కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ తెలంగాణ పర్యటనకు వచ్చారు. కామారెడ్డి లో ఆమె మీడియా తో ముచ్చటించారు. తెలంగాణలో కేంద్రం బడ్జెట్ లో ఆమోదించిన అప్పుల కంటే ఎక్కువ అప్పులు చేస్తున్నారు అంటూ అసహనం వ్యక్తం చేశారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థని పరిగణలోకి తీసుకుని మాత్రమే రాష్ట్రాలు అప్పులు చేయాలని.. రాష్ట్రాలు అప్పులు ఇష్టానుసారంగా చేస్తే కేంద్ర ప్రభుత్వం కు అడిగే బాధ్యత ఉంటుందని ఆమె పేర్కొన్నారు. రాష్ట్రం ఏదైనా కూడా అప్పుల విషయంలో జాగ్రత్తగా ఉండకుంటే భవిష్యత్తు తరాలకు ఇబ్బందులు తప్పవు అన్నారు.
తెలంగాణలో ప్రతి ఒక్కరిపై 1.25 లక్షల రూపాయల అప్పును రాష్ట్ర ప్రభుత్వం ఉంచిందని.. ఇది ఎంత మాత్రం కరెక్ట్ కాదంటూ ఆమె అభిప్రాయం వ్యక్తం చేశారు. రాష్ట్ర భవిష్యత్తు ను దృష్టిలో ఉంచుకుని అప్పులు తీసుకోవాలని.. లేదంటే కేంద్రం కఠినంగా వ్యవహరించాల్సిన పరిస్థితి తలెత్తే అవకాశం ఉంటుందని ఈ సందర్భంగా మంత్రి పేర్కొన్నారు. తెలంగాణలో ప్రతి చోట ఆమెకు బీజేపీ శ్రేణులు భారీ ఎత్తున స్వాగతం పలికాయి.
685329 564596Its amazing what supplementing can do for your body and your weight lifting goals! 56587
28027 488308I discovered your blog internet site internet site on the search engines and check several of your early posts. Always maintain up the extremely great operate. I lately additional increase Rss to my MSN News Reader. Searching for toward reading significantly more on your part later on! 454020
283582 917422You must participate in a contest for probably the greatest blogs on the web. I will recommend this web internet site! 545812