‘ఉయ్యాల జంపాల’, ‘మజ్ను’ చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్నారు దర్శకుడు విరించి వర్మ. ప్రస్తుతం ఆయన దర్శకత్వంలో ‘బాహుబలి’ ఫేమ్ రాకేష్ వర్రే హీరోగా వైశాలి రాజ్, రియా సుమన్ హీరోయిన్లుగా ‘జితేందర్ రెడ్డి’ అనే సినిమా తెరకెక్కుతోంది. 1980 కాలంలో జితేందర్ రెడ్డి అనే స్టూడెంట్ లీడర్ జీవితం ఆధారంగా, యధార్థ సంఘటనలతో ఈ చిత్రం రూపొందుతోంది. అన్యాయాన్ని ఎదిరించే స్టూడెంట్ లీడర్ గా రాకేష్ కనిపించనున్నారు.
ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి టైటిల్ పోస్టర్, ఫస్ట్ లుక్ విడుదల కాగా..తాజాగా ‘అఆఇఈ’ అని సాగే లిరికల్ సాంగ్ ని మేకర్స్ రిలీజ్ చేశారు. రెండు విద్యార్థి సంఘాల మధ్య కాలేజీ ఎలక్షన్స్ సమయంలో జరిగే విభేదాలను ఈ పాటలో కళ్లకు కట్టినట్లు చూపించారు. ఈ పాటకి గోపి సుందర్ స్వరాలు అందించగా.. రాంబాబు గోసాల రచించారు. రాహుల్ సిప్లిగంజ్ పాడిన ఈ పాట ఆకట్టుకుంటోంది. ఈ సినిమాని ముదిగంటి క్రియేషన్స్ బ్యానర్ పై రవీంద్ర రెడ్డి నిర్మిస్తున్నారు.