కరోనాకు భయపడని తల్లి ప్రేమ.. ఎదిరించి గెలిచింది
చిన్నా పెద్దా ముసలి ముతక అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరిని కూడా కరోనా వైరస్ తీవ్రంగా ఇబ్బందులకు గురి చేస్తుంది. ప్రతి చోట కూడా పిల్లలు పెద్దలు అనే తేడా లేకుండా కరోనా రోగులు నమోదు అవుతున్నారు. గత నెలలో చతీస్ఘడ్లో 17 నెలల పాపకు కరోనా సోకింది. ఆ పాపను ఐసోలేషన్లో ఉంచాల్సి వచ్చింది. అయితే కన్న తల్లి లేకుండా ఆ పాప ఉండలేని పరిస్థితి. కరోనా నెగటివ్ ఉన్న ఆ తల్లి పాపతో ఉండేందుకు వైధ్యులు ఒప్పుకోలేదు. కాని ఆమె బలవంతంగా పాపతోనే ఉండాలని సిద్దం అయ్యింది.
ప్రత్యేక అనుమతులతో ఆ పాపతోనే మూడు వారాల పాటు ఉంది. ఎట్టకేలకు పాపకు కరోనా నెగటివ్ అని తేలింది. మూడు వారాల పాటు బిడ్డతో ఉన్నందుకు గాను తల్లికి కూడా కరోనా పాజిటివ్ వచ్చి ఉంటుందని అంతా భావించారు. కాని కరోనా టెస్టులు నిర్వహించగా తల్లికి కరోనా లేదని తేలింది. వైధ్యులు చెప్పిన జాగ్రత్తలు అన్ని విధాలుగా తీసుకోవడంతో కరోనా వైరస్ ఆ తల్లిని చేరలేదు. కరోనాపై ఆ తల్లి విజయం సాధించింది అంటూ వైధ్యులు ప్రకటించారు.
కోవిడ్ హాస్పిటల్లో ఫైర్ యాక్సిడెంట్
ప్రపంచ వ్యాప్తంగా కరోనా కరాళ నృత్యం చేస్తున్న ఈ సమయంలో అన్ని దేశాలు కూడా తమ దేశాన్ని కరోనా నుండి కాపాడుకునేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇందులో భాగంగా అన్ని దేశాల్లో కూడా ప్రత్యేక కోవిడ్ హాస్పిటల్స్ను ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ అత్యంత కట్టుదిట్టమైన భద్రత చర్యలు తీసుకోవడంతో పాటు చాలా జాగ్రత్తగా పేషంట్స్ను చూసుకుంటున్నారు. అలాంటి చోట ఫైర్ యాక్సిడెంట్ జరగడం ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశం అయ్యింది.
రష్యాలోని సెయింట్ పీటర్స్ బర్గ్లోని కోవిడ్ హాస్పిటల్లో ప్రమాదవశాత్తు అగ్నిప్రమాదం సంభవించింది. ఆ ప్రమాదంలో కోవిడి బాధితులు చిక్కుకున్నారు. ఆ మంటల్లో అయిదుగురు కరోనా రోగులు కాలి బూడిద అయ్యారు. పదుల సంఖ్యలో తీవ్ర గాయాల పాలయ్యారు. మొత్తం 150 మందిని రెస్క్యూ టీం కాపాడి మరో హాస్పిటల్కు తరలించడం జరిగింది. రష్యాలో ఇప్పటి వరకు 2.32 లక్షల కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. 2116 మంది ఇప్పటి వరకు అక్కడ మరణించారు.
విశాఖ గ్యాస్ లీకేజీ మృతుల సంఖ్య తగ్గించిన పబ్జీ గేమ్
విశాఖ ఎల్జీ పాలిమర్స్లో గ్యాస్ లీక్ అయ్యి చుట్టుపక్కల గ్రామాల్లో జనాలు తీవ్ర అస్థతకు గురైన విషయం తెల్సిందే. 12 మంది మృతి చెందగా వందలాది మంది అనారోగ్యం పాలయ్యారు. పశువులు మృతి చెందడటంతో పాటు స్థానిక గ్రామంలోని పశుగ్రాసం, పంటలు అంతా కూడా విశతుల్యం అయ్యాయి. అయితే ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య భారీగా ఉండేది. కాని నీలావు కిరణ్ అనే కుర్రాడు చేసిన పనితో 12 మందితో మృతుల సంఖ్య ఆగింది.
అసలు విషయం ఏంటీ అంటే గ్యాస్ అర్థరాత్రి సమయంలో లీక్ అయ్యింది. ఆ సమయంకే అంతా కూడా నిద్ర పోయారు. మృతుల్లో ఎక్కువ శాతం మంది నిద్రలోనే మరణించినట్లుగా గుర్తించారు.
అర్థరాత్రి దాటిన తర్వాత నీలావు కిరణ్ పబ్జీ గేమ్ ఆడుతూ ఉండగా అతడికి గ్యాస్ వాసన వచ్చింది. వెంటనే అతడు అర్ట్ అయ్యి తన కుటుంబ సభ్యులను లేపడంతో పాటు పలువురు స్నేహితులకు ఫోన్ చేసి నిద్ర లేపాడు. వారు నిద్రలేచి వారి కుటుంబాలను పక్కింటి వారిని లేపడంతో అలా వందలాది మంది కిరణ్ వల్ల నిద్ర లేచారు. లేదంటే వారు నిద్రలోనే ఉండి ఉంటే మృతుల సంఖ్య మరింత ఎక్కువగా ఉండేదంటూ స్థానికులు చెబుతున్నారు.
బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్ కు హోం క్వారంటైన్.!
లాక్ డౌన్ కారణంగా విజయవాడలోనే ఉంటున్న ప్రముఖ బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపిచంద్ ఒక అత్యవసర పని పడడంతో పర్మిషన్ తీసుకొని హైదరాబాద్ బయలుదేరారు. సూర్యాపేట జిల్లా కోదాడ మండలంలోని రామాపురం చెక్ పోస్ట్ వద్ద గోపీచంద్ కు తెలంగాణ వైద్య ఆరోగ్య సిబ్బంది ఆరోగ్య పరీక్షలు నిర్వహించింది. ఆయన నార్మల్ గా ఉండడంతో హోమ్ క్వారంటైన్ టాగ్ వేశారు. ఈ విషయంపై తెలంగాణ వైద్య ఆరోగ్య సిబ్బంది స్పందిస్తూ ‘ఆంధ్రా నుంచి తెలంగాణలోకి వచ్చే ప్రతి ప్రయాణికుడికి ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తున్నామని, ఏమి లేనివారికి హోం క్వారంటైన్ ముద్ర వేస్తున్నామని’ చెప్పారు.
మంత్రి కేటీఆర్కు అనారోగ్యం, అసలేం అయ్యిందంటే..!
తెలంగాణ ఐటీ మంత్రి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎప్పుడు ఉత్సాహంగా నలుగురితో నవ్వుతూ ఉంటాడు. అయితే నిన్న సొంత నియోజకవర్గంలో పర్యటించిన ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నట్లుగా కనిపించాడు. జలుబు మరియు దగ్గుతో ఆయన బాధపడుతున్నాడు. ఎప్పుడు లేనిది చేతిలో రుమాలును వాడుతూ పదే పదే ఆయన ముక్కు తూడ్చుకోవడం చేశాడు.
నియోజక వర్గంలో పలు అభివృద్ది కార్యక్రమాలకు శంకుస్థాపన చేయాల్సి ఉండగా కార్యక్రమాలను మద్యలోనే రద్దు చేసుకుని తిరిగి హైదరాబాద్ చేరుకున్నాడు. వాతావరణ మార్పు మరియు ఇతరత్ర కారణాల వల్ల కేటీఆర్కు జలుబు చేసి ఉంటుందని పార్టీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇదే సమయంలో ఆయన శ్రేయోభిలాషులు ఒకసారి కరోనా పరీక్ష చేయించుకుంటే మంచిదని సూచిస్తున్నారు.
ఈ కన్న తల్లికి వచ్చిన పరిస్థితి మరెవ్వరికి రాకూడదు
కరోనా కారణంగా లాక్ డౌన్ అమలులో ఉన్న నేపథ్యంలో చావుకు 10 మంది పెళ్లికి 20 మందిని అనుమతిస్తూ ప్రభుత్వాలు నిర్ణయం తీసుకున్న విషయం తెల్సిందే. అయిదే భద్రాచలంలో మాత్రం ఒక బాలుడు చనిపోతే కనీసం ఇద్దరు ముగ్గురు కూడా లేకపోవడంతో ఒక రిక్షాలో డెడ్ బాడీని తీసుకు వెళ్లి అంత్యక్రియలు నిర్వహించారు. ఆ కన్న తల్లి బాధ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
పూర్తి వివరాల్లోకి వెళ్తే.. భద్రాచలం సుందరయ్య నగర్కు చెందిన ఫరీదా భర్త పదేళ్ల క్రితం చనిపోయాడు. ఇద్దరు కొడుకులను అన్ని తానై పెంచింది. చిన్న కొడుకు గుండె సంబంధిత జబ్బుతో బాధపడుతున్నాడు. తాజాగా 12 ఏళ్ల సాదిక్ తీవ్రమైన గుండె నొప్పితో మృతి చెందాడు. సాదిక్ అంత్యక్రియలకు స్థానికులు మరియు బంధువులు ఎవరు రాలేదు. దాంతో సాదిక్ తాత స్వయంగా ఒక రిక్షా ఏర్పాటు చేసి అందులో అంతిమ యాత్ర నిర్వహించి గోదావరి ఒడ్డున సాదిక్ మృతదేహంను పూడ్చి పెట్టాడు. తన కొడుకు చనిపోయాడన్న బాధతో పాటు అంత్యక్రియలు ఇలా చేయాల్సి రావడంతో ఆ తల్లి బాధ వర్ణనాతీతం. ఇలాంటి దారుణ పరిస్థితులు ఈ ప్రపంచంలో మరెవ్వరికి రావద్దంటూ ఆ తల్లి తల్లడిల్లి పోయింది.
317712 248313An attention-grabbing dialogue is value comment. I believe which you need to write more on this matter, it wont be a taboo topic even so usually individuals are not sufficient to speak on such topics. To the next. Cheers 442489
436767 632756I dont leave a great deal of comments on plenty of blogs each week but i felt i had to here. A hard-hitting post. 879916
156429 57501I real glad to locate this internet site on bing, just what I was looking for : D likewise saved to bookmarks . 492144