Switch to English

వైసీపీకి మళ్ళీ ‘పీకే’ అవసరం ఎందుకొచ్చినట్లు.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,460FansLike
57,764FollowersFollow

యువజన శ్రామిక రైతు కాంగ్రెస్‌ పార్టీకి మళ్ళీ ప్రశాంత్‌ కిషోర్‌ ‘అవసరం’ వచ్చిందట. గ్రామ స్థాయిలో పార్టీ పరిస్థితిపై ‘పీకే’ టీమ్ తో అంచనా వేయించి, పరిస్థితులు తేడాగా వుంటే సరిదిద్దుకునేందుకు పార్టీ అధిష్టానం నిర్ణయించిందట. ఈ మేరకు పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి, ప్రశాంత్‌ కిషోర్‌తో ఇటీవల పలు దఫాలుగా చర్చించారట. ఏడాది పాలన నేపథ్యంలో గ్రౌండ్‌ లెవల్‌లో పార్టీ పరిస్థితి ఏమంత బాగా లేదనే ‘ఇంటెలిజెన్స్‌ రిపోర్ట్‌’తోనే పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌ ఈ నిర్ణయం తీసుకున్నారట. గత కొద్ది రోజులుగా రాజకీయ వర్గాల్లో విన్పిస్తోన్న గుసగుసల సారాంశమిది.

151 మంది ఎమ్మెల్యేలు వైఎస్సార్సీపీకి వున్నారు. టీడీపీ నుంచి కొందరు, జనసేన పార్టీకి వున్న ఒకే ఒక్క ఎమ్మెల్యే ఇప్పటికే వైసీపీ వైపుగా వెళ్ళిపోయారు. ఈ పరిస్థితుల్లో పార్టీకి వచ్చిన నష్టమేంటి.? నిజానికి అయితే ఏమీ లేదనే అనుకోవాలి. కానీ, పైకి కన్పించే సీన్‌కీ.. గ్రౌండ్‌ లెవల్‌లో పరిస్థితులకీ చాలా తేడాలుంటాయి. పార్టీలో గత కొంత కాలంగా ఇసుక సమస్య సహా అనేక అంశాలపై అసంతృప్తి వ్యక్తమవుతోన్న విషయంపై వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి ఆందోళనగానే వున్నారు. ఈ నేపథ్యంలోనే గ్రౌండ్‌ లెవల్‌లో పరిస్థితుల్ని అంచనా వేయడానికి ‘పీకే’ సాయం కోరక తప్పలేదట.

మరోపక్క, 2019 ఎన్నికల్లో వైసీపీ గెలుపు కోసం పనిచేసిన పీకే టీమ్, ఆ తర్వాత కూడా ఎప్పటికప్పుడు గ్రౌండ్‌ లెవల్‌లో పరిస్థితుల్ని అంచనా వేస్తూనే వుంది. మరోపక్క, పీకే టీమ్ కి మద్దతుగా ప్రభుత్వం తరఫునే కొన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయంటే, ఓ మీడియా కథనం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. ప్రభుత్వం తరఫునే ఆ సంస్థకు ‘చెల్లింపులు’ కూడా జరుగుతున్నాయన్నది ఆ కథనం సారాంశం. ఓ జిల్లా కలెక్టర్‌ సదరు సంస్థ విషయమై ఆదేశాలు జారీ చేశారంటూ ఆ కథనంలో పేర్కొన్నారు.

