Switch to English

ఫ్లాష్ న్యూస్: కరోనాకు భయపడని తల్లి ప్రేమ.. ఎదిరించి గెలిచింది

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,467FansLike
57,764FollowersFollow

కరోనాకు భయపడని తల్లి ప్రేమ.. ఎదిరించి గెలిచింది

చిన్నా పెద్దా ముసలి ముతక అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరిని కూడా కరోనా వైరస్‌ తీవ్రంగా ఇబ్బందులకు గురి చేస్తుంది. ప్రతి చోట కూడా పిల్లలు పెద్దలు అనే తేడా లేకుండా కరోనా రోగులు నమోదు అవుతున్నారు. గత నెలలో చతీస్‌ఘడ్‌లో 17 నెలల పాపకు కరోనా సోకింది. ఆ పాపను ఐసోలేషన్‌లో ఉంచాల్సి వచ్చింది. అయితే కన్న తల్లి లేకుండా ఆ పాప ఉండలేని పరిస్థితి. కరోనా నెగటివ్‌ ఉన్న ఆ తల్లి పాపతో ఉండేందుకు వైధ్యులు ఒప్పుకోలేదు. కాని ఆమె బలవంతంగా పాపతోనే ఉండాలని సిద్దం అయ్యింది.

ప్రత్యేక అనుమతులతో ఆ పాపతోనే మూడు వారాల పాటు ఉంది. ఎట్టకేలకు పాపకు కరోనా నెగటివ్‌ అని తేలింది. మూడు వారాల పాటు బిడ్డతో ఉన్నందుకు గాను తల్లికి కూడా కరోనా పాజిటివ్‌ వచ్చి ఉంటుందని అంతా భావించారు. కాని కరోనా టెస్టులు నిర్వహించగా తల్లికి కరోనా లేదని తేలింది. వైధ్యులు చెప్పిన జాగ్రత్తలు అన్ని విధాలుగా తీసుకోవడంతో కరోనా వైరస్‌ ఆ తల్లిని చేరలేదు. కరోనాపై ఆ తల్లి విజయం సాధించింది అంటూ వైధ్యులు ప్రకటించారు.

కోవిడ్‌ హాస్పిటల్‌లో ఫైర్‌ యాక్సిడెంట్‌

ఫ్లాష్ న్యూస్: విశాఖ గ్యాస్‌ లీకేజీ మృతుల సంఖ్య తగ్గించిన పబ్జీ గేమ్

ప్రపంచ వ్యాప్తంగా కరోనా కరాళ నృత్యం చేస్తున్న ఈ సమయంలో అన్ని దేశాలు కూడా తమ దేశాన్ని కరోనా నుండి కాపాడుకునేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇందులో భాగంగా అన్ని దేశాల్లో కూడా ప్రత్యేక కోవిడ్‌ హాస్పిటల్స్‌ను ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ అత్యంత కట్టుదిట్టమైన భద్రత చర్యలు తీసుకోవడంతో పాటు చాలా జాగ్రత్తగా పేషంట్స్‌ను చూసుకుంటున్నారు. అలాంటి చోట ఫైర్‌ యాక్సిడెంట్‌ జరగడం ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశం అయ్యింది.

రష్యాలోని సెయింట్‌ పీటర్స్‌ బర్గ్‌లోని కోవిడ్‌ హాస్పిటల్‌లో ప్రమాదవశాత్తు అగ్నిప్రమాదం సంభవించింది. ఆ ప్రమాదంలో కోవిడి బాధితులు చిక్కుకున్నారు. ఆ మంటల్లో అయిదుగురు కరోనా రోగులు కాలి బూడిద అయ్యారు. పదుల సంఖ్యలో తీవ్ర గాయాల పాలయ్యారు. మొత్తం 150 మందిని రెస్క్యూ టీం కాపాడి మరో హాస్పిటల్‌కు తరలించడం జరిగింది. రష్యాలో ఇప్పటి వరకు 2.32 లక్షల కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయి. 2116 మంది ఇప్పటి వరకు అక్కడ మరణించారు.

విశాఖ గ్యాస్‌ లీకేజీ మృతుల సంఖ్య తగ్గించిన పబ్జీ గేమ్

ఫ్లాష్ న్యూస్: బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్ కు హోం క్వారంటైన్.! 

