రెబెల్ స్టార్ ప్రభాస్ ప్యాన్ ఇండియా లెవెల్లో మొదటి సారి బాలీవుడ్ దర్శకుడితో చేసిన చిత్రం ఆదిపురుష్. రామాయణం ఆధారంగా తీసిన ఈ చిత్రంలో రాఘవగా నటించాడు ప్రభాస్. జానకి పాత్రలో కృతి సనన్ కనిపించనుంది. జూన్ 16న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా భారీ లెవెల్లో విడుదల కానుంది.
మొదట ఆదిపురుష్ కు నెగటివ్ రెస్పాన్స్ వచ్చింది. టీజర్ తర్వాత అందరూ దీన్ని ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. అయితే ట్రైలర్ తర్వాత పరిస్థితిలో మార్పు వచ్చింది. ట్రైలర్ చూసాక మళ్ళీ పాజిటివ్ ఇంప్రెషన్ వచ్చింది ప్రేక్షకులకు.
ఏదేమైనా అంచనాలు అయితే బాగానే ఉన్నాయి. ఇక యూఎస్ లో కూడా ఆదిపురుష్ భారీ లెవెల్లో విడుదలవుతుంది. ఇప్పటికే ప్రీసేల్స్ మొదలవ్వగా 7,000 డాలర్లు వసూలు చేసినట్లు తెలుస్తోంది. ఇంకా విడుదలకు చాలా సమయం ఉంది కాబట్టి ఇది మంచి ఆరంభమనే చెప్పాలి.