Hyper Adi: పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలుపును ఏ శక్తులూ అడ్డుకోలేవని నటుడు హైపర్ ఆది అన్నారు. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో జనసేన (Janasena)కు స్టార్ క్యాంపెయినర్లను పవన్ కల్యాణ్ (Pawan Kalyan) ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈనేపథ్యంలో హైపర్ ఆది (Hyper Adi) పిఠాపురం చేరుకున్నారు. జనసేన కార్యకర్తలు ఆయనకు ఘన స్వాగతం పలికారు. స్థానిక అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ప్రచారం ప్రారంభించారు. అనంతరం ఇంటింటి ప్రచారానికి వెళ్లారు. అనంతరం స్థానిక మీడియాతో మాట్లాడారు..
‘షూటింగ్స్ అన్నీ పూర్తి చేసుకున్నాను. నెలంతా జనసేన-పవన్ కల్యాణ్ గెలుపు కోసం ప్రచారానికే సిద్ధమయ్యా. పవన్ కల్యాణ్ పోటీ చేస్తున్న స్థానం మాత్రమే కాదు.. జనసేన పోటీ చేస్తున్న 21 స్థానాలకు వెళ్తా. ప్రతిచోటా జనసేనకు ప్రచారం చేస్తా. జనసేన గెలుపుకు కృషి చేస్తా. ఈసారి పవన్ కల్యాణ్ లక్ష మెజారిటీతో గెలుస్తారు. ప్రజలంతా పవన్ వైపే ఉన్నారు. హైదరాబాద్ ను చూసేందుకు జనం వచ్చినట్టే పవన్ ని గెలిపిస్తే పిఠాపురంలో జరిగే అభివృద్ధిని చూసేందుకు కూడా జనం వస్తార’ని అన్నారు.