దేశంలో కరోనా తీవ్రత హెచ్చుతగ్గులతోనే కొనసాగుతోంది. అయితే.. రోజువారీ కేసుల్లో స్వల్ప తగ్గుదల కనిపించింది. అయిదో రోజులుగా 3వేలకు పైగా నమోదవుతున్న కేసులు నిన్న 3వేలకు దిగువన నమోదయ్యాయి. కేంద్రం విడుదల చేసిన గణాంకాల ప్రకారం..
గడచిన 24 గంటల్లో దేశంలో 4.19 లక్షల మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 2,568 కేసులు నమోదయ్యాయి. ముందు రోజు ఈ సంఖ్య 3,157గా ఉంది. దీంతో 18.6 శాతం మేర కేసులు తగ్గినట్టైంది. మొత్తంగా దేశంలో 4.30కోట్ల మంది వైరస్ బారిన పడగా 98.74 శాతం మంది కరోనా నుంచి కోలుకున్నారు. నిన్న కరోనాతో దేశంలో 20 మంది మృతి చెందారు. మొత్తంగా కరోనాతో 5.23 లక్షల మంది మృతి చెందారు.
నిన్న దేశవ్యాప్తంగా కరోనా నుంచి 2911 మంది కోలుకున్నారు. ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 19,137గా ఉన్నాయి. నిన్న 16,23,795 మంది వ్యాక్సిన్ తీసుకున్నారు. మొత్తంగా దేశంలో 189 కోట్లకు పైగా వ్యాక్సిన్ డోసులు పంపిణీ అయ్యాయి.
347193 730183This web page is genuinely a walk-through its the internet you desired with this and didnt know who want to. Glimpse here, and you will certainly discover it. 887970
731862 615515The top and clear News is very much imptortant to us. 242510