మండల స్థాయి అధికారుల్ని ప్రభుత్వం నియమిస్తోందట.. వారంతా సదరు సంస్థకు చెందినవారేనట. ఆ సంస్థ అధిపతి, పీకే కోర్‌ టీమ్ సభ్యుడని అంటున్నారు. ఇప్పటికే గ్రామ వాలంటీర్ల విషయంలో అధికార పార్టీపై చాలా ఆరోపణలున్నాయి. ఓ సందర్భంలో ఎంపీ విజయసాయిరెడ్డి, ‘వాలంటీర్‌ పోస్టుల్ని మన పార్టీ కార్యకర్తలకే ఇచ్చుకున్నాం..’ అని అప్పట్లో చెప్పడం వివాదాస్పదమయిన విషయం విదితమే. మళ్ళీ ఇప్పుడు ఆ వాలంటీర్‌ వ్యవస్థ మీద పెత్తనం కోసం.. అదే సమయంలో పార్టీ వ్యవహారాల కోసం మండల స్థాయి అధికారుల్ని నియమించే ప్రయత్నాలు.. రాజకీయంగా పెను దుమారం రేపనున్నాయి. అయితే ఈ వ్యవహారంపై ప్రభుత్వ వెర్షన్‌ ఎలా వుంటుందన్నది వేచి చూడాల్సిందే.

4 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Movie: శ్రీ కమలహాసిని మూవీ మేకర్స్ ప్రొడక్షన్ నెం.1 మూవీ ప్రారంభం

Movie: ప్రస్తుతం ట్రెండ్ కంటెంట్, కాన్సెప్ట్ ఉన్న సినిమాలదే. అలా వచ్చిన సినిమాలను ప్రేక్షకులు ఆదరిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శ్రీ కమలహాసిని మూవీ...

Samantha: ఈసారి సరికొత్త లుక్.. పుట్టినరోజున ‘సమంత’ కొత్త సినిమా అప్డేట్

Samantha: సౌత్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha) కొన్నాళ్లుగా సినిమాలు చేయడం లేదు. సమంత నుంచి కొత్త సినిమా కబురు కోసం ఆమె అభిమానులు ఎప్పటినుంచో...

Chiranjeevi: లేటెస్ట్ అప్డేట్..! చిరంజీవి ‘విశ్వంభర’ కోసం భారీ సెట్స్..

Chiranjeevi: మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi) నటిస్తున్న సినిమా ‘విశ్వంభర’. (Vishwambhara) వశిష్ఠ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా యూవీ క్రియేషన్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. చిరంజీవి...

Varun Tej: ‘ప్రజలే పవన్ కల్యాణ్ కుటుంబం..’ జనసేన ప్రచారంలో వరుణ్...

Varun Tej: ఏపీలో ఎన్నికల హీట్ రోజురోజుకీ పెరుగుతోంది. నేతలంతా ప్రచారాలతో హోరెత్తిస్తున్నారు. ఈక్రమంలో బాబాయి పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కు మద్దతుగా.. జనసేన...

Faria Abdullah: ఈరోజుల్లో ‘ఆ ఒక్కటీ అడక్కు’ కంటెంట్ అవసరం: ఫరియా...

Faria Abdullah: అల్లరి నరేశ్ (Allari Naresh)-ఫరియా అబ్దుల్లా (Faria Abdullah) హీరోహీరోయిన్లుగా నటించిన సినిమా ‘ఆ ఒక్కటీ అడక్కు' (Aa Okkati Adakku). త్వరలో...

రాజకీయం

Janasena: ‘జనసేన’కు ఈసీ గుడ్ న్యూస్.. కామన్ సింబల్ గా ‘గ్లాసు’ గుర్తు..

Janasena: జనసేన (Janasena) పార్టీకి కేంద్ర ఎన్నికల కమిషన్ శుభవార్త చెప్పింది. పార్టీకి కామన్ సింబల్ గా ‘గాజు గ్లాస్’ గుర్తు కేటాయించాలని ఆదేశాలు జారీ చేసింది. ఈమేరకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్...

వైఎస్ షర్మిల ఎఫెక్ట్: క్రిస్టియన్ ఓట్లు వైసీపీకి దూరమయినట్టేనా.?

వైఎస్ షర్మిల, పదే పదే ‘క్రిస్టియన్’ ప్రస్తావన తీసుకొస్తున్నారు ఎన్నికల ప్రచారంలో. ‘మన మతం..’ అంటూ అన్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ‘క్రిస్టియానిటీ’ని గుర్తు చేస్తున్నారామె.! ఇంకోపక్క, వైఎస్ జగన్ మేనత్త...

ఇన్‌సైడ్ స్టోరీ: తునిలో కూటమికి అలా సెట్టయ్యింది.!

