Switch to English

అబ్జర్వేషన్‌: దేశంలో ‘కరోనా’ లెక్కల్లో చిత్తశుద్ధి ఎంత.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,469FansLike
57,764FollowersFollow

కరోనా వైరస్‌.. ప్రపంచాన్ని వణికిస్తోన్న మహమ్మారి ఇది. ప్రపంచ యుద్ధం కంటే భయానకంగా మారుతోంది ఈ మహమ్మారి. నిజమే, కరోనా వైరస్‌ నుంచి అగ్రరాజ్యం అమెరికా కూడా తప్పించుకోలేకపోయింది. ఆ మాటకొస్తే, అత్యంత దారుణంగా కరోనా దెబ్బకి విలవిల్లాడుతున్నది అగ్రరాజ్యమే. అలాంటిది, మన దేశంలో కరోనా వైరస్‌ తీవ్రస్థాయిలో ప్రకంపనలు సృష్టించడంలో వింతేముంది.?

అయితే, మన దేశంలో కరోనా లెక్కలు పక్కాగా వుంటున్నాయా.? లేదా.? అన్న అనుమానాలు మాత్రం రోజురోజుకీ ఎక్కువవుతున్నాయి. లెక్కలు.. అంటే, కేసుల సంఖ్య గురించి కాదు. ఏ రాష్ట్రం కరోనా విషయంలో ఎలా స్పందిస్తోంది.? అసలు కేంద్ర ప్రభుత్వం, కరోనాపై పోరులో తీసుకుంటున్న చర్యలు సబబేనా.? వంటివన్నమాట. కరోనా లక్షణాలివీ.. కరోనాని ఇలా అరికట్టగలం.. అంటూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చాలానే చెబుతున్నాయి.

అయితే, కరోనా వైరస్‌ విషయమై ఇప్పటికీ ప్రపంచం ఓ అవగాహనకు రాలేకపోతోందన్నది నిర్వివాదాంశం. లాక్‌డౌన్‌ ఒక్కటే కరోనా వైరస్‌ని అరికట్టడానికి మార్గమని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెబితే.. జనం దాన్ని పాటిస్తున్నారు. వందలో ఒక్కడు లైట్‌ తీసుకున్నా, పరిస్థితి అత్యంత దారుణంగా మారిపోతుంది ఇలాంటి విషయాల్లో. ఇక్కడ ఇదే జరుగుతోంది. 14 రోజుల క్వారంటైన్‌ ఇకపై 28 రోజులకు మారింది తెలంగాణలో. ఇది కరోనా వైరస్‌పై కొత్త అనుమానాల్ని రేకెత్తిస్తోంది.

హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ మందు పనిచేయడంలేదన్న చర్చ తెరపైకొచ్చింది. కరోనా వైరస్‌ పట్ల మనకి పూర్తి అవగాహన లేదనడానికి ఇంతకన్నా నిదర్శనం ఇంకేం కావాలి.? మనవంతుగా మనం ప్రయత్నిస్తున్నాం. ఇందులో ఎవర్నీ నిందించడానికి వీల్లేదు. అయితే, మనం ‘లాక్‌ డౌన్‌’ నుంచి బయటపడి, కరోనా వైరస్‌ని ఎప్పుడు ‘లాక్‌’ చేయగలం.? అన్నదే మిలియన్‌ డాలర్ల ప్రశ్న.

దేశంలో ఇప్పటికే కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 20 వేలకు దాటిపోయింది. మరణాల సంఖ్య కొద్ది రోజుల్లోనే వెయ్యికి చేరుకోవచ్చు. ఆ పాటికి కేసుల సంఖ్య ఏ 30 వేలకు చేరుకుంటుందో ఏమో.! కొన్ని రాష్ట్రాలు ర్యాపిడ్‌ టెస్టింగ్‌ కిట్స్‌.. అంటూ పబ్లిసిటీ స్టంట్లు చేస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో అయితే కరోనాపై పోరాటం కంటే, అధికార పార్టీకి రాజకీయమే ముఖ్యమైపోయింది.

ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వాల చిత్తశుద్ధిపై ప్రజలకు ఆందోళన కలగకుండా ఎలా వుంటుంది.? మే 3తో లాక్‌డౌన్‌ ముగియాల్సి వుంటుంది. ముగుస్తుందా.? లేదా.? ఈ నెల 27న ప్రధాని మోడీ అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించబోతున్నారట. ఏమో, ఆ రోజు మోడీ ఏం బాంబు పేల్చుతారోనన్న భయం సగటు భారతీయుల్లో స్పష్టంగా కన్పిస్తోంది.

4 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Mad Square: మ్యాడ్ సీక్వెల్ ‘మ్యాడ్ స్క్వేర్’ ప్రారంభం.. ఫన్ డబుల్...

Mad Square: గతేడాది విడుదలై యూత్ ని ఆకట్టుకున్న సక్సెస్ ఫుల్ మూవీ 'మ్యాడ్' (Mad). ఈ సినిమాకి సీక్వెల్‌ గా 'మ్యాడ్ స్క్వేర్' (Mad...

Ritu Varma: నభా నటేశ్-ప్రియదర్శికి రీతూవర్మ క్లాస్.. ట్వీట్ వార్ వైరల్

Ritu Varma: హీరోయిన్ నభా నటేశ్ (Nabha Natesh), నటుడు ప్రియదర్శి (Priyadarshi) మధ్య ‘డార్లింగ్’ సంబోధనపై మాటల యుద్ధం వైరల్ అయిన సంగతి తెలిసిందే....

Chiranjeevi: చిరంజీవితో రష్యన్ సినిమా ప్రతినిధుల భేటీ.. చర్చించిన అంశాలివే

Chiranjeevi: మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi)తో రష్యా నుంచి వచ్చిన మాస్కో సాంస్కృతిక శాఖ ప్రతినిధులు సమావేశమయ్యారు. హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లోని చిరంజీవి...

