Switch to English

20 లక్షల కోట్లు – ఆత్మ నిర్భర్‌ భారత్‌: అంకెలు బాగున్నాయ్‌గానీ.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,467FansLike
57,764FollowersFollow

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నిన్న రాత్రి జాతిని ఉద్దేశించి చేసిన ప్రసంగంలో 20 లక్షల కోట్ల ప్యాకేజీని ‘ఆత్మ నిర్భర్‌ భారత్‌’ పేరుతో ప్రకటించిన విషయం విదితమే. ఈ 20 లక్షల కోట్ల ప్యాకేజీకి సంబంధించి కేంద్ర ఆర్థిక మంత్రి పూర్తి వివరాలు ప్రకటిస్తారని మోడీ చెప్పారు.

తాజాగా ఈ రోజు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌, మీడియా ముందుకొచ్చి.. 20 లక్షల ప్యాకేజీకి సంబంధించి కొంత భాగం తాలూకు వివరాల్ని వెల్లడించారు. ముందు ముందు మరిన్ని లెక్కలు బయటకొస్తాయ్‌ గనుక.. ఇప్పుడు వచ్చిన లెక్కలతోనే పూర్తిగా ఈ ప్యాకేజీని సమర్థించడంగానీ, వ్యతిరేకించడంగానీ చేయలేని పరిస్థితి.

టీడీఎస్‌, టీసీఎస్‌ 25 శాతం తగ్గింపు ఖచ్చితంగా ఊరటనిచ్చే విషయమే. ట్యాక్స్‌ రిటర్న్‌ల గడువు పొడిగింపు కూడా ఆహ్వానించదగ్గ అంశంగానే పరిగణించాలి. పనిని బట్టి కాంట్రాక్టర్లకు డబ్బులు చెల్లిస్తామనడం, రియల్‌ ఎస్టేట్‌ నిర్మాణాల కాల పరిమితి 6 నెలలు పొడిగిస్తూ నిర్ణయం తీసుకోవడం, డిస్కమ్ ల కోసం 90 వేల కోట్ల నిధులు కేటాయించడం, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు ఊరటనిచ్చేలా నిర్ణయాలు తీసుకోవడం వంటివన్నీ అభినందించదగ్గ అంశాలే.

అయితే, వీటి వల్ల సామాన్యుడికి డైరెక్ట్‌గా ఒరిగేదేంటి.? అన్నదే మిలియన్‌ డాలర్ల ప్రశ్న. కార్మికుల్నే తీసుకుంటే, కార్మికులుగా గుర్తింపు పొందినవారికి ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ది పొందే అవకాశం వుంటుంది. కానీ, కార్మికులుగా గుర్తింపు లేని వలస కార్మికుల మాటేమిటి.? ప్రతి ఒక్కరికీ మేలు చేకూరేలా ఈ ప్యాకేజీ.. అని కేంద్రం చెబుతున్నా, ఆ ‘అందరికీ’ అన్న మాటల్లో స్పష్టత మాత్రం కన్పించడంలేదు.

నిజానికి, బడ్జెట్‌ సమయంలో ప్రతిసారీ ఈ తరహా అంకెల గారడీ గురించి వింటుంటాం. కానీ, సామాన్యుడి చేతికి అందేదెంత.? అన్న విషయానికొచ్చేసరికి.. అందడం సంగతెలా వున్నా, జేబుకి చిల్లు మాత్రం పెరిగిపోతూ వస్తోంది. అయితే, రానున్న రోజుల్లో మరిన్ని ప్రకటనలు కేంద్ర ఆర్థిక మంత్రి నుంచి రాబోతున్నాయి. వాటిల్లో అయినా సామాన్యుడికి ఊరట కలుగుతుందా.? లేదంటే, అక్కడా అంకెల గారడీ చేస్తారా.? అన్నది వేచి చూడాల్సిందే.

4 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Nani: ‘జెర్సీ’ @5..! ధియేటర్లో సినిమా చూసిన నాని.. ఎమోషనల్ పోస్ట్

Nani: నాని (Nani) హీరోగా గౌతమ్ తిన్ననూరి (Gowtham Thinnanuri) దర్శకత్వంలో వచ్చిన ‘జెర్సీ’ (Jersey) విడుదలై నిన్నటికి 5ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా సినిమాను...

Upasana: ఆవకాయ పట్టిన అత్తమ్మ.. ఆటపట్టించిన ఉపాసన.. వీడియో వైరల్  

Upasana: టాలీవుడ్ (Tollywood) లో మెగా ఫ్యామిలీ (Mega Family) అంటే ఒక సందడి. ఒక బ్రాండ్. ముఖ్యంగా చిరంజీవి (Chiranjeevi). ఆయనొక ఇన్ స్పిరేషన్...

Puri Jagannadh: ఎవరు కొడితే బొమ్మ బ్లాక్ బస్టరవుద్దో.. అతనే ‘పూరి...

Puri Jagannadh: సినిమాకి హీరోకి ఉండే క్రేజే వేరు. సరైన సినిమాపడి స్టార్ స్టేటస్ వస్తే ఫ్యాన్స్ పెరుగుతారు.. డెమీ గాడ్ కూడా అయిపోతాడు. హీరో...

Harish Shankar: చోటా కె.నాయుడుపై హరీశ్ శంకర్ ఆగ్రహం.. బహిరంగ లేఖ

Harish Shankar: టాలీవుడ్ (Tollywood) సీనియర్ స్టార్ సినిమాటోగ్రాఫర్ చోటా కె.నాయుడు (Chota K Naidu) పై బ్లాక్ బస్టర్ దర్శకుడు హరీశ్ శంకర్ (Harish...

