ఏపీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ వెలువవరించిన ఉత్తర్వులపై హైకోర్టులో తనకు లభించిన ఊరట పట్ల మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అంత సంతృప్తిగా లేనట్టు తెలుస్తోంది. తనను లక్ష్యంగా చేసుకున్న నిమ్మగడ్డపై సమరశంఖం పూరించాల్సిందేననే పట్టుదలతో ఆయన ఉన్నట్టు సమాచారం. అధికారులపై పెద్దిరెడ్డి చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఆయన్ను ఈనెల 21 వరకు ఇంటికే పరిమితం చేయాలని, అలాగే మీడియాతో మాట్లాడనివ్వకుండా నిరోధించాలని ఎస్ఈసీ నిమ్మగడ్డ ఆదేశించిన సంగతి తెలిసిందే. దీనిపై కోర్టుకు వెళ్లిన మంత్రికి తాత్కాలిక ఊరట లభించింది. ఆయన్ను ఇంటికే పరిమితం చేయాలన్న ఆదేశాలు చెల్లవని కోర్టు తీర్పు వెలువరించింది.
అయితే, మీడియాతో మాట్లాడొద్దన్న ఆదేశాలు వర్తిస్తాయని పేర్కొంది. దీంతో కోర్టులో తనకు లభించిన సగం విజయం పట్ల మంత్రి సంతృప్తిగా లేరని తెలుస్తోంది. పైగా తొలి నుంచీ నిమ్మగడ్డ తనను లక్ష్యంగా చేసుకున్నారని ఆయన భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే రాబోయే రోజుల్లో నిమ్మగడ్డపై సమరశంకం పూరించే దిశగా కసరత్తు చేస్తున్నట్టు సమాచారం. ఇప్పటికే తనపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ గవర్నర్ కు నిమ్మగడ్డ రాసిన లేఖపై పెద్దిరెడ్డి సభా హక్కుల కమిటీకి ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం ఈ వ్యవహారంపై కమిటీ పరిశీలిస్తోంది. ఈ నేపథ్యంలో ఎస్ఈసీని మంత్రి ఎలా ఢీకొడతారనేది ఆసక్తికరంగా మారింది.
302105 360181Cpr KIts quite great read you know alot about this subject i see! 82178
957365 484223Woh I like your content material , saved to bookmarks ! . 407563