వైసీపీ పాలనలో రాష్ట్ర అభివృద్ధి కుంటుపడిందని.. ప్రధాన రహదారులు కూడా వేయలేని దుస్థితిలో ఉందని ఆరోపించారు బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి. ప్రభుత్వ తీరుకు నిరసనగా 5వ తేదీ శనివారం రాష్ట్రవ్యాప్తంగా రహదారుల దిగ్భంధనం చేయనున్నామని తెలిపారు. విజయవాడోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
‘రాష్ట్రంలోని రహదారుల పరిస్థితి దారుణంగా ఉన్నా ప్రభుత్వంలో చలనం లేదు. రోడ్లు వేసేందుకు భీమవరంలో టెండర్లు పిలిచినా ఎవరూ ముందుకు రావడం లేదు. 4వేల కోట్ల టెండర్లకు 12సార్లు ఆహ్వానించినా రాలేదంటే వైసీపీ ప్రభుత్వం అంటే కాంట్రాక్టర్లు ఎంత భయపడుతున్నారో అర్ధం చేసుకోవచ్చు. కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించడంలోకూడా ప్రభుత్వం విఫలమైంది’.
‘సాక్షాత్తూ ఆర్ధిక శాఖా మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి నియోజకవర్గంలోనే కాంట్రాక్టర్లు ధర్నా నిర్వహించారంటే పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు. కేంద్రం ఇచ్చే నిధులను పక్కదారి పట్టిస్తున్నారు. పీఎంజీవై ద్వారా వచ్చిన 723 కోట్లు, ఏషియన్ డెవలప్ మెంట్ బ్యాంకు వీసీఐసీ ద్వారా ఇచ్చిన నిధులను దారి మళ్లించారు. బ్యాంకులు కూడా ఏపీకి అప్పులు ఇవ్వాలంటే భయపడుతున్నాయి. పంచాయతీరాజ్ కు 900 కోట్లు పెండింగ్ లో ఉన్నాయి’ అని ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు.
ప్రభుత్వ తీరుపై, రోడ్ల దుస్థితిపై శనివారం రాష్ట్రంలోని ప్రధాన రహదారుల దిగ్భంధనం కార్యక్రమంల చేపడుతున్నామని.. బీజేపీ శ్రేణులు ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొనాలని ఆయన పిలిపునిచ్చారు.
504684 229057Some genuinely nice and utilitarian info on this internet web site , likewise I believe the style and style contains superb functions. 621464
1845 402734I must spend a while learning more or understanding more. Thanks for great info I was looking for this info for my mission. 854725