Switch to English

ఫ్లాష్ న్యూస్: కరోనాకు భయపడని తల్లి ప్రేమ.. ఎదిరించి గెలిచింది

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,460FansLike
57,764FollowersFollow

కరోనాకు భయపడని తల్లి ప్రేమ.. ఎదిరించి గెలిచింది

చిన్నా పెద్దా ముసలి ముతక అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరిని కూడా కరోనా వైరస్‌ తీవ్రంగా ఇబ్బందులకు గురి చేస్తుంది. ప్రతి చోట కూడా పిల్లలు పెద్దలు అనే తేడా లేకుండా కరోనా రోగులు నమోదు అవుతున్నారు. గత నెలలో చతీస్‌ఘడ్‌లో 17 నెలల పాపకు కరోనా సోకింది. ఆ పాపను ఐసోలేషన్‌లో ఉంచాల్సి వచ్చింది. అయితే కన్న తల్లి లేకుండా ఆ పాప ఉండలేని పరిస్థితి. కరోనా నెగటివ్‌ ఉన్న ఆ తల్లి పాపతో ఉండేందుకు వైధ్యులు ఒప్పుకోలేదు. కాని ఆమె బలవంతంగా పాపతోనే ఉండాలని సిద్దం అయ్యింది.

ప్రత్యేక అనుమతులతో ఆ పాపతోనే మూడు వారాల పాటు ఉంది. ఎట్టకేలకు పాపకు కరోనా నెగటివ్‌ అని తేలింది. మూడు వారాల పాటు బిడ్డతో ఉన్నందుకు గాను తల్లికి కూడా కరోనా పాజిటివ్‌ వచ్చి ఉంటుందని అంతా భావించారు. కాని కరోనా టెస్టులు నిర్వహించగా తల్లికి కరోనా లేదని తేలింది. వైధ్యులు చెప్పిన జాగ్రత్తలు అన్ని విధాలుగా తీసుకోవడంతో కరోనా వైరస్‌ ఆ తల్లిని చేరలేదు. కరోనాపై ఆ తల్లి విజయం సాధించింది అంటూ వైధ్యులు ప్రకటించారు.

కోవిడ్‌ హాస్పిటల్‌లో ఫైర్‌ యాక్సిడెంట్‌

ఫ్లాష్ న్యూస్: విశాఖ గ్యాస్‌ లీకేజీ మృతుల సంఖ్య తగ్గించిన పబ్జీ గేమ్

ప్రపంచ వ్యాప్తంగా కరోనా కరాళ నృత్యం చేస్తున్న ఈ సమయంలో అన్ని దేశాలు కూడా తమ దేశాన్ని కరోనా నుండి కాపాడుకునేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇందులో భాగంగా అన్ని దేశాల్లో కూడా ప్రత్యేక కోవిడ్‌ హాస్పిటల్స్‌ను ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ అత్యంత కట్టుదిట్టమైన భద్రత చర్యలు తీసుకోవడంతో పాటు చాలా జాగ్రత్తగా పేషంట్స్‌ను చూసుకుంటున్నారు. అలాంటి చోట ఫైర్‌ యాక్సిడెంట్‌ జరగడం ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశం అయ్యింది.

రష్యాలోని సెయింట్‌ పీటర్స్‌ బర్గ్‌లోని కోవిడ్‌ హాస్పిటల్‌లో ప్రమాదవశాత్తు అగ్నిప్రమాదం సంభవించింది. ఆ ప్రమాదంలో కోవిడి బాధితులు చిక్కుకున్నారు. ఆ మంటల్లో అయిదుగురు కరోనా రోగులు కాలి బూడిద అయ్యారు. పదుల సంఖ్యలో తీవ్ర గాయాల పాలయ్యారు. మొత్తం 150 మందిని రెస్క్యూ టీం కాపాడి మరో హాస్పిటల్‌కు తరలించడం జరిగింది. రష్యాలో ఇప్పటి వరకు 2.32 లక్షల కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయి. 2116 మంది ఇప్పటి వరకు అక్కడ మరణించారు.

విశాఖ గ్యాస్‌ లీకేజీ మృతుల సంఖ్య తగ్గించిన పబ్జీ గేమ్

ఫ్లాష్ న్యూస్: బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్ కు హోం క్వారంటైన్.! 

విశాఖ ఎల్జీ పాలిమర్స్‌లో గ్యాస్‌ లీక్‌ అయ్యి చుట్టుపక్కల గ్రామాల్లో జనాలు తీవ్ర అస్థతకు గురైన విషయం తెల్సిందే. 12 మంది మృతి చెందగా వందలాది మంది అనారోగ్యం పాలయ్యారు. పశువులు మృతి చెందడటంతో పాటు స్థానిక గ్రామంలోని పశుగ్రాసం, పంటలు అంతా కూడా విశతుల్యం అయ్యాయి. అయితే ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య భారీగా ఉండేది. కాని నీలావు కిరణ్‌ అనే కుర్రాడు చేసిన పనితో 12 మందితో మృతుల సంఖ్య ఆగింది.

