Switch to English

ఆత్మ నిర్భర్‌ భారత్‌ 2: మళ్ళీ మళ్ళీ అదే అంకెల గారడీ..

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,513FansLike
57,764FollowersFollow

ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ 20 లక్షల కోట్ల రూపాయల ప్యాకేజీని ‘ఆత్మ నిర్భర్‌ భారత్‌ అభియాన్’ పేరుతో ప్రకటించిన విషయం విదితమే. దానికి సంబంధించిన పూర్తి వివరాల్ని వెల్లడించే క్రమంలో నిన్న కొన్ని విషయాల్ని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రకటించారు. దీన్ని ‘ఆత్మ నిర్భర్‌ భారత్‌ అభియాన్ -1’గా భావిస్తే, ఈ రోజు ఎపిసోడ్‌ని ‘ఆత్మ నిర్భర్‌ భారత్‌ అభియాన్ 2’ అనుకోవాలి.

ఇక, ఫస్ట్‌ ఫేజ్‌ ఎంత నిరాశపర్చిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తాజాగా రెండో ఫేజ్‌ కూడా ఎవర్నీ మెప్పించలేకపోయింది. కిసాన్‌ కార్డుదారులకు 25 వేల కోట్ల రుణాలు, మత్సకారులకు కిసాన్‌ క్రెడిట్‌ కార్డులు.. వంటి అంశాలున్నాయి నిర్మలా సీతారామన్‌ నేడు మీడియా ముందుకొచ్చి చేసిన ప్రసంగంలో. ముద్ర రుణాల గురించి మాట్లాడారు.. మారటోరియం గురించి ప్రస్తావించారు. వీధి వ్యాపారులకు రుణ సదుపాయం కల్పిస్తామన్నారు.

స్వల్ప అద్దె గృహాల నిర్మాణానికి కొత్త పథకాన్ని తీసుకొస్తున్నట్లు చెప్పారు. ఆగస్ట్‌ నుంచి ఒకే దేశం ఒకే కార్డు.. అమల్లోకి వస్తుందనీ, రేషన్‌ కార్డుదారులు దేశంలో ఎక్కడైనా రేషన్‌ తీసుకోవచ్చని అన్నారు నిర్మలా సీతారామన్‌. దేశమంతా ఒకటే కనీస వేతనం వుండేలా చూస్తామంటూ నిర్మలమ్మ చేసిన ప్రకటన పట్ల కార్మిక లోకం నుంచి కొంత హర్షం వ్యక్తమవుతోంది.

వలస కార్మికులందరికీ ఆరోగ్య పరీక్షలు చేయించాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఇక, గ్రామీణ మౌలిక సదుపాయాల కోసం 4,200 కోట్లు కేటాయించనుండడం సహా పలు అంశాల్ని నిర్మలమ్మ తన ప్రసంగంలో పేర్కొన్నారు. అయితే, నిర్మలా సీతారామన్‌ ప్రసంంగంలో ఎక్కువగా ‘అప్పుల ప్రస్తావన’ వుంది తప్ప, నేరుగా ‘కరోనా బాధితులకు’ సాయం అనేది లేకపోవడం పట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

వన్‌ నేషన్‌.. వన్‌ రేషన్‌.. అనేది చాలాకాలంగా చర్చల్లో వున్నదే. దాన్ని, ఇప్పుడెందుకు ప్రాస్తావించడం.? అన్న ప్రశ్న విపక్షాల నుంచి దూసుకొస్తోంది. మొత్తమ్మీద, కొత్త సీసాలో పాత సారా.. అన్నట్లు తయారైంది కేంద్రం ప్రతిష్టాత్మకంగా ప్రకటించిన 20 లక్షల కోట్ల రూపాయల విలువైన ‘ఆత్మ నిర్భర్‌ భారత్‌’ ప్యాకేజీ.

ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదాని పక్కన పెట్టి, ప్రత్యేక ప్యాకేజీ పేరుతో అంకెల డ్రామాని కేంద్రం తెరపైకి తెచ్చిన విషయం గుర్తుంది కదా.? ఇప్పుడీ ఆత్మ నిర్భర్‌ భారత్‌ అభియాన్ కూడా.. అదే తరహా అంకెల గారడీని తలపిస్తోంది. చూద్దాం.. ముందు ముందు ఈ ప్యాకేజీకి సంబంధించి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్.. ఇంకెన్ని అంకెల గారడీలు చేస్తారో.

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

‘టిల్లు స్క్వేర్‌’ లో కొత్త అందాలు చూడబోతున్నామా..!

సిద్దు జొన్నలగడ్డ హీరోగా రూపొంది మంచి విజయాన్ని సొంతం చేసుకున్న డీజే టిల్లుకు సీక్వెల్‌ గా రూపొంది మరి కొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న...

బ్రేకింగ్ : యూఎస్ లో తెలుగు హీరోకి యాక్సిడెంట్‌

జాతిరత్నాలు సినిమాతో స్టార్‌ హీరోగా యూత్‌ లో మంచి క్రేజ్ ను దక్కించుకున్న నవీన్ పొలిశెట్టి ఆ మధ్య మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి సినిమాతో...

Kalki 2898AD : ప్రభాస్ కి ఉన్నది ఒకే ఒక్క ఆప్షన్..!

Kalki 2898AD : యంగ్ రెబల్‌ స్టార్‌ ప్రభాస్ హీరోగా మహానటి దర్శకుడు నాగ్‌ అశ్విన్ దర్శకత్వంలో రూపొందుతున్న కల్కి 2898 ఏడీ సినిమా విడుదల...