Tollywood: ‘మిస్టర్.. మాట జారొద్దు..’ నటుడికి హీరోయిన్ ఘాటు రిప్లై

Tollywood: హీరోయిన్ నభా నటేశ్ (Nabha Natesh), నటుడు ప్రియదర్శి (Priyadarshi) మధ్య ట్వీట్ వార్ ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. వివరాల్లోకి వెళ్తే.. ‘హాయ్...

Sandeep Reddy Vanga: బాలీవుడ్ నటుడిపై సందీప్ రెడ్డి ఆగ్రహం.. కారణం...

Sandeep Reddy Vanga: 5ఏళ్ళ క్రితం సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) దర్శకత్వం వహించిన హిందీ సినిమా ‘కబీర్ సింగ్’ (Kabir Singh)....

రాజకీయం

రఘురామకృష్ణరాజు పంతం పట్టి మరీ సాధించుకున్నారుగానీ.!

నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు, వైసీపీని వీడి టీడీపీలో చేరి, టీడీపీ నుంచి ఉండి అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థిగా పోటీకి దిగుతున్న సంగతి తెలిసిందే. నర్సాపురం లోక్ సభ సీటుని బీజేపీ నుంచి ఆశించి...

ఎలక్షన్ కమిషన్ నెక్స్ట్ టార్గెట్ ఏపీ సీఎస్, డీజీపీ!

ఆంధ్రప్రదేశ్ లో త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలపై కేంద్ర ఎన్నికల సంఘం దృష్టి సారించింది. ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించాలన్న ఉద్దేశంతో ఫిర్యాదులు అందిన పలువురు సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను ఇప్పటికే బదిలీ...

21 అసెంబ్లీ సీట్లు.! జనసేన ప్రస్తుత పరిస్థితి ఇదీ.!

మొత్తంగా 21 అసెంబ్లీ సీట్లలో జనసేన పార్టీ పోటీ చేయబోతోంది.! వీటిల్లో జనసేన ఎన్ని గెలవబోతోంది.? పోటీ చేస్తున్న రెండు లోక్ సభ నియోజకవర్గాల్లో జనసేన పార్టీ ఎంత బలంగా వుంది.? ఈ...

గ్రౌండ్ రిపోర్ట్: నగిరిలో రోజా పరిస్థితేంటి.?

ముచ్చటగా మూడోసారి నగిరి నియోజకవర్గం నుంచి రోజా గెలిచే అవకాశాలున్నాయా.? అంటే, ఛాన్సే లేదంటోంది నగిరి ప్రజానీకం.! నగిరి వైసీపీ మద్దతుదారులదీ ఇదే వాదన.! నగిరి నియోజకవర్గంలో రోజాకి వేరే శతృవులు అవసరం...

పవన్ కళ్యాణ్‌కీ వైఎస్ జగన్‌కీ అదే తేడా.!

ఇతరుల భార్యల్ని ‘పెళ్ళాలు’ అనడాన్ని సభ్య సమాజం హర్షించదు. భార్యల్ని కార్లతో పోల్చడం అత్యంత జుగుప్సాకరం.! ఈ విషయమై కనీస సంస్కారం లేకుండా ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి...

ఎక్కువ చదివినవి

Vijay: తల్లి కోసం ఆలయం కట్టించిన హీరో విజయ్.. కారణం ఇదే..

Vijay: ప్రముఖ తమిళ హీరో విజయ్ (Vijay) తన తల్లి కోరిక మేరకు గుడి కట్టించాడనే వార్త వైరల్ అవుతోంది. గతంలోనే ఈ వార్త ప్రచారంలోకి వచ్చినా దీనిపై ఎప్పుడూ స్పందించింది లేదు....

Pushpa 2: ‘పుష్ప-2’పై బాలీవుడ్ దర్శకుడి కామెంట్స్..! నెట్టింట వైరల్

Pushpa 2: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా తెరకెక్కుతున్న సినిమా పుష్ప ది రూల్ (పుష్ప-2). (Pushpa 2) సుకుమార్ (Sukumar) దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాపై దేశవ్యాప్తంగా భారీ...

Solo Boy: బిగ్ బాస్-7 కంటెస్టెంట్ గౌతమ్ కృష్ణ హీరోగా ‘సోలో బాయ్’

Solo Boy: బిగ్ బాస్-7 కంటెస్టెంట్ గౌతమ్ కృష్ణ హీరోగా తెరకెక్కుతున్న సినిమా ‘సోలో బాయ్’ (Solo Boy). ఈరోజు హీరో గౌతమ్ కృష్ణ (Gautham Krishna) పుట్టినరోజు వేడుకల్ని టీమ్ సెట్లో...

Tollywood: టాలీవుడ్ లో కలకలం.. కిడ్నాప్ కేసులో ప్రముఖ నిర్మాత..!

Tollywood: జూబ్లీహిల్స్ లోని క్రియా హెల్త్ కేర్ ప్రైవేట్ లిమిటెడ్ కు సంబంధించి కిడ్నాప్, షేర్ల బదలాయింపు కేసులో ప్రముఖ సినీ నిర్మాత నవీన్ యర్నేని (Naveen Yerneni) పేరు వెలుగులోకి వచ్చింది....

జనసేన స్ట్రైక్ రేట్ 98 శాతం కాదు, 100 శాతం.!?

‘వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వను..’ అంటూ చాలాకాలం క్రితం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సంచలన ప్రకటన చేస్తే, ‘ఇదెలా సాధ్యం.?’ అంటూ రాజకీయ విశ్లేషకులు పెదవి విరిచారు. టీడీపీ - జనసేన...