అసలు విషయం ఏంటీ అంటే గ్యాస్‌ అర్థరాత్రి సమయంలో లీక్‌ అయ్యింది. ఆ సమయంకే అంతా కూడా నిద్ర పోయారు. మృతుల్లో ఎక్కువ శాతం మంది నిద్రలోనే మరణించినట్లుగా గుర్తించారు.

అర్థరాత్రి దాటిన తర్వాత నీలావు కిరణ్‌ పబ్జీ గేమ్‌ ఆడుతూ ఉండగా అతడికి గ్యాస్‌ వాసన వచ్చింది. వెంటనే అతడు అర్ట్‌ అయ్యి తన కుటుంబ సభ్యులను లేపడంతో పాటు పలువురు స్నేహితులకు ఫోన్‌ చేసి నిద్ర లేపాడు. వారు నిద్రలేచి వారి కుటుంబాలను పక్కింటి వారిని లేపడంతో అలా వందలాది మంది కిరణ్‌ వల్ల నిద్ర లేచారు. లేదంటే వారు నిద్రలోనే ఉండి ఉంటే మృతుల సంఖ్య మరింత ఎక్కువగా ఉండేదంటూ స్థానికులు చెబుతున్నారు.

బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్ కు హోం క్వారంటైన్.! 

ఫ్లాష్ న్యూస్: మంత్రి కేటీఆర్‌కు అనారోగ్యం, అసలేం అయ్యిందంటే..!

లాక్ డౌన్ కారణంగా విజయవాడలోనే ఉంటున్న ప్రముఖ బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపిచంద్ ఒక అత్యవసర పని పడడంతో పర్మిషన్ తీసుకొని హైదరాబాద్ బయలుదేరారు. సూర్యాపేట జిల్లా కోదాడ మండలంలోని రామాపురం చెక్ పోస్ట్ వద్ద గోపీచంద్ కు తెలంగాణ వైద్య ఆరోగ్య సిబ్బంది ఆరోగ్య పరీక్షలు నిర్వహించింది. ఆయన నార్మల్ గా ఉండడంతో హోమ్ క్వారంటైన్ టాగ్ వేశారు. ఈ విషయంపై తెలంగాణ వైద్య ఆరోగ్య సిబ్బంది స్పందిస్తూ  ‘ఆంధ్రా నుంచి తెలంగాణలోకి వచ్చే ప్రతి ప్రయాణికుడికి ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తున్నామని, ఏమి లేనివారికి హోం క్వారంటైన్ ముద్ర వేస్తున్నామని’ చెప్పారు.

మంత్రి కేటీఆర్‌కు అనారోగ్యం, అసలేం అయ్యిందంటే..!

ఫ్లాష్ న్యూస్: ఈ కన్న తల్లికి వచ్చిన పరిస్థితి మరెవ్వరికి రాకూడదు

తెలంగాణ ఐటీ మంత్రి, టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఎప్పుడు ఉత్సాహంగా నలుగురితో నవ్వుతూ ఉంటాడు. అయితే నిన్న సొంత నియోజకవర్గంలో పర్యటించిన ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నట్లుగా కనిపించాడు. జలుబు మరియు దగ్గుతో ఆయన బాధపడుతున్నాడు. ఎప్పుడు లేనిది చేతిలో రుమాలును వాడుతూ పదే పదే ఆయన ముక్కు తూడ్చుకోవడం చేశాడు.

నియోజక వర్గంలో పలు అభివృద్ది కార్యక్రమాలకు శంకుస్థాపన చేయాల్సి ఉండగా కార్యక్రమాలను మద్యలోనే రద్దు చేసుకుని తిరిగి హైదరాబాద్‌ చేరుకున్నాడు. వాతావరణ మార్పు మరియు ఇతరత్ర కారణాల వల్ల కేటీఆర్‌కు జలుబు చేసి ఉంటుందని పార్టీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇదే సమయంలో ఆయన శ్రేయోభిలాషులు ఒకసారి కరోనా పరీక్ష చేయించుకుంటే మంచిదని సూచిస్తున్నారు.