Mad Square: మ్యాడ్ సీక్వెల్ ‘మ్యాడ్ స్క్వేర్’ ప్రారంభం.. ఫన్ డబుల్...

Mad Square: గతేడాది విడుదలై యూత్ ని ఆకట్టుకున్న సక్సెస్ ఫుల్ మూవీ 'మ్యాడ్' (Mad). ఈ సినిమాకి సీక్వెల్‌ గా 'మ్యాడ్ స్క్వేర్' (Mad...

రాజకీయం

చిరంజీవిపై ‘మూక దాడి’.! వైసీపీకే పెను నష్టం.!

వైఎస్ వివేకానంద రెడ్డికే అక్రమ సంబంధాలు అంటగట్టిన ఘన చరిత్ర వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీది.! వైఎస్ షర్మిలా రెడ్డిని కాస్తా మెరుసుపల్లి షర్మిల శాస్త్రి.. అంటూ ఎగతాళి చేసిన ఘనత వైసీపీకి కాక...

ఏపీలో బీజేపీని ఓడించేయనున్న బీజేపీ మద్దతుదారులు.!

ఇదో చిత్రమైన సందర్భం.! ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీకి, ఆ పార్టీ మద్దతుదారులే శాపంగా మారుతున్నారు. అందరూ అని కాదుగానీ, కొందరి పైత్యం.. పార్టీ కొంప ముంచేస్తోంది.! టీడీపీ - బీజేపీ...

వ్యూహకర్తల మాటే శాసనం.. వారిదే పెత్తనం

దేశ రాజకీయాల్లో వ్యూహకర్తల పాత్ర రోజురోజుకి పెరిగిపోతోంది. గతంలో మాదిరిగా స్థానిక నాయకత్వంతో వ్యూహాలను రచించి ఎత్తుకు పై ఎత్తులు వేసే రోజులు పోయాయి. మరి ముఖ్యంగా ప్రచార పర్వాన్ని వ్యూహకర్తలే శాసిస్తున్నారు....

కులాంతరంలో కూడా రాజకీయ క్రీడ.!

ప్రజల నుంచి ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోవాలి అంటే.. ప్రజలందరికి మంచి చెయ్యటం వ్యక్తులకి సాధ్యం కాదు. అందుకని మనుషులని ఎదో ఒకరకంగా కూడగట్టాలి. ఉద్యోగులు, నిరుద్యోగులు, మహిళలు, రైతులు, కార్మికులు, విద్యార్థులు,...

ఎన్డిఏ కూటమి అభ్యర్థులను గెలిపించండి.. అభిమానులకు మెగాస్టార్ పిలుపు

ఆంధ్రప్రదేశ్ లో త్వరలో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అభ్యర్థులు సీఎం రమేష్, పంచకర్ల రమేష్ బాబును గెలిపించాలంటూ మెగాస్టార్ చిరంజీవి( Chiranjeevi) తన అభిమానులకు పిలుపునిచ్చారు. ఏపీలో చంద్రబాబు నాయుడు,...

ఎక్కువ చదివినవి

Tollywood: ‘మిస్టర్.. మాట జారొద్దు..’ నటుడికి హీరోయిన్ ఘాటు రిప్లై

Tollywood: హీరోయిన్ నభా నటేశ్ (Nabha Natesh), నటుడు ప్రియదర్శి (Priyadarshi) మధ్య ట్వీట్ వార్ ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. వివరాల్లోకి వెళ్తే.. ‘హాయ్ డార్లింగ్స్.. ఎలా ఉన్నారు..!’ అంటూ ప్రభాస్...

స్క్రిప్ట్ చేతిలో వైఎస్ జగన్ ఎందుకు బందీ అయ్యారు.!?

అసలేమయ్యింది వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి.? సుదీర్ఘ పాదయాత్ర చేసిన సమయంలో ఎవరి స్క్రిప్ట్ అవసరం లేకుండానే ప్రసంగాలు చేశారు కదా.? కానీ, ఇప్పుడేమయ్యింది.? స్క్రిప్టు చేతిలో వుంటే తప్ప మాట్లాడలేకపోతున్నారు.. ఆ...

Upasana: ఆవకాయ పట్టిన అత్తమ్మ.. ఆటపట్టించిన ఉపాసన.. వీడియో వైరల్  

Upasana: టాలీవుడ్ (Tollywood) లో మెగా ఫ్యామిలీ (Mega Family) అంటే ఒక సందడి. ఒక బ్రాండ్. ముఖ్యంగా చిరంజీవి (Chiranjeevi). ఆయనొక ఇన్ స్పిరేషన్ పర్సనాలిటీ. నిత్యం సినిమాలతో బిజీ. పరిశ్రమ...

అవినాష్ వర్సెస్ సునీత.! కడపలో వైసీపీ ఖేల్ ఖతం.!

సీబీఐ ఛార్జిషీట్‌లో పేర్కొన్న అంశాల్నే ప్రస్తావిస్తున్నారు మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి కుమార్తె సునీతా రెడ్డి.! 2019 ఎన్నికల సమయంలో వైఎస్ వివేకానంద రెడ్డి హత్య జరిగితే, సీబీఐ విచారణ కోసం...

పవన్ కళ్యాణ్‌కీ వైఎస్ జగన్‌కీ అదే తేడా.!

ఇతరుల భార్యల్ని ‘పెళ్ళాలు’ అనడాన్ని సభ్య సమాజం హర్షించదు. భార్యల్ని కార్లతో పోల్చడం అత్యంత జుగుప్సాకరం.! ఈ విషయమై కనీస సంస్కారం లేకుండా ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి...