Switch to English

నాలుగో లాక్‌డౌన్‌: తీవ్రంగా నిరాశపర్చిన నరేంద్ర మోడీ

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,470FansLike
57,764FollowersFollow

ఒకటోస్సారి.. రెండోస్సారి.. మూడోస్సారి.. ఇప్పుడు నాలుగోస్సారి లాక్‌డౌన్‌ అమల్లోకి రాబోతోంది. ప్రస్తుతం మూడో సెషన్‌ నడుస్తోంది. నాలుగో సెషన్‌ మే 18 నుంచి ప్రారంభమవుతుంది. అదెలా వుంటుందో మే 18వ తేదీకన్నా ముందే కేంద్రం ప్రకటిస్తుందట. ఇదీ ప్రధాని నరేంద్ర మోడీ ఈ రోజు జాతిని ఉద్దేశించి చేసిన ప్రసంగంలోని కీలక అంశాల్లో ఒకటి. మరో ముఖ్యమైన అంశం కూడా వుంది. అదే, 20 లక్షల కోట్ల ప్యాకేజీ. దీనికి ‘ఆత్మ నిర్భర్‌ భారత్‌ అభియాన్‌’ అనే పేరు పెట్టారు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ.

దేశంలో ప్రతి ఒక్కరికీ మేలు చేసేలా ఈ ప్యాకేజీ వుంటుందనీ, ఆ వివరాలు రేపు కేంద్ర మంత్రి వెల్లడిస్తారనీ మోడీ సెలవిచ్చారు. 20 లక్షల కోట్ల ప్యాకేజీ అంటే చిన్న విషయమేమీ కాదు. ‘ఆ ప్యాకేజీలో నా వాటా ఎంత.?’ అని మొత్తంగా 130 కోట్ల మంది భారతీయులు ఎదురుచూడటం సహజమే. అయితే, అది కూడా పబ్లిసిటీ స్టంట్‌లానే వుండబోతోందా.? అన్న అనుమానాలూ లేకపోలేదు.

ప్రస్తుతం మూడో దశ లాక్‌డౌన్‌ నడుస్తోంది. ఇప్పటిదాకా ఏం సాధించాం.? అన్నది మాత్రం ప్రధాని నరేంద్ర మోడీ చెప్పలేదు. దేశ ప్రజలకు ఈ లాక్‌డౌన్‌ సమయంలో కేంద్రం ఏం చేసింది.? అన్నదీ వివరించలేకపోయారు ప్రధాని మోడీ. భారతీయుల సంకల్ప బలం గురించి ఉపన్యాసం దంచేశారు. నిజమే, ఆ సంకల్ప బలమే లేకపోతే.. దేశం కరోనా వైరస్‌ని ఈ స్థాయిలో తట్టుకునేది కాదు. కానీ, అదొక్కటే సరిపోదు. కేంద్రం, రాష్ట్రాల్ని ఆదుకోవాలి. రాష్ట్రాలు తమ ప్రజల్ని కాపాడుకోవాలి. అలా జరగాలంటే.. కేంద్రం ఇతోదికంగా రాష్ట్రాలకు సాయం అందించాలి. కానీ, ఆ దిశగా కేంద్రం అడుగులు వేయడంలేదు.

ఈ విషయాన్ని రాష్ట్రాలు పదే పదే ప్రస్తావిస్తున్నా.. కేంద్రం తన పని తాను చేసుకుపోతోంది తప్ప.. రాష్ట్రాల ఆవేదనను అర్థం చేసుకోకపోవడం గమనార్హం. మొత్తమ్మీద, ప్రధాని నరేంద్ర మోడీ ఈ రోజు చేసిన ప్రసంగం, యావత్‌ భారతదేశాన్నీ నిరాశలో ముంచేసింది. దేశం మళ్ళీ ఎలా పుంజుకుంటుంది.? కరోనాకి ముందు సరే.. కరోనా తర్వాత తమకు భవిష్యత్తు వుంటుందా.? అన్న ఆవేదన ప్రతి ఒక్కరిలోనూ కలుగుతోంది. ఏమో, భవిష్యత్తు ఏమవుతుందో.. ఆ దేవుడే దిక్కు ఇప్పుడందరికీ.

5 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Tollywood: ‘మిస్టర్.. మాట జారొద్దు..’ నటుడికి హీరోయిన్ ఘాటు రిప్లై

Tollywood: హీరోయిన్ నభా నటేశ్ (Nabha Natesh), నటుడు ప్రియదర్శి (Priyadarshi) మధ్య ట్వీట్ వార్ ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. వివరాల్లోకి వెళ్తే.. ‘హాయ్...

Sandeep Reddy Vanga: బాలీవుడ్ నటుడిపై సందీప్ రెడ్డి ఆగ్రహం.. కారణం...

Sandeep Reddy Vanga: 5ఏళ్ళ క్రితం సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) దర్శకత్వం వహించిన హిందీ సినిమా ‘కబీర్ సింగ్’ (Kabir Singh)....

Jithender Reddy: ‘జితేందర్ రెడ్డి’ నుంచి మంగ్లీ పాట.. “లచ్చిమక్క” విడుదల

Jithender Reddy: బాహుబలి, మిర్చి సినిమాలతో నటుడిగా పేరు తెచ్చుకున్న రాకేష్ వర్రె హీరోగా నటించిన సినిమా ‘జితేందర్ రెడ్డి’ (Jithender Reddy). విరించి వర్మ...

Chiranjeevi: CCTలో 100వసారి రక్తదానం చేసిన మహర్షి రాఘవ.. అభినందించిన చిరంజీవి

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి 26ఏళ్ల క్రితం (1998 అక్టోబర్ 2) ప్రారంభించిన చిరంజీవి చారిటబుల్ ట్రస్టులో నేడు అద్భుతమే జరిగింది. ‘రక్తదానం చేయండి.. ప్రజల ప్రాణాలు...

