ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వం మారిన తర్వాత ఒక్కొక్కటిగా సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఓ మీడియా సంస్థ భారీగా లబ్ధి పొందిందని, గత ఐదేళ్లలో ఏకంగా రూ.702 కోట్ల మేర సర్కారు సొమ్మును తన ఖాతాలో వేసుకుందనే ప్రచారం సాగుతోంది. యాడ్స్ తోపాటు అసెంబ్లీ కార్యకలాపాలు, ప్రభుత్వ కార్యక్రమాలను ప్రత్యక్ష ప్రసారం చేసినందుకు గానూ ఆ సంస్థకు ప్రభుత్వం ఇంత మొత్తం చెల్లింపులు జరిపిందని పేర్కొంటూ ఓ వార్త సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.
ఆ సంస్థ అధినేత టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడు కావడంతో గత ప్రభుత్వం నుంచి కొన్ని మేళ్లు కూడా పొందారు. అంతేకాకుండా చంద్రబాబు కోటరీలో ఆయన కూడా ఉంటూ పలు సూచనలు, సలహాలు ఇచ్చేవారని అంటారు. నిజానికి చంద్రబాబుకు ప్రచారంపై మక్కువ చాలా ఎక్కువ. తాను ఏ పని చేసినా, దానికి విపరీతమైన ప్రచారం ఉండాల్సిందేనని కోరుకుంటారు. ఈ విషయంలో ఆ పత్రికాధినేత బాబు మనసెరిగి ప్రవర్తించేవారు.
తన పత్రిక, ఛానళ్లో బాబుకు బాకా కొట్టడమే కాకుండా వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ప్రచారం చేసేవారు. ఎన్నికల సందర్భంగా ఇది మరీ ఎక్కువగా సాగింది. చంద్రబాబుకు కావాల్సింది ఆయన చూసుకోగా.. ఆయనకు కావాల్సింది చంద్రబాబు చూసుకున్నారు. అంటే వీరి మధ్య క్విడ్ ప్రోకో వ్యవహారం సాగింది. అందువల్లే నిబంధనలకు విరుద్ధంగా ఆ సంస్థకు రూ.కోట్లాది మేర ప్రకటనలు ఇచ్చారు. ఈ విషయాన్ని కాగ్ కూడా ప్రస్తావిస్తూ.. బాబు సర్కారును కడిగి పారేసింది. అయినప్పటికీ చంద్రబాబు లెక్క చేయలేదు.
వాస్తవానికి సర్క్యులేషన్ ఆధారంగానే ప్రభుత్వం పత్రికలకు ప్రకటనలు ఇవ్వాల్సి ఉంటుంది. ఇందుకోసం కొన్ని మార్గదర్శకాలు కూడా ఉన్నాయి. అయితే, ప్రభుత్వ పెద్దలు వీటికి తిలోదకాలిచ్చేశారు. ఇలా చేయడం దివంగత సీఎం వైఎస్ హయాం నుంచి మొదలైంది. ఆయన తన సొంత పత్రిక ప్రారంభించిన తొలినాళ్లలోనే నిబంధనలకు విరుద్ధంగా కోట్లాది రూపాయల మేర ప్రకటనలు ఇచ్చుకున్నారని ఆరోపణలు వచ్చాయి. ఆయనపై వ్యతిరేక ప్రచారం చేస్తున్న పత్రికలకు సైతం ప్రకటనలిస్తూనే సొంత పత్రికకు కాస్త ఎక్కువగా ఇచ్చుకునేవారు.
అయితే, చంద్రబాబు హయాంలో పరిస్థితి మారింది. తనకు అనుకూలంగా ఉన్న పత్రికలకు మినహా మిగిలినవాటికి ప్రకటనలు ఇవ్వలేదు. ముఖ్యంగా తనకు వ్యతిరకంగా ఉన్న సాక్షికి ఏపీ సర్కారు ప్రకటనలు వచ్చేవి కావు. ఈ విషయంలో కోర్టు జోక్యం చేసుకున్న తర్వాతే పరిస్థితిలో కొంచెం మార్పు వచ్చింది. మిగిలిన పత్రికలకు పేజీలకు పేజీలు యాడ్స్ ఇవ్వగా.. సాక్షికి మాత్రం చాలా చిన్నగా యాడ్ ఇచ్చేవారు. ఈ నేపథ్యంలోనే తన కోసం ఎక్కువగా కష్టపడే ఆ పత్రికకు భారీగా ప్రకటనల రూపంలో బోలెడు సొమ్ము ధారపోశారని అంటున్నారు.
అంతేకాకుండా అసెంబ్లీ ప్రత్యక్ష ప్రసారాలు, ఇతరత్రా ప్రభుత్వ కార్యక్రమాల ప్రసారం కోసం ఎలాంటి టెండర్లూ లేకుండానే ఆ సంస్థకు కట్టబెట్టారని విమర్శలు వచ్చాయి. సమయం లేదని ఓసారి, ఇతరత్రా కారణాలు చూపి మరోసారి ఓపెన్ టెండర్లు పిలవకుండా నామినేషన్ పద్ధతిలో ఆ సంస్థకు బాధ్యతలు అప్పగించారు. పైగా ఇందుకోసం దాదాపు పది రెట్లు ఎక్కువగా చెల్లించారని ఆరోపణలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో వీటిలోని నిజాలు నిగ్గు తేలాలంటే ఏపీ కొత్త ప్రభుత్వం దీనిపై దర్యాప్తు చేసి, వాస్తవాలను ప్రజల ముందు ఉంచాల్సిందే. గత పదేళ్లుగా జగన్ పై వ్యతిరేక కథనాలు మాత్రమే వచ్చిన ఆ పత్రికలో గత వారం రోజుల నుంచి సానుకూల కథనాలు వస్తుండటం కొసమెరుపు.
Related Posts
867848 774831I adore your wp internet template, wherever would you obtain it by means of? 399144
767758 173015Woh I like your posts , saved to fav! . 360990