విశాఖ ఎల్జీ పాలిమర్స్‌లో గ్యాస్‌ లీక్‌ అయ్యి చుట్టుపక్కల గ్రామాల్లో జనాలు తీవ్ర అస్థతకు గురైన విషయం తెల్సిందే. 12 మంది మృతి చెందగా వందలాది మంది అనారోగ్యం పాలయ్యారు. పశువులు మృతి చెందడటంతో పాటు స్థానిక గ్రామంలోని పశుగ్రాసం, పంటలు అంతా కూడా విశతుల్యం అయ్యాయి. అయితే ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య భారీగా ఉండేది. కాని నీలావు కిరణ్‌ అనే కుర్రాడు చేసిన పనితో 12 మందితో మృతుల సంఖ్య ఆగింది.

అసలు విషయం ఏంటీ అంటే గ్యాస్‌ అర్థరాత్రి సమయంలో లీక్‌ అయ్యింది. ఆ సమయంకే అంతా కూడా నిద్ర పోయారు. మృతుల్లో ఎక్కువ శాతం మంది నిద్రలోనే మరణించినట్లుగా గుర్తించారు.

అర్థరాత్రి దాటిన తర్వాత నీలావు కిరణ్‌ పబ్జీ గేమ్‌ ఆడుతూ ఉండగా అతడికి గ్యాస్‌ వాసన వచ్చింది. వెంటనే అతడు అర్ట్‌ అయ్యి తన కుటుంబ సభ్యులను లేపడంతో పాటు పలువురు స్నేహితులకు ఫోన్‌ చేసి నిద్ర లేపాడు. వారు నిద్రలేచి వారి కుటుంబాలను పక్కింటి వారిని లేపడంతో అలా వందలాది మంది కిరణ్‌ వల్ల నిద్ర లేచారు. లేదంటే వారు నిద్రలోనే ఉండి ఉంటే మృతుల సంఖ్య మరింత ఎక్కువగా ఉండేదంటూ స్థానికులు చెబుతున్నారు.

బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్ కు హోం క్వారంటైన్.! 

ఫ్లాష్ న్యూస్: మంత్రి కేటీఆర్‌కు అనారోగ్యం, అసలేం అయ్యిందంటే..!

లాక్ డౌన్ కారణంగా విజయవాడలోనే ఉంటున్న ప్రముఖ బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపిచంద్ ఒక అత్యవసర పని పడడంతో పర్మిషన్ తీసుకొని హైదరాబాద్ బయలుదేరారు. సూర్యాపేట జిల్లా కోదాడ మండలంలోని రామాపురం చెక్ పోస్ట్ వద్ద గోపీచంద్ కు తెలంగాణ వైద్య ఆరోగ్య సిబ్బంది ఆరోగ్య పరీక్షలు నిర్వహించింది. ఆయన నార్మల్ గా ఉండడంతో హోమ్ క్వారంటైన్ టాగ్ వేశారు. ఈ విషయంపై తెలంగాణ వైద్య ఆరోగ్య సిబ్బంది స్పందిస్తూ  ‘ఆంధ్రా నుంచి తెలంగాణలోకి వచ్చే ప్రతి ప్రయాణికుడికి ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తున్నామని, ఏమి లేనివారికి హోం క్వారంటైన్ ముద్ర వేస్తున్నామని’ చెప్పారు.

మంత్రి కేటీఆర్‌కు అనారోగ్యం, అసలేం అయ్యిందంటే..!

ఫ్లాష్ న్యూస్: ఈ కన్న తల్లికి వచ్చిన పరిస్థితి మరెవ్వరికి రాకూడదు

తెలంగాణ ఐటీ మంత్రి, టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఎప్పుడు ఉత్సాహంగా నలుగురితో నవ్వుతూ ఉంటాడు. అయితే నిన్న సొంత నియోజకవర్గంలో పర్యటించిన ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నట్లుగా కనిపించాడు. జలుబు మరియు దగ్గుతో ఆయన బాధపడుతున్నాడు. ఎప్పుడు లేనిది చేతిలో రుమాలును వాడుతూ పదే పదే ఆయన ముక్కు తూడ్చుకోవడం చేశాడు.

నియోజక వర్గంలో పలు అభివృద్ది కార్యక్రమాలకు శంకుస్థాపన చేయాల్సి ఉండగా కార్యక్రమాలను మద్యలోనే రద్దు చేసుకుని తిరిగి హైదరాబాద్‌ చేరుకున్నాడు. వాతావరణ మార్పు మరియు ఇతరత్ర కారణాల వల్ల కేటీఆర్‌కు జలుబు చేసి ఉంటుందని పార్టీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇదే సమయంలో ఆయన శ్రేయోభిలాషులు ఒకసారి కరోనా పరీక్ష చేయించుకుంటే మంచిదని సూచిస్తున్నారు.

