ఏపీ ప్రభుత్వానికి హైకోర్టులో మరో ఎదురుదెబ్బ తగిలింది. ఇటీవల తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డులో ప్రత్యేక ఆహ్వానితుల కోసం రాష్ట్ర ప్రభుత్వం జారీచేసిన జీవోను తాత్కాలిక నిలుపుదల చేస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. తితిదే బోర్డు సభ్యుల నియామకాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి.
నిబంధనలకు విరుద్ధంగా ప్రత్యేక ఆహ్వానితులను నియమించారని పిటిషనర్ వాదనలు వినిపించారు. ఈ నియామకాలు సామాన్య భక్తులపై భారం పడుతుందని పిటిషనర్ల తరఫు న్యాయవాదులు కోర్టుకు విన్నవించారు. నిబంధనల ప్రకారమే నియామకాలు చేపట్టామని ప్రభుత్వం తరపు లాయర్లు వాదించారు.
ఇరువైపు వాదనలు విన్న హైకోర్టు జీవోను తాత్కాలిక నిలుపుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీనిపై రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు స్పందించారు. సాంకేతిక కారణాల పైనే హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చిందని అన్నారు. హైకోర్టు ఆదేశాలను పరిశీలించిన తర్వాత.. అప్పీలుకి వెళ్లాలా..? వద్దా..? అనేది నిర్ణయిస్తామని అన్నారు.
309223 998801I see something genuinely unique in this site . 363862
629038 546347What a lovely weblog page. I will certainly be back again. Please keep writing! 912097