Switch to English

ఆ మీడియా సంస్థకు రూ.702 కోట్లిచ్చారా?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,460FansLike
57,764FollowersFollow

ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వం మారిన తర్వాత ఒక్కొక్కటిగా సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఓ మీడియా సంస్థ భారీగా లబ్ధి పొందిందని, గత ఐదేళ్లలో ఏకంగా రూ.702 కోట్ల మేర సర్కారు సొమ్మును తన ఖాతాలో వేసుకుందనే ప్రచారం సాగుతోంది. యాడ్స్ తోపాటు అసెంబ్లీ కార్యకలాపాలు, ప్రభుత్వ కార్యక్రమాలను ప్రత్యక్ష ప్రసారం చేసినందుకు గానూ ఆ సంస్థకు ప్రభుత్వం ఇంత మొత్తం చెల్లింపులు జరిపిందని పేర్కొంటూ ఓ వార్త సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.

ఆ సంస్థ అధినేత టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడు కావడంతో గత ప్రభుత్వం నుంచి కొన్ని మేళ్లు కూడా పొందారు. అంతేకాకుండా చంద్రబాబు కోటరీలో ఆయన కూడా ఉంటూ పలు సూచనలు, సలహాలు ఇచ్చేవారని అంటారు. నిజానికి చంద్రబాబుకు ప్రచారంపై మక్కువ చాలా ఎక్కువ. తాను ఏ పని చేసినా, దానికి విపరీతమైన ప్రచారం ఉండాల్సిందేనని కోరుకుంటారు. ఈ విషయంలో ఆ పత్రికాధినేత బాబు మనసెరిగి ప్రవర్తించేవారు.

తన పత్రిక, ఛానళ్లో బాబుకు బాకా కొట్టడమే కాకుండా వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ప్రచారం చేసేవారు. ఎన్నికల సందర్భంగా ఇది మరీ ఎక్కువగా సాగింది. చంద్రబాబుకు కావాల్సింది ఆయన చూసుకోగా.. ఆయనకు కావాల్సింది చంద్రబాబు చూసుకున్నారు. అంటే వీరి మధ్య క్విడ్ ప్రోకో వ్యవహారం సాగింది. అందువల్లే నిబంధనలకు విరుద్ధంగా ఆ సంస్థకు రూ.కోట్లాది మేర ప్రకటనలు ఇచ్చారు. ఈ విషయాన్ని కాగ్ కూడా ప్రస్తావిస్తూ.. బాబు సర్కారును కడిగి పారేసింది. అయినప్పటికీ చంద్రబాబు లెక్క చేయలేదు.

వాస్తవానికి సర్క్యులేషన్ ఆధారంగానే ప్రభుత్వం పత్రికలకు ప్రకటనలు ఇవ్వాల్సి ఉంటుంది. ఇందుకోసం కొన్ని మార్గదర్శకాలు కూడా ఉన్నాయి. అయితే, ప్రభుత్వ పెద్దలు వీటికి తిలోదకాలిచ్చేశారు. ఇలా చేయడం దివంగత సీఎం వైఎస్ హయాం నుంచి మొదలైంది. ఆయన తన సొంత పత్రిక ప్రారంభించిన తొలినాళ్లలోనే నిబంధనలకు విరుద్ధంగా కోట్లాది రూపాయల మేర ప్రకటనలు ఇచ్చుకున్నారని ఆరోపణలు వచ్చాయి. ఆయనపై వ్యతిరేక ప్రచారం చేస్తున్న పత్రికలకు సైతం ప్రకటనలిస్తూనే సొంత పత్రికకు కాస్త ఎక్కువగా ఇచ్చుకునేవారు.

అయితే, చంద్రబాబు హయాంలో పరిస్థితి మారింది. తనకు అనుకూలంగా ఉన్న పత్రికలకు మినహా మిగిలినవాటికి ప్రకటనలు ఇవ్వలేదు. ముఖ్యంగా తనకు వ్యతిరకంగా ఉన్న సాక్షికి ఏపీ సర్కారు ప్రకటనలు వచ్చేవి కావు. ఈ విషయంలో కోర్టు జోక్యం చేసుకున్న తర్వాతే పరిస్థితిలో కొంచెం మార్పు వచ్చింది. మిగిలిన పత్రికలకు పేజీలకు పేజీలు యాడ్స్ ఇవ్వగా.. సాక్షికి మాత్రం చాలా చిన్నగా యాడ్ ఇచ్చేవారు. ఈ నేపథ్యంలోనే తన కోసం ఎక్కువగా కష్టపడే ఆ పత్రికకు భారీగా ప్రకటనల రూపంలో బోలెడు సొమ్ము ధారపోశారని అంటున్నారు.

