Switch to English

ఆత్మ నిర్భర్‌ భారత్‌ 2: మళ్ళీ మళ్ళీ అదే అంకెల గారడీ..

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,459FansLike
57,764FollowersFollow

ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ 20 లక్షల కోట్ల రూపాయల ప్యాకేజీని ‘ఆత్మ నిర్భర్‌ భారత్‌ అభియాన్’ పేరుతో ప్రకటించిన విషయం విదితమే. దానికి సంబంధించిన పూర్తి వివరాల్ని వెల్లడించే క్రమంలో నిన్న కొన్ని విషయాల్ని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రకటించారు. దీన్ని ‘ఆత్మ నిర్భర్‌ భారత్‌ అభియాన్ -1’గా భావిస్తే, ఈ రోజు ఎపిసోడ్‌ని ‘ఆత్మ నిర్భర్‌ భారత్‌ అభియాన్ 2’ అనుకోవాలి.

ఇక, ఫస్ట్‌ ఫేజ్‌ ఎంత నిరాశపర్చిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తాజాగా రెండో ఫేజ్‌ కూడా ఎవర్నీ మెప్పించలేకపోయింది. కిసాన్‌ కార్డుదారులకు 25 వేల కోట్ల రుణాలు, మత్సకారులకు కిసాన్‌ క్రెడిట్‌ కార్డులు.. వంటి అంశాలున్నాయి నిర్మలా సీతారామన్‌ నేడు మీడియా ముందుకొచ్చి చేసిన ప్రసంగంలో. ముద్ర రుణాల గురించి మాట్లాడారు.. మారటోరియం గురించి ప్రస్తావించారు. వీధి వ్యాపారులకు రుణ సదుపాయం కల్పిస్తామన్నారు.

స్వల్ప అద్దె గృహాల నిర్మాణానికి కొత్త పథకాన్ని తీసుకొస్తున్నట్లు చెప్పారు. ఆగస్ట్‌ నుంచి ఒకే దేశం ఒకే కార్డు.. అమల్లోకి వస్తుందనీ, రేషన్‌ కార్డుదారులు దేశంలో ఎక్కడైనా రేషన్‌ తీసుకోవచ్చని అన్నారు నిర్మలా సీతారామన్‌. దేశమంతా ఒకటే కనీస వేతనం వుండేలా చూస్తామంటూ నిర్మలమ్మ చేసిన ప్రకటన పట్ల కార్మిక లోకం నుంచి కొంత హర్షం వ్యక్తమవుతోంది.

వలస కార్మికులందరికీ ఆరోగ్య పరీక్షలు చేయించాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఇక, గ్రామీణ మౌలిక సదుపాయాల కోసం 4,200 కోట్లు కేటాయించనుండడం సహా పలు అంశాల్ని నిర్మలమ్మ తన ప్రసంగంలో పేర్కొన్నారు. అయితే, నిర్మలా సీతారామన్‌ ప్రసంంగంలో ఎక్కువగా ‘అప్పుల ప్రస్తావన’ వుంది తప్ప, నేరుగా ‘కరోనా బాధితులకు’ సాయం అనేది లేకపోవడం పట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

వన్‌ నేషన్‌.. వన్‌ రేషన్‌.. అనేది చాలాకాలంగా చర్చల్లో వున్నదే. దాన్ని, ఇప్పుడెందుకు ప్రాస్తావించడం.? అన్న ప్రశ్న విపక్షాల నుంచి దూసుకొస్తోంది. మొత్తమ్మీద, కొత్త సీసాలో పాత సారా.. అన్నట్లు తయారైంది కేంద్రం ప్రతిష్టాత్మకంగా ప్రకటించిన 20 లక్షల కోట్ల రూపాయల విలువైన ‘ఆత్మ నిర్భర్‌ భారత్‌’ ప్యాకేజీ.

ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదాని పక్కన పెట్టి, ప్రత్యేక ప్యాకేజీ పేరుతో అంకెల డ్రామాని కేంద్రం తెరపైకి తెచ్చిన విషయం గుర్తుంది కదా.? ఇప్పుడీ ఆత్మ నిర్భర్‌ భారత్‌ అభియాన్ కూడా.. అదే తరహా అంకెల గారడీని తలపిస్తోంది. చూద్దాం.. ముందు ముందు ఈ ప్యాకేజీకి సంబంధించి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్.. ఇంకెన్ని అంకెల గారడీలు చేస్తారో.

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Betting case: బెట్టింగ్ కేసులో బాలీవుడ్ నటుడు అరెస్టు.. సినీ ఫక్కీలో...

Betting case: సంచలనం రేపిన మహదేవ్ బెట్టింగ్ యాప్ (Mahadev betting app case) కుంభకోణంలో బాలీవుడ్ నటుడు సాహిల్ ఖాన్ (Sahil Khan) ను...

Movie: శ్రీ కమలహాసిని మూవీ మేకర్స్ ప్రొడక్షన్ నెం.1 మూవీ ప్రారంభం

Movie: ప్రస్తుతం ట్రెండ్ కంటెంట్, కాన్సెప్ట్ ఉన్న సినిమాలదే. అలా వచ్చిన సినిమాలను ప్రేక్షకులు ఆదరిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శ్రీ కమలహాసిని మూవీ...

Samantha: ఈసారి సరికొత్త లుక్.. పుట్టినరోజున ‘సమంత’ కొత్త సినిమా అప్డేట్

Samantha: సౌత్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha) కొన్నాళ్లుగా సినిమాలు చేయడం లేదు. సమంత నుంచి కొత్త సినిమా కబురు కోసం ఆమె అభిమానులు ఎప్పటినుంచో...

Chiranjeevi: లేటెస్ట్ అప్డేట్..! చిరంజీవి ‘విశ్వంభర’ కోసం భారీ సెట్స్..

Chiranjeevi: మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi) నటిస్తున్న సినిమా ‘విశ్వంభర’. (Vishwambhara) వశిష్ఠ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా యూవీ క్రియేషన్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. చిరంజీవి...

Varun Tej: ‘ప్రజలే పవన్ కల్యాణ్ కుటుంబం..’ జనసేన ప్రచారంలో వరుణ్...

Varun Tej: ఏపీలో ఎన్నికల హీట్ రోజురోజుకీ పెరుగుతోంది. నేతలంతా ప్రచారాలతో హోరెత్తిస్తున్నారు. ఈక్రమంలో బాబాయి పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కు మద్దతుగా.. జనసేన...

రాజకీయం

సీమలో ‘సిరిగిపోయిన’ వైసీపీ మేనిఫెస్టో.!

దీన్ని మేనిఫెస్టో అంటారా.? 2019 ఎన్నికల మేనిఫెస్టోలోంచి కొన్ని అంశాల్ని తీసేస్తే, అది ‘నవరత్నాలు మైనస్’ అవుతుందిగానీ, ‘నవరత్నాలు ప్లస్’ ఎలా అవుతుంది.? ఈ మేనిఫెస్టో దెబ్బకి, ‘వైసీపీకి అధికారం మైనస్’ అంటూ...

Chiranjeevi: పిఠాపురంలో చిరంజీవి ప్రచారానికి వస్తారా..?!

Chiranjeevi: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఏపీ రాజకీయాలు వేసవి ఎండలకుమల్లే రోజురోజుకీ హీటెక్కిపోతున్నాయి. పార్టీలన్నీ రాష్ట్రవ్యాప్తంగా ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. ఈక్రమంలో రాజకీయాల్లో మిక్స్ అయ్యే సినీ గ్లామర్ ఈసారీ కనిపిస్తోంది. ఎన్నికల సమయంలో...

గెలిచాక పార్టీ మారతారట.! ఏపీలో ఇదో కొత్త ట్రెండ్.!