ఈ కన్న తల్లికి వచ్చిన పరిస్థితి మరెవ్వరికి రాకూడదు

ఈ కన్న తల్లికి వచ్చిన పరిస్థితి మరెవ్వరికి రాకూడదు

కరోనా కారణంగా లాక్‌ డౌన్‌ అమలులో ఉన్న నేపథ్యంలో చావుకు 10 మంది పెళ్లికి 20 మందిని అనుమతిస్తూ ప్రభుత్వాలు నిర్ణయం తీసుకున్న విషయం తెల్సిందే. అయిదే భద్రాచలంలో మాత్రం ఒక బాలుడు చనిపోతే కనీసం ఇద్దరు ముగ్గురు కూడా లేకపోవడంతో ఒక రిక్షాలో డెడ్‌ బాడీని తీసుకు వెళ్లి అంత్యక్రియలు నిర్వహించారు. ఆ కన్న తల్లి బాధ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది.

పూర్తి వివరాల్లోకి వెళ్తే.. భద్రాచలం సుందరయ్య నగర్‌కు చెందిన ఫరీదా భర్త పదేళ్ల క్రితం చనిపోయాడు. ఇద్దరు కొడుకులను అన్ని తానై పెంచింది. చిన్న కొడుకు గుండె సంబంధిత జబ్బుతో బాధపడుతున్నాడు. తాజాగా 12 ఏళ్ల సాదిక్‌ తీవ్రమైన గుండె నొప్పితో మృతి చెందాడు. సాదిక్‌ అంత్యక్రియలకు స్థానికులు మరియు బంధువులు ఎవరు రాలేదు. దాంతో సాదిక్‌ తాత స్వయంగా ఒక రిక్షా ఏర్పాటు చేసి అందులో అంతిమ యాత్ర నిర్వహించి  గోదావరి ఒడ్డున సాదిక్‌ మృతదేహంను పూడ్చి పెట్టాడు. తన కొడుకు చనిపోయాడన్న బాధతో పాటు అంత్యక్రియలు ఇలా చేయాల్సి రావడంతో ఆ తల్లి బాధ వర్ణనాతీతం. ఇలాంటి దారుణ పరిస్థితులు ఈ ప్రపంచంలో మరెవ్వరికి రావద్దంటూ ఆ తల్లి తల్లడిల్లి పోయింది.

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Movie: శ్రీ కమలహాసిని మూవీ మేకర్స్ ప్రొడక్షన్ నెం.1 మూవీ ప్రారంభం

Movie: ప్రస్తుతం ట్రెండ్ కంటెంట్, కాన్సెప్ట్ ఉన్న సినిమాలదే. అలా వచ్చిన సినిమాలను ప్రేక్షకులు ఆదరిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శ్రీ కమలహాసిని మూవీ...

Samantha: ఈసారి సరికొత్త లుక్.. పుట్టినరోజున ‘సమంత’ కొత్త సినిమా అప్డేట్

Samantha: సౌత్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha) కొన్నాళ్లుగా సినిమాలు చేయడం లేదు. సమంత నుంచి కొత్త సినిమా కబురు కోసం ఆమె అభిమానులు ఎప్పటినుంచో...

Chiranjeevi: లేటెస్ట్ అప్డేట్..! చిరంజీవి ‘విశ్వంభర’ కోసం భారీ సెట్స్..

Chiranjeevi: మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi) నటిస్తున్న సినిమా ‘విశ్వంభర’. (Vishwambhara) వశిష్ఠ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా యూవీ క్రియేషన్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. చిరంజీవి...

Varun Tej: ‘ప్రజలే పవన్ కల్యాణ్ కుటుంబం..’ జనసేన ప్రచారంలో వరుణ్...

Varun Tej: ఏపీలో ఎన్నికల హీట్ రోజురోజుకీ పెరుగుతోంది. నేతలంతా ప్రచారాలతో హోరెత్తిస్తున్నారు. ఈక్రమంలో బాబాయి పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కు మద్దతుగా.. జనసేన...

Faria Abdullah: ఈరోజుల్లో ‘ఆ ఒక్కటీ అడక్కు’ కంటెంట్ అవసరం: ఫరియా...

Faria Abdullah: అల్లరి నరేశ్ (Allari Naresh)-ఫరియా అబ్దుల్లా (Faria Abdullah) హీరోహీరోయిన్లుగా నటించిన సినిమా ‘ఆ ఒక్కటీ అడక్కు' (Aa Okkati Adakku). త్వరలో...

రాజకీయం

Janasena: ‘జనసేన’కు ఈసీ గుడ్ న్యూస్.. కామన్ సింబల్ గా ‘గ్లాసు’ గుర్తు..

Janasena: జనసేన (Janasena) పార్టీకి కేంద్ర ఎన్నికల కమిషన్ శుభవార్త చెప్పింది. పార్టీకి కామన్ సింబల్ గా ‘గాజు గ్లాస్’ గుర్తు కేటాయించాలని ఆదేశాలు జారీ చేసింది. ఈమేరకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్...

వైఎస్ షర్మిల ఎఫెక్ట్: క్రిస్టియన్ ఓట్లు వైసీపీకి దూరమయినట్టేనా.?

వైఎస్ షర్మిల, పదే పదే ‘క్రిస్టియన్’ ప్రస్తావన తీసుకొస్తున్నారు ఎన్నికల ప్రచారంలో. ‘మన మతం..’ అంటూ అన్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ‘క్రిస్టియానిటీ’ని గుర్తు చేస్తున్నారామె.! ఇంకోపక్క, వైఎస్ జగన్ మేనత్త...

ఇన్‌సైడ్ స్టోరీ: తునిలో కూటమికి అలా సెట్టయ్యింది.!

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని తుని నియోజకవర్గం విషయమై నిన్న మొన్నటిదాకా కూటమిలో కొంత గందరగోళం వుండేది. సీట్ల పంపకాల్లో తుని నియోజకవర్గం టీడీపీకి దక్కింది. మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు కుమార్తె యనమల...

పిఠాపురంలో వరుణ్ తేజ్ ప్రచారంపై వైసీపీ ఏడుపు.!

వైసీపీ కంటే, వైసీపీ పెంచి పోషిస్తోన్న నీలి కూలి మీడియా ఎక్కువ బాధపడిపోతోంది కొన్ని విషయాల్లో. సినీ నటుడు వరుణ్ తేజ్, పిఠాపురం నియోజకవర్గంలో జనసేన పార్టీ తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహిస్తే,...

నవరత్నాలు ప్లస్సు కాదు.. ఇప్పుడు మైనస్.!

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, ఎన్నికల మేనిఫెస్టో ప్రకటించింది. దీనికి ‘నవరత్నాలు ప్లస్’ అని పేరు పెట్టుకుంది ఆ పార్టీ. రైతులకు రుణ మాఫీ సహా, పలు కీలక అంశాలు కొత్త మేనిఫెస్టోలో వైసీపీ...

ఎక్కువ చదివినవి

సింగిల్ సింహం కాదు సజ్జలా.! అది రేబిస్ సోకిన కుక్క.!

‘మెగాస్టార్ చిరంజీవి గురించి మాట్లాడేటప్పుడు నోరు జాగ్రత్త.! నోటికొచ్చినట్లు మాట్లాడితే బాగోదు.!’ అంటూ స్వీట్ వార్నింగ్ ఇచ్చారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్, అది కూడా వైసీపీ ముఖ్య నేతల్లో ఒకరైన సజ్జల...

గ్రౌండ్ రిపోర్ట్: మంగళగిరిలో నారా లోకేష్‌కి సానుకూలమేనా.?

‘ఓడిపోయాడు, నియోజకవర్గం మార్చేస్తాడు..’ అంటూ నారా లోకేష్ గురించి నానా రకాల ప్రచారమూ జరిగింది. 2019 ఎన్నికల్లో నారా లోకేష్ రిస్క్ తీసుకుని మరీ, మంగళగిరి నియోజకవర్గాన్ని ఎంచుకున్నారని టీడీపీ చెబుతుంటుంది. అందులో...

చెల్లెలి చీర రంగు మీద పడి ఏడ్చేవాళ్ళని ఏమనగలం.?

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి ఆయన ప్రస్తుతానికి.! ఎన్నికల తర్వాత ఆ పదవి వుంటుందా.? ఊడుతుందా.? అన్నది వేరే చర్చ. ఓ రాజకీయ పార్టీకి అధినేత కూడా.! ఎంత బాధ్యతగా మాట్లాడాలి.? అదీ కుటుంబ...

Viral News: మాజీ క్రికెటర్ పై చిరుత దాడి.. పోరాడి కాపాడిన పెంపుడు శునకం

Viral News: పెంపుడు జంతువులు మనుషులపై ఎంతటి ప్రేమ చూపిస్తాయో తెలిపేందుకు జింబాబ్వేలో జరిగిన ఘటనే నిదర్శనం. జింబాబ్వే (zimbabwe) మాజీ క్రికెటర్ గయ్ విట్టల్ (Guy Whittal) పై చిరుతపులి దాడి...

‘సాక్షి’ పత్రికని బలవంతంగా అంటగడుతున్నారెందుకు.?

సాక్షి పత్రికని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఉచితంగా పంచి పెడుతున్నారట.! ఈనాడు, ఆంధ్ర జ్యోతి పత్రికలదీ అదే పరిస్థితి అట.! అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో, ఆంధ్ర ప్రదేశ్‌లో ఈ ‘ఉచిత...