ఆంధ్రప్రదేశ్ లో మంత్రివర్గ విస్తరణ హడావుడి ఓవైపు జరుగుతుండగా.. మరోవైపు టీడీపీ అధినేత చంద్రబాబు అకస్మాత్తుగా రాజ్ భవన్లో ప్రత్యక్షమయ్యారు. గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ తో దాదాపు గంటన్నరపాటు సమావేశమయ్యారు. ఎన్నికల్లో ఓటమి తర్వాత నేరుగా గవర్నర్ ను కలిసి రాజీనామా సమర్పించకుండా.. దూత ద్వారా రాజీనామా లేఖను పంపించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సీఎంగా రాజీనామా చేసిన తర్వాత గవర్నర్ ను చంద్రబాబు కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది.
ఇది కేవలం మర్యాదపూర్వక భేటీ అని టీడీపీ వర్గాలు చెబుతున్నప్పటికీ, ప్రస్తుత రాజకీయా పరిణామాలతోపాటు చాలా విషయాలు వీరి మధ్య చర్చకు వచ్చినట్టు సమాచారం. ఇటీవల ఎన్నికలకు ముందు కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐకి రాష్ట్రంలో ప్రవేశానికి వీలుగా ఉన్న సాధారణ సమ్మతిని వెనక్కి తీసుకుంటూ చంద్రబాబు సర్కారు నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. తాజాగా జగన్ ఏపీ సీఎం అయిన వెంటనే బాబు సర్కారు జారీచేసిన జీవోను రద్దు చేస్తూ.. తిరిగి సీబీఐ రాష్ట్రంలో ప్రవేశించేందుకు వీలుగా సాధారణ సమ్మతి పునరుద్ధరించారు. ఈ మేరకు గురువారం ఆదేశాలు జారీచేశారు.
మరోవైపు గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతి అక్రమాల నిగ్గు తేలుస్తామని, తమ ప్రభుత్వంలో అలాంటివాటికి తావు లేకుండా పనిచేస్తామని ప్రమాణ స్వీకారం రోజునే జగన్ స్పష్టంచేశారు. గత ప్రభుత్వ అక్రమాలు తిరగతోడటం, సీబీఐకి సాధారణ సమ్మతిని పునరుద్ధరించడం వంటి పరిణామాలు చంద్రబాబును లక్ష్యంగా చేసుకోవడానికే సాగుతున్నాయనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.
మరోవైపు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ సైతం బాబు సంగతి చూడాలనే భావనతో ఉన్నట్టు తెలుస్తోంది. ఈ పరిణామాల నేపథ్యంలో చంద్రబాబు గవర్నర్ తో సమావేశం కావడం ప్రాధాన్యత ఏర్పడింది. ఇటు జగన్ తోనూ, అటు కేంద్రంతోనూ సన్నిహిత సంబంధాలు కలిగి ఉన్న నరసింహన్ ద్వారా అసలు విషయం ఏమిటో తెలుసుకునే ఉద్దేశంతోనే ఆయన్ను బాబు కలిశారని అంటున్నారు. దాదాపు గంటన్నరకు పైగా సాగిన ఈ సమావేశంలో ప్రధానంగా ఇవే అంశాలపై చర్చ జరిగినట్టు తెలుస్తోంది.
వాస్తవానికి గవర్నర్ నరసింహన్ విషయంలో చంద్రబాబు చాలా ప్రతికూలంగా వ్యవహరించారు. తెలుగుదేశం పార్టీ ఎన్డీఏలో భాగస్వామ్య పార్టీగా ఉన్నప్పుడు నరసింహన్ ను తప్పించడానికి తెరవెనుక చంద్రబాబు గట్టిగానే ప్రయత్నాలు చేశారని అంటారు. ఒకానొక దశలో గవర్నర్ పై టీడీపీ నేతలు విమర్శలతో విరుచుకుపడ్డారు. అలాంటిది ఇప్పుడు అదే గవర్నర్ ద్వారా అసలు ఏమి జరుగుతుందో తెలుసుకోవడానికి చంద్రబాబు ప్రయత్నించడం గమనార్హం.
వాస్తవానికి చంద్రబాబు శుక్రవారం విదేశీ పర్యటనకు వెళ్లాల్సి ఉంది. అయితే, పార్టీలో జరుగుతున్న పరిణామాలు ఇబ్బందిగా మారడంతో ఆ పర్యటన రద్దు చేసుకున్నారు. ఇకపై హైదరాబాద్లో వారానికి మూడు రోజులు ఉండాలని ఆయన నిర్ణయం తీసుకున్నారు. గతంలో జగన్ హైదరాబాద్ లో ఉండటంపై తీవ్ర విమర్శలు చేశారు. లోటస్ పాండ్ వదిలి రాష్ట్రానికి రారంటూ దుయ్యబట్టారు. తాజాగా చంద్రబాబు అదే నిర్ణయం తీసుకోవడం గమనార్హం. తెలంగాణలో పార్టీ బలోపేతం కోసమే ఈ నిర్ణయం అని చెబుతున్నా.. అసలు కారణాలు వేరే ఉన్నాయని అంటున్నారు.
563251 487538yourselfm as burning with excitement along accumulative concentrating. alter ego was rather apocalyptic by the mated ethical self went up to. It is punk up to closed ego dispirited. All respecting those topics are movables her should discover no finish touching unpronounced. Thanks so significantly! 717527
356784 388886Normally I do not read article on blogs, but I wish to say that this write-up very forced me to try and do so! Your writing style has been surprised me. Thanks, quite good article. 610112
138818 665766I got what you intend,bookmarked , extremely decent internet web site . 475607
901908 590267For some cause the picture just isnt loading appropriately, is at this time there an concern? 781923
761821 487293Glad to be one of several visitants on this incredible internet website : D. 692662
175578 621201Precisely what I was seeking for, thankyou for putting up. 52545