‘మమ్మల్ని గెలిపించండి.. గెలిచాక, ఈ పార్టీలో వుండం. మేం పార్టీ మారతాం.. ఖచ్చితంగా..!’ అంటూ కొందరు అభ్యర్థులు ఎన్నికల ప్రచారంలో భాగంగా చేస్తున్న వ్యాఖ్యలు, ఓటర్లకు భలే వినోదాన్ని ఇస్తున్నాయి. అధికార వైసీపీకి...

వంగా గీత ‘పార్టీ మార్పు’ ప్రచారం వెనుక.!

వంగా గీత పార్టీ మారుతున్నారట కదా.! వైసీపీకి గుడ్ బై చెప్పి, జనసేనలోకి ఆమె వెళ్ళబోతున్నారట కదా.! నామినేషన్‌ని వంగా గీత వెనక్కి తీసుకుంటున్నారట కదా.! ఇవన్నీ సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న...

Janasena: ‘జనసేన’కు ఈసీ గుడ్ న్యూస్.. కామన్ సింబల్ గా ‘గ్లాసు’ గుర్తు..

Janasena: జనసేన (Janasena) పార్టీకి కేంద్ర ఎన్నికల కమిషన్ శుభవార్త చెప్పింది. పార్టీకి కామన్ సింబల్ గా ‘గాజు గ్లాస్’ గుర్తు కేటాయించాలని ఆదేశాలు జారీ చేసింది. ఈమేరకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్...

ఎక్కువ చదివినవి

ఎన్టీయార్ అభిమానుల్నే నమ్ముకున్న కొడాలి నాని.!

మామూలుగా అయితే, గుడివాడ అసెంబ్లీ నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే కొడాలి నానికి తిరుగే లేదు.! కానీ, ఈసారి ఈక్వేషన్ మారినట్లే కనిపిస్తోంది. నియోజకవర్గంలో రోడ్ల దుస్థితి దగ్గర్నుంచి, చాలా విషయాలు కొడాలి నానికి...

పో..‘సాని’తనం.! ఒళ్ళు కొవ్వెక్కితే పెళ్ళాం.!

‘ఒళ్ళు కొవ్వెక్కితే పెళ్లాం’ అంటారు.! ‘ఒళ్ళు కొవ్వెక్కితే పెళ్ళాం అంటారు’.! రెండు మాటలకీ పెద్దగా తేడా ఏం లేదు కదా.? లేకపోవడమేంటి.? చాలా పెద్ద తేడా వుంది.! ఈ పెళ్ళాం గోలేంటి.? మనుషులమే కదా.?...

నవరత్నాలు ప్లస్సు కాదు.. ఇప్పుడు మైనస్.!

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, ఎన్నికల మేనిఫెస్టో ప్రకటించింది. దీనికి ‘నవరత్నాలు ప్లస్’ అని పేరు పెట్టుకుంది ఆ పార్టీ. రైతులకు రుణ మాఫీ సహా, పలు కీలక అంశాలు కొత్త మేనిఫెస్టోలో వైసీపీ...

ఇన్‌సైడ్ స్టోరీ: తునిలో కూటమికి అలా సెట్టయ్యింది.!

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని తుని నియోజకవర్గం విషయమై నిన్న మొన్నటిదాకా కూటమిలో కొంత గందరగోళం వుండేది. సీట్ల పంపకాల్లో తుని నియోజకవర్గం టీడీపీకి దక్కింది. మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు కుమార్తె యనమల...

‘సాక్షి’ పత్రికని బలవంతంగా అంటగడుతున్నారెందుకు.?

సాక్షి పత్రికని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఉచితంగా పంచి పెడుతున్నారట.! ఈనాడు, ఆంధ్ర జ్యోతి పత్రికలదీ అదే పరిస్థితి అట.! అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో, ఆంధ్ర ప్రదేశ్‌లో ఈ ‘ఉచిత...