ప్రభుత్వం కరోనా చికిత్స కోసం ప్రైవేట్ హాస్పిటల్స్కు ఎప్పుడైతే అనుమతులు ఇచ్చాయో అప్పటి నుండి వాటి పంట పండినట్లయ్యింది. హాస్పిటల్స్ కరోనా పేషంట్స్ నుండి లక్షల ఫీజ్లను రాబడుతున్నాయి. వారం రోజుల చికిత్సకు కూడా లక్షల బిల్లు వేసి పంపుతున్నారు. ఇటీవల ఒక డాక్టర్ హైదరాబాద్లోని ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ బిల్లు కట్టలేక కన్నీరు పెట్టుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. తాజాగా యాదగిరి గుట్టకు చెందిన 28 ఏళ్ల యువకుడికి కరోనా చికిత్స అందించిన ప్రైవేట్ హాస్పిటల్ వేసిన బిల్లుకు కుటుంబ సభ్యులు షాక్ అయ్యారు. చివరకు అతడు మృతి చెందడంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు.
సికింద్రాబాద్లోని ఒక ప్రైవేట్ హాస్పిటల్లో యాదగిరిగుట్టకు చెందిన యువకుడు గత నెల 23వ తారీకున జాయిన్ అయ్యాడు. 24న కరోనా నెగటివ్ రాగా, 26న మళ్లీ పరీక్ష చేస్తే పాజిటివ్ వచ్చింది. అప్పటి నుండి 15 రోజులు చికిత్స చేసిన హాస్పిటల్ 12 లక్షల బిల్లు వేసింది. తాజాగా అతడు మృతి చెందాడు. 6.5 లక్షల రూపాయల బిల్లు చెల్లించిన కుటుంబ సభ్యులు బ్యాలన్స్ ఫీజ్ చెల్లించాల్సిందిగా హాస్పిటల్ వారు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే భూమి అమ్మి హాస్పిటల్కు చెల్లించాం. శవాన్ని అప్పగించి బిల్లు అడుగుతున్నారంటూ కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు.
700581 282748Excellent post man, maintain the nice function, just shared this with my friendz 172829
562557 909466Ive been absent for some time, but now I remember why I used to love this blog. Thank you, I will try and check back more often. How regularly you update your internet site? 915289