ఆంద్ర ప్రదేశ్ ప్రాథమిక విద్యావ్యవస్థలో జగన్ ప్రభుత్వం విప్లవాత్మక మార్పులను తీసుకు వస్తున్న విషయం తెల్సిందే. ఇప్పటికే చిన్న పిల్లలకు కూడా ఇంగ్లీష్ మీడియంను అలవాటు చేయబోతున్నారు. నర్సరీ నుండి గ్రాడ్యేషన్ ఆ పై చదువులు కూడా ఇకపై ఏపీ విద్యార్థలు ఆంగ్లంలోనే చదవబోతున్నారు. ఈ విధానంపై విపక్ష పార్టీలు వ్యతిరేకంగా ఉన్నా కూడా ప్రభుత్వం మాత్రం ముందడుగు వేసింది. కరోనా కారణంగా విద్యా సంవత్సరం అతలాకుతలం అయ్యింది. కనుక ఈ ఏడాది అయినా కాస్త పద్దతిగా పిల్లల చదువులను కొనసాగించాలని ప్రభుత్వం భావిస్తుంది. ఈ సమయంలోనే ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయాన్ని తీసుకుంది.
ఏపీ ప్రభుత్వం ప్రతి ప్రభుత్వ స్కూల్ లో కూడా సీబీఎస్ఈ పాఠాలను నేర్పించాలని నిర్ణయించారు. అందుకోసం 90 వేల మంది ప్రభుత్వ టీచర్లకు ట్రైనింగ్ ఇచ్చేందుకు ఏర్పాట్లు చేశారు. అత్యున్నత స్థాయి విద్యను చిన్నప్పటి నుండే అందించే లక్ష్యంతో జగన్ ప్రభుత్వం చేపట్టిన ఈ కార్యక్రమంపై అంతా కూడా ప్రశంసలు కురిపిస్తున్నారు. పెద్ద ఎత్తున ఇందుకు గాను ఖర్చు చేస్తున్నారు. ఏపీ ప్రభుత్వం విద్యా వ్యవస్థలో తీసుకు వస్తున్న ఈ మార్పు తో రాబోయే తరం అత్యున్నత అభివృద్దికి నాంధి అవుతుందని వైకాపా నాయకులు అంటున్నారు.
151113 936423Hey there! Someone in my Myspace group shared this site with us so I came to take a look. Im certainly enjoying the information. Im bookmarking and will probably be tweeting this to my followers! Superb weblog and outstanding style and style. 956962
939589 830647Naturally I like your web-site, however you need to check the spelling on several of your posts. Numerous of them are rife with spelling troubles and I uncover it extremely silly to inform you. On the other hand I will definitely come once more again! 447294