అంతేకాకుండా అసెంబ్లీ ప్రత్యక్ష ప్రసారాలు, ఇతరత్రా ప్రభుత్వ కార్యక్రమాల ప్రసారం కోసం ఎలాంటి టెండర్లూ లేకుండానే ఆ సంస్థకు కట్టబెట్టారని విమర్శలు వచ్చాయి. సమయం లేదని ఓసారి, ఇతరత్రా కారణాలు చూపి మరోసారి ఓపెన్ టెండర్లు పిలవకుండా నామినేషన్ పద్ధతిలో ఆ సంస్థకు బాధ్యతలు అప్పగించారు. పైగా ఇందుకోసం దాదాపు పది రెట్లు ఎక్కువగా చెల్లించారని ఆరోపణలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో వీటిలోని నిజాలు నిగ్గు తేలాలంటే ఏపీ కొత్త ప్రభుత్వం దీనిపై దర్యాప్తు చేసి, వాస్తవాలను ప్రజల ముందు ఉంచాల్సిందే. గత పదేళ్లుగా జగన్ పై వ్యతిరేక కథనాలు మాత్రమే వచ్చిన ఆ పత్రికలో గత వారం రోజుల నుంచి సానుకూల కథనాలు వస్తుండటం కొసమెరుపు.

Related Posts

టీడీపీలో కేశినేని తిరుగుబాటు ఆరంభం మాత్రమేనా?!

లోకేష్‌.. మీకిది తగునా?!

గవర్నర్ సాబ్.. జగన్ స్టెప్ ఏంటి?

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Movie: శ్రీ కమలహాసిని మూవీ మేకర్స్ ప్రొడక్షన్ నెం.1 మూవీ ప్రారంభం

Movie: ప్రస్తుతం ట్రెండ్ కంటెంట్, కాన్సెప్ట్ ఉన్న సినిమాలదే. అలా వచ్చిన సినిమాలను ప్రేక్షకులు ఆదరిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శ్రీ కమలహాసిని మూవీ...

Samantha: ఈసారి సరికొత్త లుక్.. పుట్టినరోజున ‘సమంత’ కొత్త సినిమా అప్డేట్

Samantha: సౌత్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha) కొన్నాళ్లుగా సినిమాలు చేయడం లేదు. సమంత నుంచి కొత్త సినిమా కబురు కోసం ఆమె అభిమానులు ఎప్పటినుంచో...

Chiranjeevi: లేటెస్ట్ అప్డేట్..! చిరంజీవి ‘విశ్వంభర’ కోసం భారీ సెట్స్..

Chiranjeevi: మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi) నటిస్తున్న సినిమా ‘విశ్వంభర’. (Vishwambhara) వశిష్ఠ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా యూవీ క్రియేషన్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. చిరంజీవి...

Varun Tej: ‘ప్రజలే పవన్ కల్యాణ్ కుటుంబం..’ జనసేన ప్రచారంలో వరుణ్...

Varun Tej: ఏపీలో ఎన్నికల హీట్ రోజురోజుకీ పెరుగుతోంది. నేతలంతా ప్రచారాలతో హోరెత్తిస్తున్నారు. ఈక్రమంలో బాబాయి పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కు మద్దతుగా.. జనసేన...

Faria Abdullah: ఈరోజుల్లో ‘ఆ ఒక్కటీ అడక్కు’ కంటెంట్ అవసరం: ఫరియా...

Faria Abdullah: అల్లరి నరేశ్ (Allari Naresh)-ఫరియా అబ్దుల్లా (Faria Abdullah) హీరోహీరోయిన్లుగా నటించిన సినిమా ‘ఆ ఒక్కటీ అడక్కు' (Aa Okkati Adakku). త్వరలో...

రాజకీయం

Janasena: ‘జనసేన’కు ఈసీ గుడ్ న్యూస్.. కామన్ సింబల్ గా ‘గ్లాసు’ గుర్తు..

Janasena: జనసేన (Janasena) పార్టీకి కేంద్ర ఎన్నికల కమిషన్ శుభవార్త చెప్పింది. పార్టీకి కామన్ సింబల్ గా ‘గాజు గ్లాస్’ గుర్తు కేటాయించాలని ఆదేశాలు జారీ చేసింది. ఈమేరకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్...