ఈ కన్న తల్లికి వచ్చిన పరిస్థితి మరెవ్వరికి రాకూడదు

ఈ కన్న తల్లికి వచ్చిన పరిస్థితి మరెవ్వరికి రాకూడదు

కరోనా కారణంగా లాక్‌ డౌన్‌ అమలులో ఉన్న నేపథ్యంలో చావుకు 10 మంది పెళ్లికి 20 మందిని అనుమతిస్తూ ప్రభుత్వాలు నిర్ణయం తీసుకున్న విషయం తెల్సిందే. అయిదే భద్రాచలంలో మాత్రం ఒక బాలుడు చనిపోతే కనీసం ఇద్దరు ముగ్గురు కూడా లేకపోవడంతో ఒక రిక్షాలో డెడ్‌ బాడీని తీసుకు వెళ్లి అంత్యక్రియలు నిర్వహించారు. ఆ కన్న తల్లి బాధ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది.

పూర్తి వివరాల్లోకి వెళ్తే.. భద్రాచలం సుందరయ్య నగర్‌కు చెందిన ఫరీదా భర్త పదేళ్ల క్రితం చనిపోయాడు. ఇద్దరు కొడుకులను అన్ని తానై పెంచింది. చిన్న కొడుకు గుండె సంబంధిత జబ్బుతో బాధపడుతున్నాడు. తాజాగా 12 ఏళ్ల సాదిక్‌ తీవ్రమైన గుండె నొప్పితో మృతి చెందాడు. సాదిక్‌ అంత్యక్రియలకు స్థానికులు మరియు బంధువులు ఎవరు రాలేదు. దాంతో సాదిక్‌ తాత స్వయంగా ఒక రిక్షా ఏర్పాటు చేసి అందులో అంతిమ యాత్ర నిర్వహించి  గోదావరి ఒడ్డున సాదిక్‌ మృతదేహంను పూడ్చి పెట్టాడు. తన కొడుకు చనిపోయాడన్న బాధతో పాటు అంత్యక్రియలు ఇలా చేయాల్సి రావడంతో ఆ తల్లి బాధ వర్ణనాతీతం. ఇలాంటి దారుణ పరిస్థితులు ఈ ప్రపంచంలో మరెవ్వరికి రావద్దంటూ ఆ తల్లి తల్లడిల్లి పోయింది.

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Nani: ‘జెర్సీ’ @5..! ధియేటర్లో సినిమా చూసిన నాని.. ఎమోషనల్ పోస్ట్

Nani: నాని (Nani) హీరోగా గౌతమ్ తిన్ననూరి (Gowtham Thinnanuri) దర్శకత్వంలో వచ్చిన ‘జెర్సీ’ (Jersey) విడుదలై నిన్నటికి 5ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా సినిమాను...

Upasana: ఆవకాయ పట్టిన అత్తమ్మ.. ఆటపట్టించిన ఉపాసన.. వీడియో వైరల్  

Upasana: టాలీవుడ్ (Tollywood) లో మెగా ఫ్యామిలీ (Mega Family) అంటే ఒక సందడి. ఒక బ్రాండ్. ముఖ్యంగా చిరంజీవి (Chiranjeevi). ఆయనొక ఇన్ స్పిరేషన్...

Puri Jagannadh: ఎవరు కొడితే బొమ్మ బ్లాక్ బస్టరవుద్దో.. అతనే ‘పూరి...

Puri Jagannadh: సినిమాకి హీరోకి ఉండే క్రేజే వేరు. సరైన సినిమాపడి స్టార్ స్టేటస్ వస్తే ఫ్యాన్స్ పెరుగుతారు.. డెమీ గాడ్ కూడా అయిపోతాడు. హీరో...

Harish Shankar: చోటా కె.నాయుడుపై హరీశ్ శంకర్ ఆగ్రహం.. బహిరంగ లేఖ

Harish Shankar: టాలీవుడ్ (Tollywood) సీనియర్ స్టార్ సినిమాటోగ్రాఫర్ చోటా కె.నాయుడు (Chota K Naidu) పై బ్లాక్ బస్టర్ దర్శకుడు హరీశ్ శంకర్ (Harish...

Mad Square: మ్యాడ్ సీక్వెల్ ‘మ్యాడ్ స్క్వేర్’ ప్రారంభం.. ఫన్ డబుల్...

Mad Square: గతేడాది విడుదలై యూత్ ని ఆకట్టుకున్న సక్సెస్ ఫుల్ మూవీ 'మ్యాడ్' (Mad). ఈ సినిమాకి సీక్వెల్‌ గా 'మ్యాడ్ స్క్వేర్' (Mad...

రాజకీయం

చిరంజీవిపై ‘మూక దాడి’.! వైసీపీకే పెను నష్టం.!