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని తుని నియోజకవర్గం విషయమై నిన్న మొన్నటిదాకా కూటమిలో కొంత గందరగోళం వుండేది. సీట్ల పంపకాల్లో తుని నియోజకవర్గం టీడీపీకి దక్కింది. మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు కుమార్తె యనమల...

పిఠాపురంలో వరుణ్ తేజ్ ప్రచారంపై వైసీపీ ఏడుపు.!

వైసీపీ కంటే, వైసీపీ పెంచి పోషిస్తోన్న నీలి కూలి మీడియా ఎక్కువ బాధపడిపోతోంది కొన్ని విషయాల్లో. సినీ నటుడు వరుణ్ తేజ్, పిఠాపురం నియోజకవర్గంలో జనసేన పార్టీ తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహిస్తే,...

నవరత్నాలు ప్లస్సు కాదు.. ఇప్పుడు మైనస్.!

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, ఎన్నికల మేనిఫెస్టో ప్రకటించింది. దీనికి ‘నవరత్నాలు ప్లస్’ అని పేరు పెట్టుకుంది ఆ పార్టీ. రైతులకు రుణ మాఫీ సహా, పలు కీలక అంశాలు కొత్త మేనిఫెస్టోలో వైసీపీ...

ఎక్కువ చదివినవి

Varun Tej: ‘ప్రజలే పవన్ కల్యాణ్ కుటుంబం..’ జనసేన ప్రచారంలో వరుణ్ తేజ్

Varun Tej: ఏపీలో ఎన్నికల హీట్ రోజురోజుకీ పెరుగుతోంది. నేతలంతా ప్రచారాలతో హోరెత్తిస్తున్నారు. ఈక్రమంలో బాబాయి పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కు మద్దతుగా.. జనసేన (Janasena) గెలుపుకు తన వంతు కృషి...

చెల్లెలి చీర రంగు మీద పడి ఏడ్చేవాళ్ళని ఏమనగలం.?

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి ఆయన ప్రస్తుతానికి.! ఎన్నికల తర్వాత ఆ పదవి వుంటుందా.? ఊడుతుందా.? అన్నది వేరే చర్చ. ఓ రాజకీయ పార్టీకి అధినేత కూడా.! ఎంత బాధ్యతగా మాట్లాడాలి.? అదీ కుటుంబ...

గ్రౌండ్ రిపోర్ట్: మంగళగిరిలో నారా లోకేష్‌కి సానుకూలమేనా.?

‘ఓడిపోయాడు, నియోజకవర్గం మార్చేస్తాడు..’ అంటూ నారా లోకేష్ గురించి నానా రకాల ప్రచారమూ జరిగింది. 2019 ఎన్నికల్లో నారా లోకేష్ రిస్క్ తీసుకుని మరీ, మంగళగిరి నియోజకవర్గాన్ని ఎంచుకున్నారని టీడీపీ చెబుతుంటుంది. అందులో...

Viral News: మాజీ క్రికెటర్ పై చిరుత దాడి.. పోరాడి కాపాడిన పెంపుడు శునకం

Viral News: పెంపుడు జంతువులు మనుషులపై ఎంతటి ప్రేమ చూపిస్తాయో తెలిపేందుకు జింబాబ్వేలో జరిగిన ఘటనే నిదర్శనం. జింబాబ్వే (zimbabwe) మాజీ క్రికెటర్ గయ్ విట్టల్ (Guy Whittal) పై చిరుతపులి దాడి...

Jai Hanuman: ‘జై హనుమాన్’ అప్డేట్.. అంచనాలు పెంచేసిన ప్రశాంత్ వర్మ

Jai Hanuman: తేజ సజ్జా (Teja Sajja) హీరోగా ప్రశాంత్ వర్మ (Prasanth Varma) దర్శకత్వంలో తెరకెక్కిన ‘హను-మాన్’ (Hanu-man) సంచలన విజయం సాధించడమే కాకుండా 100రోజులు దిగ్విజయంగా ప్రదర్శితమై సంచలనం రేపింది....