వైఎస్ షర్మిల ఎఫెక్ట్: క్రిస్టియన్ ఓట్లు వైసీపీకి దూరమయినట్టేనా.?

వైఎస్ షర్మిల, పదే పదే ‘క్రిస్టియన్’ ప్రస్తావన తీసుకొస్తున్నారు ఎన్నికల ప్రచారంలో. ‘మన మతం..’ అంటూ అన్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ‘క్రిస్టియానిటీ’ని గుర్తు చేస్తున్నారామె.! ఇంకోపక్క, వైఎస్ జగన్ మేనత్త...

ఇన్‌సైడ్ స్టోరీ: తునిలో కూటమికి అలా సెట్టయ్యింది.!

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని తుని నియోజకవర్గం విషయమై నిన్న మొన్నటిదాకా కూటమిలో కొంత గందరగోళం వుండేది. సీట్ల పంపకాల్లో తుని నియోజకవర్గం టీడీపీకి దక్కింది. మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు కుమార్తె యనమల...

పిఠాపురంలో వరుణ్ తేజ్ ప్రచారంపై వైసీపీ ఏడుపు.!

వైసీపీ కంటే, వైసీపీ పెంచి పోషిస్తోన్న నీలి కూలి మీడియా ఎక్కువ బాధపడిపోతోంది కొన్ని విషయాల్లో. సినీ నటుడు వరుణ్ తేజ్, పిఠాపురం నియోజకవర్గంలో జనసేన పార్టీ తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహిస్తే,...

నవరత్నాలు ప్లస్సు కాదు.. ఇప్పుడు మైనస్.!

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, ఎన్నికల మేనిఫెస్టో ప్రకటించింది. దీనికి ‘నవరత్నాలు ప్లస్’ అని పేరు పెట్టుకుంది ఆ పార్టీ. రైతులకు రుణ మాఫీ సహా, పలు కీలక అంశాలు కొత్త మేనిఫెస్టోలో వైసీపీ...

ఎక్కువ చదివినవి

Chiranjeevi: ‘ఆ చిరంజీవే ఈ చిరంజీవికి తోడు..’ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు తెలిపిన చిరంజీవి..

Chiranjeevi: ఆంజనేయుడు.. హనుమంతుడు.. భజరంగభళి.. వాయు నందనుడు.. ఇవన్నీ శ్రీరామ భక్త హనుమంతుడి పేర్లే. ధైర్యానికి.. అభయానికి ఆయనే చిహ్నం. ప్రాణకోటి తలచుకునే దైవం. ఆ ప్రాణకోటిలో మెగాస్టార్ చిరంజీవి కూడా ఉన్నారు....

Varun Tej: ‘ప్రజలే పవన్ కల్యాణ్ కుటుంబం..’ జనసేన ప్రచారంలో వరుణ్ తేజ్

Varun Tej: ఏపీలో ఎన్నికల హీట్ రోజురోజుకీ పెరుగుతోంది. నేతలంతా ప్రచారాలతో హోరెత్తిస్తున్నారు. ఈక్రమంలో బాబాయి పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కు మద్దతుగా.. జనసేన (Janasena) గెలుపుకు తన వంతు కృషి...

Chiranjeevi: పిఠాపురం కు చిరంజీవి వస్తున్నారా..? వాస్తవం ఇదీ..

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవిపై ప్రస్తుతం ఓ వార్త సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో తమ్ముడు పవన్ కళ్యాణ్ తరపున ప్రచారం చేయనున్నారని.. ఇందుకు మే 5వ తేదీన...

Samantha: పెళ్లి గౌను రీమోడల్ చేయించి ధరించిన సమంత.. పిక్స్ వైరల్

Samantha: సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే సమంత (Samantha) చేసిన ఓ పని చర్చనీయాంశంగా మారింది. ముంబై వేదికగా జరిగిన ‘ఎల్లే సస్టైనబిలిటీ అవార్డుల’ కార్యక్రమానికి హాజరై.. తాను వేసుకున్న గౌను...

పిఠాపురంలో జనసునామీ.! నభూతో నభవిష్యతి.!

సమీప భవిష్యత్తులో ఇలాంటి జనసునామీ ఇంకోసారి చూస్తామా.? ప్చ్.. కష్టమే.! అయినాసరే, ఆ రికార్డు మళ్ళీ ఆయనే బ్రేక్ చేయాలి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్, పిఠాపురం అసెంబ్లీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు...