Switch to English

ఏపీ ర్యాంకు పడిపోతోంది మహాప్రభో.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,429FansLike
57,764FollowersFollow

రాష్ట్రంలో అభివృద్ధి అస్సలేమాత్రం లేదని.. గడచిన ఏడాది కాలంగా విపక్షాలు మొత్తుకుంటున్నాయి. నిజానికి, అభివృద్ధి మీద వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం అసలు ఫోకస్‌ పెట్టలేదనీ, కేవలం సంక్షేమం మీదనే దృష్టిపెట్టిందనీ.. వైసీపీ వర్గాలే ఆఫ్‌ ది రికార్డ్‌గా ఒప్పుకుంటున్న పరిస్థితి కన్పిస్తోంది.

ఇక, అసలు విషయానికొస్తే.. తాజాగా ఎక్స్‌పోర్ట్‌ ప్రమోషన్‌ తదితర కేటగిరీల్లో రాష్ట్రం పరిస్థితి చాలా అధ్వాన్నంగా వుందని నీతి అయోగ్‌ తేల్చి చెప్పింది. సముద్ర తీర ప్రాంతం వున్న రాష్ట్రాల్లోనూ ఆంధ్రప్రదేశ్‌ పరిస్థితి దారుణంగా వుంది. మొత్తంగా దేశవ్యాప్తంగా లెక్కలు తీస్తే, పొరుగు రాష్ట్రం తెలంగాణకి ఆరో ర్యాంక్‌ వస్తే.. ఆంధ్రప్రదేశ్‌ మాత్రం 20వ ర్యాంక్‌కి పరిమితమైంది.

నిజానికి, కోస్టల్‌ ఏరియా వున్న ఆంధ్రప్రదేశ్‌ మెరుగైన ఎక్స్‌పోర్ట్‌ పాలసీలు కలిగి వుండాలి. తెలంగాణ కంటే ఎంతో ముందంజలో వుండాలి. రాష్ట్రం తీసుకుంటున్న నిర్ణయాలు సరిగా లేవనీ, అందుకే ఈ పరిస్థితి అని నీతి అయోగ్‌ కడిగి పారేసినట్లు మీడియాలో కథనాలు దర్శనమిస్తున్నాయి.

సాధారణంగా కేంద్రం నుంచి వచ్చే వివిధ ర్యాంకుల విషయమై రాష్ట్ర ప్రభుత్వాలు చాలా గొప్పగా చెప్పుకుంటుంటాయి. అయితే, ఈసారి మాత్రం చెప్పుకోవడానికేమీ లేక అధికార పార్టీ సైలెంటయిపోయినట్లుగా కన్పిస్తోంది.

‘మెరుగైన పాలసీలు రూపొందిస్తున్నాం.. అభివృద్ధి పథంలో రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళతాం..’ అని ప్రభుత్వ పెద్దలు చెబుతున్న మాటలు, కేవలం ప్రచారానికే సరిపోతున్నాయి తప్ప.. రాష్ట్రంలో అభివృద్ధి అస్సలేమాత్రం కన్పించడంలేదన్నది విపక్షాల వాదన. రాజకీయ విశ్లేషకులు సైతం ఇదే వాదనతో ఏకీభవిస్తున్నారు.

‘ప్రభుత్వ పెద్దలు పబ్లిసిటీ కోసం పెడుతున్న శ్రద్ధలో పదో వంతు అయినా, అభివృద్ధి మీద చిత్తశుద్ధితో పెడితే.. ఫలితాలు బావుంటాయి..’ అనే చర్చ సర్వత్రా జరుగుతోంది. ఇన్‌స్టిట్యూషనల్‌ ప్రేమ్ వర్క్‌, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌, యాక్సెస్‌ టు ఫైనాన్స్‌.. తదితర విభాగాల్లో రాష్ట్రం పనితీరు అద్వాన్నంగా వుందని నీతి అయోగ్‌ పేర్కొంది. మరి, ఈ వ్యవహారాలపై రాష్ట్ర ప్రభుత్వ వాదన ఎలా వుంటుందో వేచిచూడాల్సిందే.

5 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Rashmika: ముంబై బ్రిడ్జి ప్రయాణంపై రష్మిక పోస్టు.. నెటిజన్స్ ట్రోలింగ్స్

Rashmika: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నేషనల్ క్రష్ రష్మిక (Rashmika) మందన ప్రయాణించి తన అనుభూతిని పంచుకున్నారు. మీడియాలో...

Allu Shirish : ఎట్టకేలకు అల్లు శిరీష్ అప్‌డేట్‌ తో వచ్చాడు

Allu Shirish : అల్లు శిరీష్ హీరోగా గాయత్రి భరద్వాజ్ హీరోయిన్‌ గా శామ్‌ ఆంటోనీ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'బడ్డీ'. స్టూడియో గ్రీన్ ఫిలింస్...

Telangana: తెలంగాణలో 2వారాలపాటు సినిమాలు బంద్..! కారణాలివే..

Telangana: ప్రస్తుత రోజుల్లో ధియేటర్లలో సినిమా నడవడమే కష్టమవుతోంది. బాగున్న సినిమా.. పెద్ద సినిమా.. చిన్న సినిమాగా లెక్కలు మారిపోయాయి. విడుదలైన కొద్దిరోజుల్లోనే ఓటీటీల్లో రావడం.....

‘రామ జన్మభూమి’ తో సీనియర్‌ స్టార్‌ డైరెక్టర్‌ రీ ఎంట్రీ

సినీ ప్రేక్షకులకు ఎన్నో సూపర్‌ హిట్ సినిమాలను అందించిన సీనియర్ దర్శకుడు సముద్ర ఈ మధ్య కాలంలో సినిమాలకు కాస్త దూరంగా ఉంటున్నారు. ఆయన నుంచి...

