners should learn a lot from this weblog its real user pleasant. 322766
928072 997157Certainly worth bookmarking for revisiting. I wonder how much effort you set to make this type of great informative web site. 561412
182490 592691I want going to comment as this posts a bit old now, but just wanted to say thanks. 998450