ఇటివలే ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇంటింటికీ రేషన్ వాహనాల డ్రైవర్లకు వేతనాలు పెంచింది ప్రభుత్వం. ఇప్పుడీ అంశమే వాలంటీర్ల ఆందోళనకు కారణమైంది. తాము కరోనా సమయంలో కూడా ఇంటింటికీ తిరిగి పనిచేశామని.. అయినా ప్రభుత్వం నిన్న వచ్చిన ట్రక్ డ్రైవర్లకు జీతాలు పెంచి తమకు పెంచకపోవడం దారుణమని అంటున్నారు. ఈమేరకు విశాఖ గాజువాకలో వాలంటీర్లు జీవీఎంసీ జోన్ 5వ కార్యాలయం వద్ద నిరసనకు దిగారు. తాము రోజుకు ఎన్నిగంటలు పనిచేయాలో.. తమ పని ఏంటో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు.
అనంతపురం జిల్లా తాడిపత్రిలో కూడా వాలంటీర్లు ఆందోళన చేపట్టారు. తమకు జీతాలు పెంచి ఉద్యోగ భద్రత ఇవ్వాలంటూ మున్సిపల్ కార్యాలయంలో నిరసన వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఇస్తున్న గౌరవ వేతనాన్ని 12 వేలకు పెంచాలంటూ ఓ వినతిపత్రాన్ని కమిషనర్ కు అందజేశారు. ప్రభుత్వం అప్పజెప్పిన ప్రతి పనిని తాము నిబద్ధతతో చేస్తున్నామని తమకు సీఎం జగన్ న్యాయం చేయాలని వారు కోరుతున్నారు.
810093 986823Hi, you used to write outstanding articles, but the last several posts have been kinda lackluster I miss your super writing. Past couple of posts are just a little out of track! 447963
517710 111645I really like reading by means of and I believe this site got some genuinely utilitarian stuff on it! . 552352
555381 162019Woh I really like your posts , bookmarked ! My wife and i take issue along with your last point. 765618