Manchu Manoj: ‘చిరంజీవి-మోహన్ బాబు’ పై మంచు మనోజ్ సరదా కామెంట్స్

Manchu Manoj: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) జన్మదిన వేడుకల సందర్భంగా హైదరాబాద్ శిల్పకళావేదికలో జరిగిన కార్యక్రమంలో హీరో మంచు మనోజ్ (Manchu...

Game Changer: ‘గేమ్ చేంజర్’ స్పెషల్ అప్డేట్.. పూనకాలు తెప్పించిన దిల్...

Game Changer: దిగ్గజ దర్శకుడు శంకర్ (Shankar) దర్శకత్వంలో రామ్ చరణ్ (Ram Charan) నటిస్తున్న సినిమా గేమ్ చేంజర్ (Game Changer). నేడు రామ్...

రాజకీయం

Tillu Square : ఫీల్ అయిన అనుపమ.. టిల్లు రిక్వెస్ట్

Tillu Square : డీజే టిల్లు కు సీక్వెల్ గా రూపొందిన టిల్లు స్క్వేర్ సినిమా రేపు విడుదల అవ్వబోతున్న విషయం తెల్సిందే. సినిమా విడుదల నేపథ్యంలో నిన్న రిలీజ్ ట్రైలర్ ను...

వైఎస్ జగన్ ‘మేం సిద్ధం’ యాత్ర.! తొలి రోజు అట్టర్ ఫ్లాప్ షో.!

ఏమయ్యింది.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి.? ‘సిద్ధం’ సభల కోసం 18 లక్షల మంది జనాన్ని రప్పించగలిగామని గొప్పలు చెప్పుకున్న వైసీపీ, అట్టహాసంగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ‘మేం సిద్ధం’ బస్సు యాత్ర...

వైసీపీ ఎంపీ వంగా గీతకి ఎందుకింత ప్రజా తిరస్కారం.?

వంగా గీత.. వైసీపీ ఎంపీ.! ఆమె అనూహ్యంగా ఇప్పుడు అసెంబ్లీకి పోటీ చేస్తున్నారు. అదీ పిఠాపురం నియోజకవర్గం నుంచి. కాకినాడ ఎంపీగా పని చేస్తున్న వంగా గీత, అదే పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని...

కంటెయినర్ రాజకీయం.! అసలేం జరుగుతోంది.?

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నివాసంలోకి ఓ అనుమానాస్పద కంటెయినర్ వెళ్ళిందిట.! అంతే అనుమానాస్పదంగా ఆ కంటెయినర్ తిరిగి వెనక్కి వచ్చిందట. వెళ్ళడానికీ, రావడానికీ మధ్యన ఏం జరిగింది.? అంటూ టీడీపీ...

Nara Lokesh: ‘సీఎం ఇంటికెళ్లిన కంటెయినర్ కథేంటి..’ లోకేశ్ ప్రశ్నలు

Nara Lokesh: సీఎం జగన్ (CM Jagan) ఇంటికి వెళ్లిన కంటెయనర్ అంశం ఏపీ రాజకీయాల్లో ప్రకంపనలు పుట్టిస్తోంది. ఇది ఎన్నికల నిబంధనను ఉల్లంఘించడమేనంటూ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ (Nara...

ఎక్కువ చదివినవి

Taapsee: తాప్సీ సీక్రెట్ గా పెళ్లి చేసుకుందా..!? న్యూస్ వైరల్

Taapsee: హీరోయిన్ తాప్సీ (Taapsee) పెళ్లి చేసుకుందా..? అంటే తాప్సీ ఫ్రెండ్, నిర్మాత కనిక చేసిన ఇన్ స్టా పోస్ట్ ఔననే సమాధానమే ఇస్తోంది. కొన్ని ఫొటోలు పోస్ట్ చేసిన ఆమె.. ‘నా...

Tillu Square : ఫీల్ అయిన అనుపమ.. టిల్లు రిక్వెస్ట్

Tillu Square : డీజే టిల్లు కు సీక్వెల్ గా రూపొందిన టిల్లు స్క్వేర్ సినిమా రేపు విడుదల అవ్వబోతున్న విషయం తెల్సిందే. సినిమా విడుదల నేపథ్యంలో నిన్న రిలీజ్ ట్రైలర్ ను...

కవిత, కేజ్రీవాల్.. తర్వాత అరెస్టయ్యేదెవరు.?

దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కామ్ వ్యవహారంలో తెలంగాణకు చెందిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అరెస్టు.. ఇంకో సంచలనం. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీయార్ కుమార్తె కవిత...

Ram Charan: రామ్ చరణ్ కు పుట్టినరోజు శుభాకాంక్షల వెల్లువ

Ram Charan: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) పుట్టినరోజు సందర్భంగా ఆయనకు పరిశ్రమ, కుటుంబం, అభిమానుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. తన పుట్టినరోజు సందర్భంగా నేడు కుటుంబసమేతంగా తిరుమల శ్రీవారిని...

Chandrababu Naidu: పిఠాపురం కోసం చంద్రబాబు మాస్టర్ ప్లాన్.!

కుప్పం నియోజకవర్గాన్ని గెలవడం ఎంత ముఖ్యమో, పిఠాపురం నియోజకవర్గంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గెలవడం కూడా తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడికి అంతే ముఖ్యం.! ‘వెన్నుపోటు రాజకీయాలకు కేరాఫ్ అడ్రస్’ అనే...