టాలీవుడ్ జక్కన్న రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన బాహుబలి చిత్రాన్ని మొదట ఒక్క పార్ట్గానే విడుదల చేయాలనుకున్నారు. కాని కథ పెద్దగా ఉండటంతో పాటు ఎక్కువ బడ్జెట్ అవ్వడం వల్ల రెండు పార్ట్లుగా విడుదల చేసిన విషయం తెల్సిందే. రెండు పార్ట్లు కూడా సంచలన విజయాన్ని సొంతం చేసుకున్నాయి. జక్కన్న రెండు పార్ట్ల నిర్ణయాన్ని అంతా అభినందించారు. ఇప్పుడు దర్శకుడు శంకర్ కూడా అదే నిర్ణయాన్ని ఫాలో అవ్వబోతున్నట్లుగా తెలుస్తోంది.
సినీ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం ప్రకారం శంకర్ దర్శకత్వంలో కమల్ హాసన్ నటిస్తున్న ఇండియన్ 2 చిత్రం రెండు పార్ట్లుగా రాబోతుందట. సినిమా కథ పెద్దగా ఉండటంతో పాటు బడ్జెట్ విషయంలో పరిధి దాటుతున్న కారణంగా ఈ చిత్రంను రెండు పార్ట్లుగా విడుదల చేస్తేనే అన్ని విధాలుగా బాగుంటుందనే అభిప్రాయంలో చిత్ర యూనిట్ సభ్యులు ఉన్నారట.
దర్శకుడు శంకర్ లాక్డౌన్ ఎత్తివేసిన వెంటనే షూటింగ్కు ఏర్పాట్లు చేస్తున్నాడు. కొన్ని రోజుల క్రితం క్రేన్ యాక్సిడెంట్ అవ్వడంతో మళ్లీ సినిమా ప్రారంభం అవుతుందా లేదా అనే అనుమానాలు వ్యక్తం అయ్యాయి. కాని ఇటీవలై లైకా ప్రొడక్షన్స్ వారు ఆ వార్తలను కొట్టి పారేసి త్వరలోనే షూటింగ్ను ప్రారంభించబోతున్నట్లుగా ప్రకటించారు. ఇప్పుడు సినిమా రెండు పార్ట్లు అంటూ వార్తలు వస్తున్నాయి. ఈ విషయమై క్లారిటీ రావాల్సి ఉంది.
175944 794001Oh my goodness! an exceptional article dude. Thanks a lot Even so Im experiencing problem with ur rss . Do not know why Struggle to register for it. Can there be any person locating identical rss issue? Anyone who knows kindly respond. Thnkx 524274
681833 380366This will likely be a terrific blog, would you be interested in doing an interview about just how you developed it? If so e-mail me! 816562