పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో మొదలైన అంపన్ తుఫాన్ పశ్చిమ బెంగాల్, ఒడిశా రాష్ట్రాల్లో అల్లకల్లోలం సృష్టిస్తోంది. ఈ తుఫాన్ భీభత్సం నేడు విశాఖ తీరం మరియు కాకినాడ తీరప్రాంతాల్లోనూ దాడి చేయడం మొదలు పెట్టింది. 185 కిమీ వేగంతో వస్తున్న ఈ తుఫాన్ బలమైన గాలులు, వర్షంతో విలయతాండవం చేస్తూ పశ్చిమ బెంగాల్, ఒడిశా, విశాఖపట్నం మరియు కాకినాడ తీర ప్రాంతాల్లో పలు ఇల్లు, చెట్లు తుఫాన్ వల్ల నేలకొరిగాయి. అలాగే తీర ప్రాంతాల్లోని ఇళ్లలోకి, గ్రామాల్లోకి నీళ్ళొచ్చేయడంతో ఇబ్బందులు పడుతున్న ప్రజలు. ఈ అంపన్ తుఫాన్ లైవ్ విజువల్స్ మీకోసం..
> ఒడిశా కోస్టల్ ఏరియాలో ఇల్లు, చెట్లు నెలకొరిగేలా భారీ గాలులతో కుండపోతగా కురుస్తున్న వర్షం.
> బెంగాల్ దీఘ కోస్ట్ నుంచి తుఫాన్ పశ్చిమ బెంగాల్ వైపు వెళ్ళాక, దీఘ కోస్ట్ ఇలా ఉంది.
> ఒడిశా కేంద్రపర కోస్ట్ వద్ద పరిస్థితి ఇలా ఉంది.
> దిఘా కోస్ట్ వద్ద ప్రజల్ని భయబ్రాంతులకు గురిచేసేలా ఎగసిపడుతున్న సముద్రపు అలలు