Chiranjeevi : అసెంబ్లీలో వాళ్ల భాష విని షాక్ అయ్యాను :...

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్‌ అందుకున్న నేపథ్యంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. చిరంజీవిని సన్మానించిన కిషన్ రెడ్డి...

రాజకీయం

కడపలో వైసీపీని వైఎస్ షర్మిల అంతలా దెబ్బ కొట్టిందా.?

ఉమ్మడి కడప జిల్లాతోపాటు రాయలసీమ వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల నుంచి గట్టి దెబ్బ తగలనుందా.? రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ కొన్ని చోట్ల వైఎస్ షర్మిల ఇంపాక్ట్‌కి వైసీపీ కుదేలవనుందా.? ఏపీసీసీ...

హింస, అశాంతి.! ఇది వైసీపీ మార్కు రాజకీయం.!

రాష్ట్రంలో ప్రశాతంగా ఎన్నికల పోలింగ్ ముగిసింది. మరీ ప్రశాంతంగా కాదుగానీ, ఫర్లేదు.! వైసీపీ ఓటమి ఖాయమని పోలింగ్‌కి ముందే సంకేతాలు రావడంతో, కొన్ని చోట్ల హింసకు తెరలేపాయి వైసీపీ శ్రేణులు. బీసీ, మైనార్టీలు, ఎస్సీ,...

బాబూ.. రాంబాబూ.! రీపోలింగ్ కావాలా.?

మంత్రి అంబటి రాంబాబుకి రీ-పోలింగ్ కావాలట.! ఎంత కష్టమొచ్చింది.? రీ-పోలింగ్ అడుగుతున్నారంటే, ఓటమిని ముందే ఒప్పుకున్నట్లు కదా.? పోలింగ్ సరళి చూశాక ‘సంబరాల’ రాంబాబుకి మైండ్ బ్లాంక్ అయ్యిందని, సత్తెనపల్లి నియోజకవర్గ ప్రజలే...

కింగ్ మేకర్ జనసేనాని పవన్ కళ్యాణ్.!

పోలింగ్ ముగిసింది.. కౌంటింగ్ కోసం రాష్ట్రం ఎదురుచూస్తోంది.! ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలకు సంబంధించి ప్రజా తీర్పు, ఈవీఎంలలో నిక్షిప్తమైంది. జూన్ 4న లెక్కలు తేలతాయ్.! ఈలోగా రకరకాల అంచనాలు.. ఫలానా...

వైసీపీ కొంప ముంచేసిన ‘నాడు – నేడు’.!

రాష్ట్ర వ్యాప్తంగా ‘నాడు - నేడు’ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ స్కూళ్ళలో అత్యద్భుతమైన అభివృద్ధి చూపించామని వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెబుతూ వచ్చారు. వైసీపీ...

ఎక్కువ చదివినవి

పిలవని పేరంటానికి ఎందుకెళ్ళావ్ పుష్ప రాజ్.?

పుష్ప రాజ్ అలియాస్ బన్నీ అలియాస్ అల్లు అర్జున్, వైసీపీకి చెందిన శిల్పా రవిచంద్రారెడ్డి ఇంటికి వెళ్ళారు.! సరిగ్గా ఎన్నికల సమయంలో, అదీ.. పోలింగుకి జస్ట్ రెండ్రోజుల ముందర వైసీపీ అభ్యర్థి ఇంటికి...

ఎమ్మెల్యే చెంప పగలగొట్టిన సామాన్యుడికి ‘కులాన్ని’ ఆపాదిస్తారా.?

ఎమ్మెల్యేని ఓ సామాన్యుడు దూషించాడట.! దాంతో, ఎమ్మెల్యేకి కోపమొచ్చిందట. అయినాగానీ, శాంతంగానే వున్నాడట ఆయన. సదరు సామాన్యుడే, కులోన్మాదంతో సదరు ఎమ్మెల్యే చెంప పగలగొట్టేశాడట. తీవ్రంగా దాడి చేశాడట. దాడిలో గాయపడి ఆసుపత్రి పాలయ్యింది...

జగన్ ప్రజల్ని బిచ్చగాళ్ళలా చూశారా.? ప్రశాంత్ కిషోర్ ఉవాచ ఇదేనా.?

ప్రజాధనాన్ని అభివృద్ధి కోసం వినియోగించకుండా, సంక్షేమ పథకాల పేరుతో సొంత పబ్లిసిటీ చేసుకోవడానికి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వినియోగించారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు 2019 ఎన్నికల్లో వైసీపీ విజయం కోసం పని...

కడపలో వైసీపీని వైఎస్ షర్మిల అంతలా దెబ్బ కొట్టిందా.?

ఉమ్మడి కడప జిల్లాతోపాటు రాయలసీమ వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల నుంచి గట్టి దెబ్బ తగలనుందా.? రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ కొన్ని చోట్ల వైఎస్ షర్మిల ఇంపాక్ట్‌కి వైసీపీ కుదేలవనుందా.? ఏపీసీసీ...

ఎర్ర టవల్ చూస్తే వంగా గీతకు అంత భయమెందుకు.?

పిఠాపురం వైసీపీ అభ్యర్థి వంగా గీతకి ఓ పోలింగ్ కేంద్రంలో చిత్రమైన అనుభవం ఎదురయ్యింది. ‘నమస్కారం పెడుతూ, నాకు ఓటెయ్యడం మర్చిపోవద్దు..’ అంటూ క్యూలైన్లలో వున్న ఓటర్లను అభ్యర్థిస్తూ వెళ్ళడంపై కొందరు ఓటర్లు...