Nara Rohit: నారా రోహిత్ @20 ‘సుందరకాండ’.. ఫస్ట్ లుక్, రిలీజ్...

Nara Rohit: నారా రోహిత్ (Nara Rohit) హీరోగా నటిస్తున్న 20వ సినిమా ‘సుందరకాండ’. శ్రీరామనవమి పండగ సందర్భంగా చిత్ర బృందం టైటిల్ రివీల్ చేస్తూ...

రాజకీయం

గ్రౌండ్ రిపోర్ట్: నగిరిలో రోజా పరిస్థితేంటి.?

ముచ్చటగా మూడోసారి నగిరి నియోజకవర్గం నుంచి రోజా గెలిచే అవకాశాలున్నాయా.? అంటే, ఛాన్సే లేదంటోంది నగిరి ప్రజానీకం.! నగిరి వైసీపీ మద్దతుదారులదీ ఇదే వాదన.! నగిరి నియోజకవర్గంలో రోజాకి వేరే శతృవులు అవసరం...

పవన్ కళ్యాణ్‌కీ వైఎస్ జగన్‌కీ అదే తేడా.!

ఇతరుల భార్యల్ని ‘పెళ్ళాలు’ అనడాన్ని సభ్య సమాజం హర్షించదు. భార్యల్ని కార్లతో పోల్చడం అత్యంత జుగుప్సాకరం.! ఈ విషయమై కనీస సంస్కారం లేకుండా ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి...

కూలీలపై హత్యా నేరం మోపుతారా.?

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద విజయవాడ నగరం నడిబొడ్డున హత్యాయత్నం జరిగిందంటూ వైసీపీ ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. ఎన్నికల ప్రచారం సందర్భంగా, గుర్తు తెలియని వ్యక్తి విసిరిన...

బి-ఫామ్స్ అందిస్తూ.. ప్రమాణం చేయించిన పవన్ కళ్యాణ్.!

రాజకీయాల్లో ఇదొక కొత్త ఒరవడి.. అనడం అతిశయోక్తి కాదేమో.! జనసేన పార్టీ తరఫున పోటీ చేస్తున్న 21 మంది అసెంబ్లీ అభ్యర్థులు, ఇద్దరు లోక్ సభ అభ్యర్థులకు (తనతో కలుపుకుని) జనసేన అధినేత...

అవినాష్ వర్సెస్ సునీత.! కడపలో వైసీపీ ఖేల్ ఖతం.!

సీబీఐ ఛార్జిషీట్‌లో పేర్కొన్న అంశాల్నే ప్రస్తావిస్తున్నారు మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి కుమార్తె సునీతా రెడ్డి.! 2019 ఎన్నికల సమయంలో వైఎస్ వివేకానంద రెడ్డి హత్య జరిగితే, సీబీఐ విచారణ కోసం...

ఎక్కువ చదివినవి

గ్రౌండ్ రిపోర్ట్: నగిరిలో రోజా పరిస్థితేంటి.?

ముచ్చటగా మూడోసారి నగిరి నియోజకవర్గం నుంచి రోజా గెలిచే అవకాశాలున్నాయా.? అంటే, ఛాన్సే లేదంటోంది నగిరి ప్రజానీకం.! నగిరి వైసీపీ మద్దతుదారులదీ ఇదే వాదన.! నగిరి నియోజకవర్గంలో రోజాకి వేరే శతృవులు అవసరం...

వైసీపీ వద్దే వద్దు: ఉత్తరాంధ్ర గ్రౌండ్ రిపోర్ట్ ఇదీ.!

ఉత్తరాంధ్రలోని మూడు ఉమ్మడి జిల్లాలు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నంలో ఓ చిన్నపాటి గ్రౌండ్ రిపోర్ట్.. ఆంధ్ర ప్రదేశ్ రాజకీయ వర్గాల్లో ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్స్‌కి కారణమవుతోంది.! అసలేంటా గ్రౌండ్ రిపోర్ట్.? ఎవరు చేశారోగానీ, ఈ గ్రౌండ్...

Kannappa: ‘కన్నప్ప’లో బాలీవుడ్ స్టార్ హీరో.. స్వాగతం పలికిన టీమ్

Kannappa: మంచు విష్ణు (Manchu Vishnu) ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న సినిమా ‘కన్నప్ప’ (Kannappa). విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ గా తెరకెక్కుతున్న సినిమాకు ముఖేశ్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నారు,. ఇప్పటికే రిలీజ్...

Raghu Babu: నటుడు రఘుబాబు కారు ఢీకొని బైకర్ మృతి..

Raghu Babu: సినీ నటుడు రఘుబాబు (Raghu Babu) ప్రయాణిస్తున్న కారు ఢీకొని వ్యక్తి మృతి చెందిన ఘటన హైదరాబాద్ పరిధిలో జరిగింది. నల్గొండ బైపాస్ రోడ్డులో జరిగిన ప్రమాదంలో కారు ఢీకొని...

Tollywood: ‘మిస్టర్.. మాట జారొద్దు..’ నటుడికి హీరోయిన్ ఘాటు రిప్లై

Tollywood: హీరోయిన్ నభా నటేశ్ (Nabha Natesh), నటుడు ప్రియదర్శి (Priyadarshi) మధ్య ట్వీట్ వార్ ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. వివరాల్లోకి వెళ్తే.. ‘హాయ్ డార్లింగ్స్.. ఎలా ఉన్నారు..!’ అంటూ ప్రభాస్...