అశోక్ గజపతిరాజుపై ఎంపీ విజయసాయిరెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. విశాఖలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘మాన్సాస్ ట్రస్ట్, సింహాచలం చైర్మన్ తీర్పుపై అప్పీల్కు వెళ్తాం. అశోక్ గజపతిరాజు విజయనగరం జిల్లాకు రాజులా ఫీలవుతున్నారు. మాన్సాస్ ట్రస్ట్లో వందల ఎకరాలు కాజేసిన చేసిన దొంగ. ఆయనపై గతంలో ఫోర్జరీ కేసు కూడా ఉంది. ఆయన జైలుకి వెళ్లడం తప్పదు’.
సుప్రీంకోర్టు లింగ వివక్ష చూపించొద్దని గతంలో తీర్పునిచ్చింది. కానీ.. అశోక్ గజపతిరాజు లింగ వివక్ష చూపిస్తున్నారు. సీఎం జగన్ పురుషులతో పాటు మహిళలనూ సమానంగా గౌరవిస్తున్నారు. భూకబ్జాల వ్యవహారంలో టీడీపీ నేతలు తాత్కాలికంగా కోర్టులు నుంచి స్టే తెచ్చుకుంటున్నారు. ఎప్పటికైనా శిక్ష నుంచి మాత్రం తప్పించుకోలేరు. ప్రభుత్వ భూములు ఆక్రమించిన వారిని వదిలిపెట్టేది లేదు. కోర్టులు, జడ్జిలు ప్రభుత్వ భూములను ఆక్రమించుకోమని ఎప్పుడూ చెప్పవు.
755698 922869I surely did not realize that. Learnt some thing new these days! Thanks for that. 693361