సినీ నటుడు, రచయిత ‘జబర్దస్త్’ కమెడియన్ హైపర్ ఆది, పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తరఫున ఎన్నికల ప్రచారంలో బిజీగా వున్న సంగతి తెలిసిందే. నెల రోజులపాటు సినిమా షూటింగులు, ఇతరత్రా వ్యాపకాలూ అన్నీ పక్కన పెట్టేసి, పూర్తిగా జనసేన పార్టీ కోసమే సమయమంతా కేటాయిస్తున్నట్లు చెప్పాడు హైపర్ ఆది.
జనసేన పార్టీ తరఫున స్టార్ క్యాంపెయినర్ల లిస్టుని ఇటీవల జనసేన పార్టీ ప్రకటించగా, అందులో క్రికెటర్ అంబటి రాయుడు, జనసేన నేత నాగబాబు సహా, హైపర్ ఆది తదితరులూ వున్నారు.
కాగా, జబర్దస్త్ కమెడియన్లతో ఎన్నికల ప్రసహనానన్ని జనసేన కామెడీగా మార్చేసిందంటూ వైసీపీ నుంచి వెటకారపు వ్యాఖ్యలు చూస్తున్నాం. ప్రధానంగా హైపర్ ఆది చుట్టూ విపరీతమైన ట్రోలింగ్ చేస్తున్నారు వైసీపీ పెయిడ్ బ్యాచ్.
ఈ క్రమంలో హైపర్ ఆది తన మీద జరుగుతున్న ట్రోలింగ్పై పూర్తి స్థాయి క్లారిటీ ఇచ్చేశాడు. ‘ఔను, నేను కమెడియన్నే. ప్రొఫెషన్ పరంగా కమెడియన్ని.. అంతే తప్ప, వాళ్ళలా పొలిటికల్ కమెడియన్ని కాదు..’ అని తన మీద విమర్శలు చేస్తున్న వైసీపీ నాయకులకు దిమ్మతిరిగేలా రిటార్ట్ ఇచ్చాడు హైపర్ ఆది.
కాగా, పిఠాపురం నియోజకవర్గంలో టీడీపీ మాజీ ఎమ్మెల్యే వర్మ తమకు పూర్తిగా సహకరిస్తున్నారనీ, టీడీపీ, జనసేనతోపాటు బీజేపీ నేతలు, క్యాడర్ కూడా కలిసి పనిచేస్తున్నారని జబర్దస్త్ ఆది చెప్పాడు.
ఇంటింటి ప్రచారంతో హైపర్ ఆది, పిఠాపురం ఓటర్లను జనసేన వైపు ఆకర్షిస్తున్నాడు. లక్ష మెజార్టీతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గెలుస్తారనీ, పిఠాపురంతోపాటు జనసేన పోటీ చేస్తున్న 21 నియోజకవర్గాల్లోనూ తాను ప్రచారం చేస్తానని చెప్పాడు హైపర్ ఆది.