వైద్యో నారాయణో హరి అంటారు. ఏ మతంవారైనా చేతులెత్తి మొక్కేది డాక్టర్లనే. కానీ అలాంటి వైద్యులపైనే కొందరు దాడులకు తెగబడుతున్నారు. కరోనా నివారణ కోసం ప్రాణాలకు తెగించి మరీ పని చేస్తున్న వైద్య సిబ్బందిపై అమానుషంగా దాడి చేస్తున్నారు. పరీక్షల కోసం ఇళ్లకు వెళ్లిన వైద్య సిబ్బందిపైనా దాడులు చేసిన ఘటనలు చూశాం. ఇక ఆస్పత్రుల్లో అయితే కొంతమంది కరోనా రోగులు ప్రవర్తన మరీ దారుణంగా ఉంది.
నర్సులపై లైంగిక వేధింపులకు పాల్పడటం దగ్గర నుంచి వైద్యులపై ఉమ్మి వేయడం వంటి విపరీత పోకడలు చూశాం. తమ ప్రాణాలు ఫణంగా పెట్టి, వారి కుటుంబ సభ్యులకు దూరంగా ఉంటూ పనిచేస్తున్న వైద్యుల పట్ల ఎంత మర్యాదగా ఉండాలి. కానీ కొంతమందికి ఇవేవీ పట్టడంలేదు. ఇష్టానుసారంగా వారిపై దాడులు చేయడం పరిపాటిగా మారింది. ఈ నేపథ్యంలో ఇలాంటి ఘటనలకు చెక్ పెట్టాలని కేంద్రం నిర్ణయించింది.
ఈ మేరకు 1897 నాటి అంటురోగాల చట్టానికి సవరణలు చేస్తూ ఓ ఆర్డినెన్స్ తీసుకొచ్చింది. దీని ప్రకారం ఇక ఎవరైనా వైద్యులపై దాడి చేస్తే.. ఘటన తీవ్రతను బట్టి ఆరు నెలల నుంచి ఏడేళ్ల వరకు జైలు శిక్ష విధిస్తారు. అలాగే రూ.లక్ష నుంచి రూ.5 లక్షల వరకు జరిమానా కూడా వేసే విధంగా ఆర్డినెన్స్ లో పొందుపరిచారు. దాడిలో వాహనాలు, ఆస్పత్రి ఆస్తులకు నష్టం వాటిల్లితే వాటి మార్కెట్ విలువలో రెండింతలు వసూలు చేస్తారు.
ఇక కరోనాపై పోరాడుతున్న వైద్య సిబ్బందికి రూ.50 లక్షల బీమా సౌకర్యం కల్పిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. కాగా, కేంద్రం తీసుకొచ్చిన ఆర్డినెన్స్ పై వైద్య సంఘాలు హర్షం వ్యక్తంచేస్తున్నాయి. ఈ విధంగానైనా తమకు రక్షణ లభిస్తుందని పేర్కొంటున్నాయి.
422063 860981I like this internet site very a lot so much outstanding details. 853432
57442 218993What a lovely blog. Ill surely be back once again. Please preserve writing! 782901
333829 717378really great goodthis post deserves almost absolutely nothing hahaha merely joking: S nice write-up: P 242843