కరోనా ప్రజలందరినీ భయంలోకి నెట్టేసింది. ఇందులో సామాన్యులు, సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు, క్రీడాకారులు కూడా ఉన్నారు. నెమ్మదిగా వ్యవస్థలన్నీ కుదురుకుంటున్నాయి. ఇందులో క్రీడారంగం కూడా ఉంది. క్రికెట్ ప్రేమికులను ఊపేసే ఐపీఎల్ కూడా ఇందులో ఉంది. అన్ని అవరోధాలను దాటుకుని సెప్టెంబర్ 19 నుంచి దుబాయ్ వేదికగా ఈ మ్యాచ్ లు జరుగనున్నాయి. టీమ్ లు ఒక్కోటిగా దుబాయ్ చేరుకుంటున్నాయి. వీటిలో చెన్నై సూపర్ కింగ్స్ ఉంది. ఆగష్టు 21నే దుబాయ్ చేరుకున్న టీమ్ ఇప్పటికే ఆరు రోజుల క్వారంటైన్ లో ఉంది.
అయితే.. టీమ్ లోని కొందరు ఆటగాళ్లు. సపోర్టింగ్ స్టాఫ్ కు కరోనా సోకిందనే వార్తలు ఒక్కసారిగా సంచలనం రేపాయి. శుక్రవారం నుంచి ట్రైనింగ్ ప్రారంభించాలని అనుకుంటున్న టీమ్ కు ఈ వార్త శరాఘాతంలా తగిలింది. దీంతో తమ క్వారంటైన్ పిరియడ్ పొడిగించేందుకు టీమ్ సిద్ధమైంది. ఈ వార్తతో ఒక్కసారిగా ప్రకంపనలు రేగాయి. ఐపీఎల్ మేనేజ్ మెంట్ ను, క్రికెట్ ప్రేమికులను ఆందోళనలో పడేశాయి. అయితే.. ఈ వార్తలతో చెన్నై సూపర్ కింగ్స్ టీమ్ అలెర్ట్ అయింది. ఇవన్నీ ఫేక్ వార్తలంటూ స్టేట్ మెంట్ రిలీజ్ చేసింది.
‘సోషల్ మీడియా టీమ్ లో ఒకరికి, ఇద్దరు నెట్ బౌలర్స్ కు కరోనా బారిన పడ్డారు. మిగిలిన జట్టు సభ్యులు, ఆటగాళ్లు ఎవరూ కోవిడ్ కు బారిన పడలేదు. ఆటగాళ్లు, సపోర్ట్ మెంబర్స్, స్టాఫ్ మొత్తం మళ్లీ కరోనా టెస్టులకు హాజరవుతున్నారు. ఫలితాల తర్వాత వివరాలు తెలియజేస్తాం’ అంటూ ప్రకటన ఇచ్చింది.
244179 24977enjoy your imagination!!!! fantastic work!! oh yeah.. cool photography too. 484796
225629 997174I admire the helpful facts you offer inside your articles. I will bookmark your weblog and also have my children verify up here often. Im really confident theyll learn a great deal of new things right here than anybody else! 241949