వైఎస్ వివేకానంద రెడ్డికే అక్రమ సంబంధాలు అంటగట్టిన ఘన చరిత్ర వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీది.! వైఎస్ షర్మిలా రెడ్డిని కాస్తా మెరుసుపల్లి షర్మిల శాస్త్రి.. అంటూ ఎగతాళి చేసిన ఘనత వైసీపీకి కాక...

ఏపీలో బీజేపీని ఓడించేయనున్న బీజేపీ మద్దతుదారులు.!

ఇదో చిత్రమైన సందర్భం.! ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీకి, ఆ పార్టీ మద్దతుదారులే శాపంగా మారుతున్నారు. అందరూ అని కాదుగానీ, కొందరి పైత్యం.. పార్టీ కొంప ముంచేస్తోంది.! టీడీపీ - బీజేపీ...

వ్యూహకర్తల మాటే శాసనం.. వారిదే పెత్తనం

దేశ రాజకీయాల్లో వ్యూహకర్తల పాత్ర రోజురోజుకి పెరిగిపోతోంది. గతంలో మాదిరిగా స్థానిక నాయకత్వంతో వ్యూహాలను రచించి ఎత్తుకు పై ఎత్తులు వేసే రోజులు పోయాయి. మరి ముఖ్యంగా ప్రచార పర్వాన్ని వ్యూహకర్తలే శాసిస్తున్నారు....

కులాంతరంలో కూడా రాజకీయ క్రీడ.!

ప్రజల నుంచి ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోవాలి అంటే.. ప్రజలందరికి మంచి చెయ్యటం వ్యక్తులకి సాధ్యం కాదు. అందుకని మనుషులని ఎదో ఒకరకంగా కూడగట్టాలి. ఉద్యోగులు, నిరుద్యోగులు, మహిళలు, రైతులు, కార్మికులు, విద్యార్థులు,...

ఎన్డిఏ కూటమి అభ్యర్థులను గెలిపించండి.. అభిమానులకు మెగాస్టార్ పిలుపు

ఆంధ్రప్రదేశ్ లో త్వరలో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అభ్యర్థులు సీఎం రమేష్, పంచకర్ల రమేష్ బాబును గెలిపించాలంటూ మెగాస్టార్ చిరంజీవి( Chiranjeevi) తన అభిమానులకు పిలుపునిచ్చారు. ఏపీలో చంద్రబాబు నాయుడు,...

ఎక్కువ చదివినవి

Ritu Varma: నభా నటేశ్-ప్రియదర్శికి రీతూవర్మ క్లాస్.. ట్వీట్ వార్ వైరల్

Ritu Varma: హీరోయిన్ నభా నటేశ్ (Nabha Natesh), నటుడు ప్రియదర్శి (Priyadarshi) మధ్య ‘డార్లింగ్’ సంబోధనపై మాటల యుద్ధం వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఇప్పుడీ గొడవలోకి హీరోయిన్ రీతూ వర్మ...

Pushpa 2: ‘పుష్ప-2’పై బాలీవుడ్ దర్శకుడి కామెంట్స్..! నెట్టింట వైరల్

Pushpa 2: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా తెరకెక్కుతున్న సినిమా పుష్ప ది రూల్ (పుష్ప-2). (Pushpa 2) సుకుమార్ (Sukumar) దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాపై దేశవ్యాప్తంగా భారీ...

చిరంజీవిపై ‘మూక దాడి’.! వైసీపీకే పెను నష్టం.!

వైఎస్ వివేకానంద రెడ్డికే అక్రమ సంబంధాలు అంటగట్టిన ఘన చరిత్ర వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీది.! వైఎస్ షర్మిలా రెడ్డిని కాస్తా మెరుసుపల్లి షర్మిల శాస్త్రి.. అంటూ ఎగతాళి చేసిన ఘనత వైసీపీకి కాక...

కులాంతరంలో కూడా రాజకీయ క్రీడ.!

ప్రజల నుంచి ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోవాలి అంటే.. ప్రజలందరికి మంచి చెయ్యటం వ్యక్తులకి సాధ్యం కాదు. అందుకని మనుషులని ఎదో ఒకరకంగా కూడగట్టాలి. ఉద్యోగులు, నిరుద్యోగులు, మహిళలు, రైతులు, కార్మికులు, విద్యార్థులు,...

ఎలక్షన్ కమిషన్ నెక్స్ట్ టార్గెట్ ఏపీ సీఎస్, డీజీపీ!

ఆంధ్రప్రదేశ్ లో త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలపై కేంద్ర ఎన్నికల సంఘం దృష్టి సారించింది. ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించాలన్న ఉద్దేశంతో ఫిర్యాదులు అందిన పలువురు సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను ఇప్పటికే బదిలీ...